India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టంగుటూరు టోల్ ప్లాజా దగ్గర నలుగురు యువకులు అరెస్ట్ అయ్యారు. గుంటూరుకు చెందిన రాజు టంగుటూరు పరిధిలోని ఓ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. హాస్టల్లో ఉండే అతను వేరే చోటు నుంచి గంజాయి తీసుకు వచ్చి స్థానికంగా ఉన్న యువకులకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారంతో సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 4.5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో నలుగురు యువకులు అక్రమంగా గంజాయి తరలిస్తున్నారని సమాచారం ఆధారంగా సింగరాయకొండ సీఐ హజరత్తయ్య, ఎస్ఐ నాగమల్లేశ్వరావు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 4.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వల్ల యువత భవిష్యత్ దెబ్బతింటుందన్నారు. యువత చెడు మార్గాలను వదిలేయాలని సూచించారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 92 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
ప్రకాశం జిల్లాలో శ్రీరామనవమి రోజున విషాదం నెలకొంది. త్రిపురాంతకం మండలం వెల్లంపల్లి వద్ద ముగ్గురు యువకులు బైక్పై ప్రయాణిస్తూ.. అదుపు తప్పి కిందపడ్డారు. వీరిలో నాగిరెడ్డి అనే యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యంలో మృతి చెందాడు. మిగిలిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే దొనకొండ మండలం గుట్టమీదపల్లికి చెందిన పిక్కిలి తరుణ్(13) నీటి కుంటలో పడి మృతి చెందాడు.
దొనకొండ మండలం గుట్టపల్లికి చెందిన తరుణ్ (13) బాలుడు మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు సమాచారం మేరకు… బాలుడు తండ్రితో పాటు గొర్రెలు మేపడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటి కుంటలో జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
ఒంగోలు నగరంలోని ఏకేవీకే జూనియర్ కళాశాలలో గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ ముగిసింది. మార్కుల మొత్తం జాబితాను తయారు చేసి కంప్యూటరీకరణ కూడా పూర్తయినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనేవి చూసి తప్పులు ఉంటే వాటిని సరిచేస్తున్నామని తెలిపారు. కాగా ఇంటర్ పరీక్ష ఫలితాలు ఈ నెల 12వ తేదీన విడుదలవుతాయని అధికారులు ఇప్పటికే తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికతో 52 సంవత్సరాల వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తుండటంతో బాలిక తల్లిదండ్రులు కొండేపి పోలీసులను ఆశ్రయించారు. కొండపి మండలం ఉప్పలపాడులో పనుల కోసం వచ్చిన తల్లిదండ్రులు బాలికను ఇంటి వద్ద వదిలి పనులకు వెళ్తున్న సమయంలో అక్కడే ఉంటున్న సాదు వెంకట కోటయ్య బాలికతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ప్రైవేటు భాగాలను తాకుతూ ఉండటంతో పోలీసులు అతనిపై ఫోక్సో కేసు నమోదు చేశారు.
మసాజ్ సెంటర్లు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారుతున్నాయని ఒంగోలు వాసులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు పోలీసు అధికారులు దాడులు నిర్వహించినప్పటికీ నిర్వాహకుల తీరులో మార్పు రావటం లేదని పేర్కొన్నారు. ఒంగోలులోని ఓ మసాజ్ సెంటర్ నిర్వాహకుడిపై ఒంగోలు తాలూకా సీఐ శ్రీనివాస్ రావు, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలను అదుపులోకి తీసుకున్నారు.
మిట్టపాలెం శ్రీ నారాయణ స్వామి వారి దేవస్థానం ప్రధాన అర్చకుడు సత్యనారాయణ శర్మ ఇటీవల మృతి చెందారు. ఆయన కుమారుడు నారాయణ స్వామికి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్గా కారుణ్య నియామకం కింద ఉద్యోగం లభించింది. శనివారం నియామక ఉత్తర్వులు కనిగిరిలో MLA ఉగ్ర నరసింహ రెడ్డి నారాయణస్వామికి అందజేశారు. కార్యక్రమంలో నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు పాల్గొన్నారు.
మార్కాపురం రైల్వే స్టేషన్ ఔటర్ వద్ద పట్టాల పక్కన శనివారం మధ్యాహ్నం వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. గమనించిన స్థానికులు వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడా లేదా రైల్లో నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన వ్యక్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.