Prakasam

News August 21, 2025

విస్తృత తనిఖీలు నిర్వహించాలి: జేసీ

image

ప్రకాశం జిల్లా లీగల్ మెట్రాలజీ ఆధ్వర్యంలో విస్తృత తనిఖీలు నిర్వహించాలని జేసీ గోపాలకృష్ణ గురువారం ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఎరువులు, పురుగు మందులు, విత్తనాల దుకాణాలపై తనిఖీలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. అలాగే జిల్లాలోని చౌక దుకాణాలపై తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని జేసీ సమావేశంలో అధికారులకు సూచించారు.

News August 21, 2025

పద్ధతి మార్చుకోకపోతే.. జాబ్ నుంచే తొలగిస్తా: కలెక్టర్ వార్నింగ్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండే వారికి ఉద్యోగం ఎందుకు? పద్ధతి మార్చుకోకపోతే టెర్మినేట్ చేసేస్తా అంటూ కలెక్టర్ తమీమ్ అన్సారియా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఐసీడీఎస్ అధికారులతో కలెక్టర్ గురువారం సమీక్షించారు. వాస్తవ వివరాలను నమోదు చేయకుండా పలువురు ప్రవర్తిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోని సిబ్బంది పనితీరు మార్చుకోవాలన్నారు.

News August 21, 2025

ప్రకాశానికి మంత్రుల రాక

image

జిల్లాల పునర్విభజన మార్పులపై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ఈ నెల 30వ తేదీన ప్రకాశం జిల్లాకు రానున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోని మార్కాపురాన్ని జిల్లాగా ప్రకటించడం, కందుకూరును జిల్లాలో కలపడం, ఇతర అంశాలపై మంత్రుల బృందం ప్రజాభిప్రాయ సేకరణ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్య కుమార్ యాదవ్ జిల్లాకు రానున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే అధికారులు ధృవీకరించాల్సి ఉంది.

News August 21, 2025

పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

image

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షలు తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 21, 2025

పొదిలి: టీ తాగి వస్తానని భర్త పరార్.!

image

పొదిలిలోని పోతవరానికి చెందిన యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్న భార్యకు మొహం చాటేసి పరారయ్యాడు. ఈ మేరకు బాధితురాలు బుధవారం పొదిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తెలంగాణలోని ఆర్మూరు బస్ స్టేషన్‌లో టీ తాగి వస్తానని వదిలేసి పరారయ్యాడని, తీరా పొదిలికి వస్తే రూ.10 లక్షల తెస్తేనే భార్యగా అంగీకరిస్తానని చెబుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 21, 2025

ఒంగోలు: బాలికను గర్భిణీని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు

image

పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బాలికను గర్భవతిని చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ ఒంగోలు పోక్సో కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. 2019 జనవరిలో కొత్తపట్నంలో నిందితుడు చంటి బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. దీనిపై విచారణ అనంతరం నిందితుడికి శిక్ష పడింది. పోలీసులను ఎస్పీ దామోదర్ అభినందించారు.

News August 21, 2025

ప్రకాశం: వినాయక విగ్రహాలకు పర్మిషన్ ఇలా.!

image

ప్రకాశం జిల్లాలో వినాయక విగ్రహాల ఏర్పాటుకు ప్రతి ఒక్కరూ కచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.
➤<>దీనిపై క్లిక్ చేయండి.<<>>
➤ఫోన్ నంబర్ టైప్ చేసి ఓటీపి ఎంటర్ చేయండి.
➤ తర్వాత అక్కడ అడిగే అన్ని వివరాలు నమోదు చేసి సబ్‌మిట్ చేయండి.
NOTE: అప్లికేషన్‌లో విగ్రహం సైజ్ ఎంతో చెప్పాల్సి ఉంటుంది.
ఇలా ముందుగానే విగ్రహాన్ని బుక్ చేసుకుని పర్మీషన్ పొందండి.

News August 21, 2025

ఇరిగేషన్ పనుల్లో నాణ్యత ముఖ్యం: కలెక్టర్

image

నీటి కాలువల్లో పూడికతీత, జంగిల్ క్లియరెన్స్ పనుల్లో నాణ్యత ముఖ్యమని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఇరిగేషన్ అధికారులతో బుధవారం ఒంగోలు క్యాంపు కార్యాలయంలో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ నీటి కాలువల్లో జరుగుతున్న ఈ పనులలో పురోగతిపై ఆమె సమీక్షించారు. నాగార్జునసాగర్, రామతీర్థం, మోపాడు, కంభం చెరువుల నుంచి నీళ్లు సరఫరా అయ్యే కాలువల పనుల పురోగతిని కలెక్టర్ ఆరా తీశారు.

News August 20, 2025

ప్రకాశం: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ముఖ్య సూచన!

image

గత డిసెంబర్, జనవరి నెలలలో ఒంగోలులోని జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కానిస్టేబుల్ ఎంపికకు హాజరైన అభ్యర్థుల్లో ఎంపికైన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ జిల్లా పోలీస్ కార్యాలయానికి హాజరుకావాలని ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఎస్పీ మాట్లాడుతూ.. ఉదయం 9 గంటలకు డాక్యుమెంట్స్ తీసుకుని 6 ఫొటోలతో, పత్రాలపై అటెస్ట్డ్ చేయించుకొని, ఒరిజినల్ పత్రాలను తీసుకురావాలన్నారు.

News August 20, 2025

ప్రకాశం: డీఎస్సీ సెలెక్టెడ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

image

ఉమ్మడి జిల్లా పరిధిలో డీఎస్సీ – 2025కు సంబంధించి వివిధ కేటగిరీలో మొత్తం 629 పోస్టుల భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ బుధవారం తెలిపారు. సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ వస్తుందన్నారు. వెరిఫికేషన్ కోసం ఒంగోలులోని సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని, ఒరిజినల్, కాపీ పత్రాలతో మొబైల్‌కు వచ్చిన తేదీల ఆధారంగా రావాలన్నారు.