India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశంజిల్లా గ్రంథాలయం సంస్థ పర్సన్ ఇన్ఛార్జ్గా సంయుక్త కలెక్టర్ రోణంకి. గోపాలకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా గ్రంథాలయ సంస్థలకు సంబంధించిన వ్యవహారాలను నిర్వహించడానికి జిల్లాల జాయింట్ కలెక్టర్లను పర్సన్ ఇన్ఛార్జ్గా నియమిస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. జిల్లా గ్రంథాలయం సంస్థకు రావలసిన సెస్సులు, గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
గిద్దలూరులోని కొంగలవీడు రోడ్డులో బిలాల్ మసీదు సమీపంలో ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొమరోలు మండలం అయ్యవారిపల్లికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ముక్కర చెన్నారెడ్డి అనే వ్యక్తి గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ వేసవిలో జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఎక్కడైనా తాగునీటి సమస్య తలెత్తితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమీమ్ అన్సారియా హెచ్చరించారు. శుక్రవారం వేసవిలో తాగునీటి సరఫరా వడగాల్పులపై తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలపై సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు.
మార్కాపురం కాలేజీ రోడ్డులోని జాకీ షోరూమ్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన మహేశ్ జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం మార్కాపురం వచ్చాడని స్థానికులు తెలిపారు. నమ్మిన వారందరూ మోసం చేశారని జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చీమకుర్తి – గంగవరం రోడ్డు రచ్చమిట్ట సెంటర్ వద్ద 2019లో లారీ ఢీ కొని బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు మృతిచెందారు. దీనిపై అప్పట్లో కేసు నమోదైంది. నిర్లక్ష్యంగా లారీ నడిపి ముగ్గురి మృతికి కారణమయ్యాడని నేర నిరూపణైంది. దీంతో ఎక్సైజ్ కోర్ట్ జడ్జి కోమలవల్లి నిందితుడికి 2 ఏళ్ల 3 నెలలు జైలు శిక్ష, రూ. 5,500 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సైకు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.
బీసీ, ఈబీసీ, కాపు యాక్షన్ ప్లాన్ కింద బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేసి ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ వంతు ఆర్థిక తోడ్పాటు అందించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా బ్యాంకర్లను కోరారు. గురువారం బీసీ కార్పోరేషన్ బ్యాంకుల అధికారులతో సమావేశమై, బీసీ కార్పోరేషన్ ద్వారా బీసీ, ఓసి, వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద మంజూరు చేసిన యూనిట్స్ గ్రౌండింగ్ పురోగతి పై సమీక్షించారు.
ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ విపత్తుల నివారణ సంస్థ హెచ్చరికలు జారీచేసింది. గురువారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందన్నారు. పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపారు. వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్, పొలాలు, బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని హెచ్చరించారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని అధికారులు పేర్కొన్నారు.
వెలిగండ్ల మండలంలోని ఇమ్మడి చెరువు గ్రామ సర్పంచ్ తోకల బాలకృష్ణ(37) గురువారం ఉదయం బెంగళూరులో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన వైసీపీ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. బాలకృష్ణ మృతి పట్ల మండలంలోని పలువురు వైసీపీ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి 15 ఏళ్ల బాలికపై ఓ యువకుడు పలుమార్లు లైంగిక దాడి చేశాడు. ఈ ఘటన ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. నానమ్మ వద్ద ఉంటున్న బాలికకు యువకుడు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. బాలికకు అనారోగ్యంగా ఉండటంతో జీజీహెచ్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు గర్భవతిగా తేల్చారు. దీంతో బాలిక నానమ్మ ఒంగోలు వన్ టౌన్లో ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.