Prakasam

News April 6, 2026

మార్కాపురం అటవీ శాఖలో ఉద్యోగాలు

image

మార్కాపురం అటవీ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగానికి దరఖాస్తుల ఆహ్వానం పలికారు. మార్కాపురం జిల్లాలో పనిచేయుటకు ఏదైనా డిగ్రీ కలిగి, MS ఆఫీస్, టైప్ స్కిల్స్ కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బీటెక్ చదివిన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. దరఖాస్తులను ఏప్రిల్ 7వ తేదీలోపు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాలకు మార్కాపురం అటవీ శాఖ కార్యాలయానికి రావాలన్నారు.

News April 6, 2026

తౌషిక్ మృతి కేసు.. ఆ డేటానే కీలకం..!

image

నవోదయ విద్యార్థి తౌషిక్ అనుమానాస్పద మృతి కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. పునః విచారణలో భాగంగా ఆదివారం మొత్తం 13 ఫోన్లను విచారణాధికారి సీజ్ చేశారు. ఇందులో కళాశాల యాజమాన్యం, ఒక మహిళా టీచర్, వార్డెన్ ఫోన్లతోపాటు సింగరాయకొండ పోలీసుల ఫోన్లు, పోస్టుమార్టం నిర్వహించిన ఒంగోలు రిమ్స్ డాక్టర్ ఫోన్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ కాల్ డేటా ఆధారంగా కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

News April 5, 2026

భైరవకోన పూజారిపై కత్తితో దాడి

image

సీఎస్ పురం మండలం భైరవకోన దేవస్థానం పూజారిగా పని చేస్తున్న రామమూర్తి ఆలయ సమీపంలో ఆంజనేయస్వామి విగ్రహం దగ్గర ఉండగా ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఒక్కసారిగా బైక్‌పై వచ్చి భుజం దగ్గర 2 సార్లు కత్తితో పొడిచాడని పూజారి చెప్పుకొచ్చారు. స్థానికులు పూజారిని పామూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

News April 5, 2026

పామూరు: నాన్నా జాగ్రత్త అని అరచేతిపై రాసుకుని.. కూతురి సూసైడ్

image

మార్కాపురం(D)లో శనివారం రాత్రి విషాదం చోటుచేసుకుంది. పామూరు (M) అయ్యవారిపల్లికి చెందిన మాధవి.. నాగూర్ బాషా <<19569072>>లైంగిక వేధింపులకు<<>> గురి చేస్తున్నాడని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. చనిపోయే ముందు మాధవి ‘నాన్నా జాగ్రత్త’ అంటూ తన అరచేతిపై రాసుకోవడం అందరిని కంటతడి పెట్టించింది. నాగూర్ మాధవిని నగ్న చిత్రాలతో వేధిస్తున్నట్లు సమాచారం.

News April 5, 2026

ప్రకాశం: జూన్‌లో పెట్టుబడిదారుల సదస్సు ఏర్పాటుకు ఆదేశం

image

ప్రకాశం జిల్లాలో పారిశ్రామికీకరణ వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది. జూన్ నెలాఖరులో పెట్టుబడిదారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్ రాజాబాబు శనివారం ప్రకాశం భవనంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిశ్రమల స్థాపనకు జిల్లాలో అందుబాటులో ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదేశించారు.

News April 5, 2026

ప్రకాశం జిల్లా యువతకు గుడ్ న్యూస్

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు అత్యాధునిక రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం కీలక అడుగులు వేస్తోంది. కలెక్టర్ రాజాబాబు సమక్షంలో ప్రముఖ ‘సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా యువతకు డిమాండ్ ఉన్న రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం, విద్యారంగం మధ్య బలమైన భాగస్వామ్యానికి ఈ ఒప్పందం వేదికగా మారనుందని తెలిపారు.

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.

News April 5, 2026

సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

image

మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జి SP హర్షవర్ధన్ రాజు సైబర్ నేరాలపట్ల అప్రమత్తంగా ఉండాలని శనివారం హెచ్చరించారు. భయం, దురాశ, నిర్లక్ష్యం చాలా నష్టదాయకం అన్నారు. మోసపూరిత పెట్టుబడులు, OTP, బహుమతులు, QR కోడ్‌లు, KYC తదితర మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. మోసపోయిన వ్యక్తులు సైబర్ క్రైమ్ కాల్ నంబర్ 1930 సంప్రదించాలని కోరారు.