India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వినాయక విగ్రహాల నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఆదివారం కొత్తపట్నం తీర ప్రాంతంలో జరిగే నిమజ్జనాల ప్రదేశాలను ఆయన పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రశాంత వాతావరణంలో సురక్షిత వినాయక నిమజ్జనానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని గోరంట్ల బ్యాక్ సైడ్ గోపాల్ నగర్ 4th లైన్లో బిస్కెట్లతో 18 అడుగుల భారీ గణనాథుడిని ఏర్పాటు చేశారు. గత నాలుగేళ్లగా HMC ‘కమిటీ కుర్రాళ్ళు’ గణేష్ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా బిస్కెట్లతో గణేష్ని రూపొందించామని తెలిపారు. దీంతో భక్తులు ఈ గణనాథుని చూసేందుకు తరలి వస్తున్నారు.
ఇప్పటివరకు సామాన్యులనే టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా జిల్లా SP దామోదర్ను టార్గెట్ చేశారు. ఎస్పీ పేరుతో వాట్సప్ DP పెట్టి కొత్త నెంబర్తో జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఐటీ కోర్ సీఐ వి సూర్యనారాయణకు రూ.50వేలు అర్జెంటుగా కావాలంటూ వాట్సాప్లో మెసేజ్ చేశారు. విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లగా.. సైబర్ నేరగాళ్లు నేపాల్ నుంచి ఆపరేట్ చేసినట్లు గుర్తించారు. దీంతో సామాన్యులు అలర్డ్గా ఉండాలన్నారు.
పెద్దారవీడు మండలం దేవరాజుగట్టు వద్ద వినాయక విగ్రహంతో వెళ్తున్న దేసిరెడ్డిపల్లి <<14041015>>ట్రాక్టర్ను లారీ ఢీకొంది.<<>> ఈ ఘటనలో 11 మందికి గాయాలు కాగా ఆ గ్రామంలో పండుగ వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న SP చలించిపోయారు. దీంతో గ్రామస్థుల్లో బాధను పోగొట్టడానికి ఎస్పీ దామోదర్ స్వయంగా వారితో మాట్లాడి, మరో విగ్రహాన్ని పంపించారు. దీంతో గ్రామంలో తిరిగి ఆనందం నింపారని పలువురు SPని అభినందిస్తున్నారు.
వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వినాయక చవితి పండగ సందర్భంగా శనివారం ఒంగోలు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లోని సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో, ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం నందు నిర్వహించిన పూజా కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ సతీసమేతంగా పాల్గొన్నారు. జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
గిద్దలూరు- దిగువమెట్ట మధ్య రెండో లైను పనులు జరుగుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు గుంటూరు మండల రైల్వే అధికారి తెలిపారు. ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు గుంటూరు- కాచిగూడ (17251), గుంటూరు – డోన్ (17228) ను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు గమనించాలన్నారు.
జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి, మీడియా మిత్రులకు ఎస్పీ దామోదర్ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని, మత సామరస్యం కొనసాగించాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
ఒంగోలులోని సమతానగర్లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా దాదాపు 1500 కొబ్బరికాయలతో 17 అడుగుల ఎత్తులో గణేష్ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.
వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు, సిబ్బందికి మీడియా మిత్రులకు ఎస్పీ ఏఆర్ దామోదర్ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో వినాయక చవితి పందిళ్లు/ మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు, పోలీసువారి సూచనలు పాటించి ప్రశాంతమైన వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలన్నారు. సంఘటనలు తలెత్తితే వెంటనే స్థానిక పోలీసు లేదా డయల్ 112/100 ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.