India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మార్కాపురం జిల్లాకు కొత్త ఏడాదిలో ముహూర్తం ఖరారైంది. గతంలో 21 మండలాలతో ఆమోదం తెలపగా.. దొనకొండ, కురిచేడు మండలాలను కలిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. వైపాలెం, రాచర్ల, కొమరోలు, త్రిపురాంతకం, వెలిగండ్ల, పి.చెరువు, దోర్నాల, పెద్దారవీడు, హెచ్.యం పాడు, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, కొనకనమిట్ల, కనిగిరి, పీసీపల్లి, సీఎస్పురం, పామూరు, కంభం, అర్ధవీడు, కంభం, బి.పేట, దొనకొండ, కురిచేడు మండలాలు ఉండనున్నాయి.

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.

ముండ్లమూరు మండలంలోని కెల్లంపల్లికి ప్రముఖ సినీ హీరోయిన్ శ్రీలీల వచ్చారు. తన తాత స్వగ్రామమైన కెల్లంపల్లిలోని శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయాన్ని ఆమె సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం తాత నివాసానికి వెళ్లి శ్రీలీల కొంతసేపు కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సినీ నటి శ్రీలీల గ్రామానికి రావడంతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది.

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా షేక్ నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా బాసం శేషారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

గుంటూరు నగర శివారు 16వ నంబరు జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. యువకులు బైక్పై గుంటూరు నుంచి ఒంగోలు వైపునకు బయలుదేరారు. చౌడవరం సమీపంలో బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. మృతులు ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం గంగవరానికి చెందిన చాట్ల నాని, అశోక్గా పోలీసులు గుర్తించారు. నల్లపాడు పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు.

ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని ఫైరింగ్ రేంజ్ వద్ద ఆదివారం వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ను SP హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పోలీస్ అధికారులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. అలాగే ఎస్పీ హర్షవర్ధన్ రాజు సైతం ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి అధికారుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ఫైరింగ్ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఏకాగ్రతతో ఉండాలన్నారు.

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా <<18628823>>మెరుగుపడేలా<<>> చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.

ప్రకాశం జిల్లాకు నాగార్జునసాగర్ జలాల సరఫరా మెరుగుపడేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి జలవనరుల శాఖ అధికారులను శనివారం ఆదేశించారు. తూర్పు నాయుడుపాలెం తనక్ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జునసాగర్ నుంచి విడుదలవుతున్న జలాలు తగిన స్థాయిలో జిల్లాకు రాకపోవటానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 57 TMCలు సాగర్ జలాలు రావాల్సి ఉండగా ఇప్పటివరకు 34 TMCలు వచ్చాయన్నారు.
Sorry, no posts matched your criteria.