Nellore

News February 21, 2025

నెల్లూరు: ఎంపీడీఓలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ

image

ఉమ్మడి జిల్లాలో నాలుగు మండలాలకు ఎంపీడీవోలను నియమిస్తూ జెడ్పీ సీఈఓ విద్యారమ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాపూరు ఎంపీడీవో ఎం.భవానీని కలువాయికి, చిల్లకూరులో పనిచేస్తున్న ఎం.గోపీని కోటకు, వాకాడు ఏఓ శ్రీనివాసులును వాకాడుకు, తడ ఏఓ మల్లికార్జునును సూళ్లూరుపేట ఎంపీడీవోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

News February 21, 2025

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం

image

సర్వేపల్లి కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. వెంకటాచలం మండలంలోని గొలగమూడి గ్రామానికి చెందిన కొందరు రైతులు గేదెల కోసం పొలాల వద్దకు వెళ్లగా సర్వేపల్లి కాలువలో గుర్తుతెలియని మహిళ(35) మృతదేహం కొట్టుకుపోతుండగా గమనించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. చీకటి పడడంతో మృతదేహం ఆచూకీ తెలయలేదు. మహిళ ప్రమాదవశాత్తు కాలువలో పడిందా, లేక సూసైడ్ చేసుకుందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.

News February 21, 2025

కృష్ణపట్నం పోర్టులో అగ్నిప్రమాదం

image

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కృష్ణపట్నం పోర్టు సౌత్ గెస్ట్‌హౌస్ వద్ద రెన్నోవేషన్ వర్క్‌లో భాగంగా వెల్డింగ్ పనులు జరుగుతుండగా ఒక గదిలో షార్ట్ సర్క్యూట్ వల్ల చిన్న అగ్ని ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన పోర్టు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగలేదని పోర్టు అధికార వర్గాలు తెలిపాయి.

News February 21, 2025

ఈ నెల 23న గ్రూప్ 2 పరీక్షలు: కలెక్టర్

image

జిల్లాలో గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ హాలులో గ్రూప్‌-2 పరీక్షల కోఆర్డినేషన్‌ అధికారి, కందుకూరు సబ్‌ కలెక్టర్‌ టి. శ్రీపూజ, డిఆర్‌వో ఉదయభాస్కర్‌రావుతో కలిసి పరీక్షల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News February 21, 2025

సీఎస్‌తో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న నెల్లూరు కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వ సేవలను ప్రజలందరూ సంతృప్తి చెందేలా పారదర్శకంగా అందించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌ అన్నారు. గురువారం సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌, ఎస్పీ కృష్ణకాంత్‌ పాల్గొన్నారు.

News February 20, 2025

నెల్లూరు చేరుకున్న రెవెన్యూ శాఖ కార్యదర్శి

image

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాం ప్రసాద్ సిసోడియా గురువారం సాయంత్రం నెల్లూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కావలి, ఆత్మకూరు RDOలు స్వాగతం పలికారు. రేపు రెవెన్యూ అధికారులతో సిసోడియా సమావేశ మవుతారని జిల్లా సమాచార శాఖ అధికారి సదారావు ఒక ప్రకటనలో తెలిపారు.

News February 20, 2025

సోమశిల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల నిలిపివేత

image

సోమశిల ప్రాజెక్టు నుంచి గత 2 రోజులుగా 6 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగింది. అయితే, పెరిగిన నీటి ప్రవాహం కారణంగా రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని సమీక్షించిన అధికారులు ఇవాళ ఉదయం 6 క్రస్ట్ గేట్లను మూసివేశారు. దీంతో నీటి విడుదల పూర్తిగా నిలిపివేయబడింది. అధికారులు పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తూ, భవిష్యత్ చర్యలపై సమాలోచనలు చేస్తున్నారు.

News February 20, 2025

నెల్లూరు: బాలికకు ప్రేమపేరుతో బెదిరింపు.. ఐదేళ్లు జైలు శిక్ష

image

దామరమడుగు పల్లిపాలెం గ్రామానికి చెందిన పొట్లూరి ప్రసాద్‌కు పోక్సో కేసులో ఐదేళ్లు జైలు శిక్ష రూ.37 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సిరిపిరెడ్డి సుమ తీర్పును వెలువరించారు. మే 20, 2021న పల్లిపాలెంకు చెందిన ఓ బాలికను ప్రేమ పేరుతో వెంటపడుతూ ప్రేమించకపోతే.. తన పేరు రాసి చనిపోతానని బెదిరించాడు. ముద్దాయిలకు శిక్ష పడేలా చేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ జీ కృష్ణకాంత్ అభినందించారు.

News February 20, 2025

నెల్లూరు: పెద్ద కొండూరు VROపై దౌర్జన్యం

image

కలిగిరి మండలం టీడీపీ కార్యాలయం సమీపంలో పెద్దన్నలూరుకు చెందిన ఓ నాయకుడు బహిరంగంగా పెదకొండూరు వీఆర్వో నరేశ్‌ను చొక్కాపట్టుకొని దుర్భాషలాడి దౌర్జన్యంగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే జరిగిన ఘటనపై వీఆర్వో నరేశ్ కలిగిరి తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. VROపై జరిగిన దౌర్జన్యంపై పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.

News February 20, 2025

నేడు నెల్లూరులో భారీ ర్యాలీ

image

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తేదీన నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరుగుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు తెలిపారు. కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద, మధ్యతరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని ఆరోపించారు.