India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా సహకార అధికారి(DCO)ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా సహకార సంఘం అన్ని విధాలా వెనుకబడి ఉంది. దీనికి తోడు సంబంధిత అధికారి శ్రీనివాసరెడ్డి ఆ శాఖను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని తేలింది. ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో కాల్స్ చేసి బెదిరించడం ఎక్కువైపోయింది. ఈక్రమంలో SP దామోదర్ ఓ ప్రకటన చేశారు. ACB అధికారులమంటూ వచ్చే కాల్స్పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేశారని.. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ప్రజలు, అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ఐడీ కార్డులతోనూ మోసాలు చేస్తుంటారని.. ఎక్కడైనా ఇలా జరిగితే 91211 02266కు వాట్సప్లో సమాచారం ఇవ్వాలని కోరారు.
జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేనిపై మరో వివాదాస్పద ఆరోపణలు వస్తున్నాయి. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఓ స్టోన్ క్రషర్ నిర్వాహకుల నుంచి మాజీ మంత్రి విడదల రజినీ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో అప్పటి మంత్రి బాలినేనితో మాట్లాడి క్రషర్ యజమానిపై రజిని కేసు పెట్టించిందని లావు చెబుతున్నారు.
ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే. మాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై భారాలు మోపడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్సీ, పీహెచ్సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్సీ, పీహెచ్సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.
Sorry, no posts matched your criteria.