Nellore

News May 26, 2024

28న షార్ నుంచి రాకెట్ ప్రయోగం

image

సూళ్లూరుపేట మండలం శ్రీహరికోటలోని షార్ నుంచి మే 28న అగ్నిబాణ్ సార్టెడ్ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఉదయం 5.45 గంటలకు షార్‌లోని ప్రైవేటు లాంచ్ పాడ్ నుంచి ఈ ప్రయోగం జరగనుంది. చెన్నైకి చెందిన అంతరిక్ష స్టార్టప్ సంస్థ అగ్నికుల్ కాస్మోస్ ఆధ్వర్యంలో ఈ రాకెట్ రూపొందించారు. సింగిల్ పీస్ 3డీ ప్రింటెడ్ ఇంజిన్‌తో ఈ రాకెట్ పనిచేస్తుందని అధికారులు వెల్లడించారు.

News May 26, 2024

నెల్లూరు: డాక్టర్లకు షోకాజ్ నోటీసులు సిద్ధం

image

జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసుల జారీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. నెల్లూరులో 20, కావలిలో నాలుగు, కందుకూరులో రెండు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున మొత్తం 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న కారణంతో డిఎంహెచ్వో పెంచలయ్య నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.

News May 26, 2024

నెల్లూరు: ‘వేమిరెడ్డికి లక్షన్నర మెజార్టీ ఖాయం’

image

ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి 20వేల మెజార్టీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లక్షన్నర మెజార్టీతో గెలుస్తున్నారని సీనియర్ నాయకుడు, అనంతసాగరం మండలం పాతాళపల్లి సర్పంచ్ బిజీ వేముల ఓబుల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న టీడీపీ సునామీ సృష్టించబోతుందన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు పాలన కోరుకుంటున్నారని చెప్పారు.

News May 26, 2024

నెల్లూరు: లెక్కింపు ప్రక్రియకు 130 కెమెరాల సిద్ధం : కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుల్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎం.హరినారాయణన్ తెలిపారు. అత్యధికంగా కోవూరు నియోజకవర్గంలో 324 పోలింగ్ బూతులు, అత్యల్పంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 248 ఉన్నట్లు పేర్కొన్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో 130 లేదా 140 కెమెరాలను సిద్ధం చేస్తామన్నారు.

News May 25, 2024

నెల్లూరు: ఆ రెండు రోజులు జాగ్రత్త

image

సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా జాన్ 3 నుంచి 5వ తేదీ వరకు వాట్సాప్ అడ్మిన్లు జాగ్రత్తగా ఉండాలని నాయుడుపేట డీఎస్పీ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బల్క్ మెసేజ్లు పంపడం నిషిద్ధమన్నారు. 144 సెక్షన్ కారణంగా విజయోత్సవాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదని, ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. 3వ తేదీ నుంచి 5 వరకు రెండురోజులు మద్యం విక్రయాలు పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.

News May 25, 2024

నెల్లూరు: 1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్

image

1000 మంది సిబ్బందితో ఎన్నికల కౌంటింగ్ ను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్ తెలిపారు. మూడంచెల భద్రత, కెమెరాల నిఘా ఉంటుందని తెలిపారు. కనుపర్తిపాడులో ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లు, 8.30 ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. గెలిచిన అభ్యర్థులు ర్యాలీలు నిర్వహించకూడదన్నారు.

News May 25, 2024

తుఫాన్ ఎఫెక్ట్.. నెల్లూరులో చల్లబడ్డ వాతావరణం

image

నెల్లూరు జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మిట్ట మధ్యాహ్నం మబ్బులు కమ్ముకున్నాయి. నెల్లూరు జిల్లావ్యాప్తంగా వాతావరణం చల్లబడడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పటికే కృష్ణపట్నం పోర్ట్‌లో ఒకటవ ప్రమాదవ హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.

News May 25, 2024

ఉదయగిరిలో విషాదం.. చెరువులో పడి మహిళ మృతి

image

ఉదయగిరిలోని శివారు ప్రాంతం కొత్త చెరువులో ప్రమాదపుశాత్తు కాలుజారి పడి ఉపాధి కూలి పెరుమాళ్ల వెంకటలక్ష్మి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పనులకు వెళ్లేందుకు చెరువు దగ్గర దాచి ఉంచిన పనిముట్లను తీసుకునేందుకు ముగ్గురు మహిళలు వెళ్లారు. పనిముట్లు తీసే క్రమంలో వెంకటలక్ష్మి కాలుజారి చెరువులో పడిపోయారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆమెను ఉదయగిరి ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె చనిపోయారు.

News May 25, 2024

అశ్వ వాహనంపై పెంచల కోన నరసింహుడి విహారం

image

పెంచలకోన బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని శుక్రవారం రాత్రి అశ్వ వాహనంపై ఊరేగించారు. ప్రత్యేక వాయిద్యాలు, భక్త జన కోలాహలం నడుమ ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. అయితే ఈ ఉత్సవాలు ముగింపు దశకు వచ్చాయి. చివరిగా ఇవాళ రాత్రి 8 గంటలకు స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గోనుపల్లి గ్రామంలో ఊరేగించనున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు.

News May 25, 2024

ఉదయగిరిలో కోడిగుడ్డు @ రూ.8

image

నిన్న మొన్నటి వరకు కోడి గుడ్డు ధర రూ.5ల వరకు ఉండగా నేడు ఎనిమిది రూపాయలకు ఎగబాకింది. ఎండాకాలం కావడంతో కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవడంతో సరఫరా తగ్గి డిమాండ్ పెరిగిందని, రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్థులు తెలిపారు. ప్రస్తుతం ఉదయగిరిలో 30 గుడ్లు రూ.200 పలుకుతున్నాయి. హోల్ సేల్‌లో ఒక కోడిగుడ్డు రూ.6.5లు కాగా రిటైల్ మార్కెట్లో రూ.8 రూపాయలు పలుకుతుంది.