India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2019 జనవరిలో కొత్తపట్నంలో నిందితుడు చంటి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది. పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు.
ప్రకాశం జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.
నీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనుల్లో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో బుధవారం ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ నీటి కాలువల్లో జరుగుతున్న ఈ పనులలో పురోగతిపై ఆమె సమీక్షించారు. నాగార్జునసాగర్, రామతీర్థం, మోపాడు, కంభం చెరువుల నుంచి నీళ్లు సరఫరా అయ్యే కాలువల పనుల పురోగతిని కలెక్టర్ ఆరా తీశారు.
గత డిసెంబర్, జనవరి నెలలలో ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుల్ ఎంపికకు హాజరైన అభ్యర్థుల్లో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు డాక్యుమెంట్స్ తీసుకుని 6 ఫొటోలతో, పత్రాలపై అటెస్ట్డ్ చేయించుకొని, ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలన్నారు.
ఉమ్మడి జిల్లా పరిధిలో డీఎస్సీ – 2025కు సంబంధించి వివిధ కేటగిరీలో మొత్తం 629 పోస్టుల భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుందన్నారు. వెరిఫికేషన్ కోసం ఒంగోలులోని సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని, ఒరిజినల్, కాపీ పత్రాలతో మొబైల్కు వచ్చిన తేదీల ఆధారంగా రావాలన్నారు.
జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఖాళీల ఆధారంగా 9 మంది హెడ్ కానిస్టేబుళ్లకు(HC) అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) హోదాకు పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ దామోదర్ బుధవారం ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని తన కార్యాలయంలో ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ఒక గౌరవ కారణమన్నారు.
జిల్లాలో 2025-26 సంవత్సరమునకు గాను 10 వేల హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్స్ పరికరాలు సరఫరా చేసేందుకు నిర్ణయించినట్లు ఏపీఎంఐపీ పీడీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ రైతులలో అర్హులైన వారిని గుర్తించేందుకు ఈనెల 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు గ్రామ సభను నిర్వహిస్తున్నట్లు పీడీ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రకాశం జిల్లాలో గీత కులాల వారికి నూతన బార్ పాలసీ గెజిట్ నోటిఫికేషన్ను ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆయేషా బేగం బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు గీత కార్మికులతో ఎక్సైజ్ సూపరిడెంట్ సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. జిల్లాలో గీత కులాల వారికి 3 బార్లు కేటాయించడం జరిగిందని, ఒంగోలుకు 1, మార్కాపురం మున్సిపాలిటీకి 2 మంజూరయ్యాయన్నారు. 20వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామని, 29వ తేదీ వరకు గడువు ఉంటుందన్నారు.
Sorry, no posts matched your criteria.