Prakasam

News March 26, 2025

ప్రకాశం: పాఠశాలల్లో వాటర్ బెల్..!

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 10, 11, 12 గంటల సమయాల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

News March 26, 2025

ప్రకాశం: వైసీపీకి మరో షాక్ తప్పదా..?

image

ప్రకాశం జిల్లాలో YCPకి షాక్ ఇచ్చేందుకు TDP పావులు కదుపుతోంది. మార్కాపురం, త్రిపురాంతకం MPP ఎన్నిక గురువారం జరగనుంది. పుల్లలచెరువులో వైస్ MPP, ఎర్రగొండపాలెంలో కోఆప్షన్ సభ్యుడి ఎన్నిక సైతం నిర్వహిస్తారు. అన్ని చోట్లా YCPకి పూర్తి మెజార్టీ ఉన్నా ఆయా స్థానాలను దక్కించుకోవడానికి TDP గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కొందరు స్వచ్ఛందంగా టీడీపీ గూటికి చేరగా.. మరికొందరిని కొన్ని హామీలతో తమవైపు తిప్పుకుంటోంది.

News March 26, 2025

జగన్‌ను కలిసిన ఆళ్ల సతీమణి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డిని అరెస్ట్ చేసి ఒంగోలు జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వైసీపీ అధినేత జగన్‌ను ఆంజనేయరెడ్డి సతీమణి సుబ్బమ్మ కలిశారు. పోలీసులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆమె జగన్ వద్ద వాపోయారు. పార్టీ అండగా ఉంటుందని జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు. మాజీ సీఎంను కలిసిన వారిలో బూచేపల్లి ఫ్యామిలీ, చెవిరెడ్డి ఉన్నారు.

News March 26, 2025

ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.280

image

ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రంలో మంగళవారం నిర్వహించిన పొగాకు వేలంలో, క్వింటా గరిష్టంగా రూ.280 ధర పలకగా కనిష్టంగా రూ.260 పలికినట్లు వేలం నిర్వహణ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే సరాసరి ధర రూ.275 పలికింది. కాకుటూరువారి పాలెం, శివపురం గ్రామాల నుంచి రైతులు 296 బేళ్లు వేలానికి తెచ్చారు. ఇందులో 232 బేళ్లను కొనుగోలు చేశారు. వివిధ కారణాలతో 64 పొగాకు బేళ్లను కొనుగోలు చేయలేదు.

News March 25, 2025

ప్రకాశం: DSC అభ్యర్థులకు GOOD NEWS

image

ప్రకాశం జిల్లాలోని EBC, BC అభ్యర్థులకు మెగా DSC-2025కి ఆన్‌లైన్ ద్వారా, ఉచిత శిక్షణ ఇస్తామని ఏపీ BC స్టడీ సర్కిల్ ఒంగోలు సంచాలకురాలు అంజలి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు విద్యార్హత, ఆధార్, టెట్ మార్కుల జిరాక్సులు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలన్నారు. అన్నింటితోపాటు 2 పాస్ ఫొటోలను కలిపి ఒంగోలులోని ఏపీ BC స్టడీ సర్కిల్ ఆఫీసులో సమర్పించాలని కోరారు. ధరఖాస్తులు 10వ తేదీనే ప్రారంభం అయినట్లు తెలిపారు.

News March 25, 2025

ఒంగోలు: పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

image

ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఏపీపీఎస్‌సీ ప‌రీక్ష‌ జరుగుతున్న ఒంగోలులోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ది చర్చ్, సోషల్ యాక్షన్ ఇండియా సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప‌రీక్ష‌ల‌కు హాజరయ్యే అభ్యర్ధులకు అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.

News March 25, 2025

ఒంగోలు: మాజీ సీఎం జగన్‌తో జిల్లా వైసీపీ నేతల సమావేశం

image

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు మాజీ సీఎం జగన్‌ను కలిశారు. జిల్లా నాయకులతో వైసీపీ బలోపేతంపై మాజీ సీఎం జగన్ చర్చించారు. జగన్‌ను కలిసిన వారిలో జడ్పీ ఛైర్ పర్సన్ వెంకాయమ్మ, వై.పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, దద్దాల నారాయణ ఉన్నారు.

News March 25, 2025

ప్రకాశం: యువతకు గమనిక

image

ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్ని వీర్ టెక్నికల్, అగ్ని వీర్ ఆఫీస్ అసిస్టెంట్, స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్ని ట్రేడ్స్ మెన్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలకు యువకులు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు స్టెప్ సీఈవో శ్రీమన్నారాయణ సూచించారు. ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. తెలుగులోనే ఎగ్జాం నిర్వహిస్తారన్నారు. ఎన్‌సీసీ వారికి బోనస్ మార్కులు ఉంటాయన్నారు.

News March 25, 2025

ప్రకాశం: వారికి ఆన్‌లైన్‌లో పరీక్ష

image

ప్రకాశం: ఎయిడెడ్ ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారు ఆన్‌లైన్ ద్వారా పరీక్ష రాయాలని DEO కిరణ్ కుమార్ ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన వారు వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు పొందాలని సూచించారు. ఈనెల 28, 29వ తేదీల్లో ఆన్లైన్ ద్వారా పరీక్ష రాయాలన్నారు. మ్యాన్యువల్‌గా దరఖాస్తు చేసిన వారు అప్లికేషన్ తీసుకుని DEO ఆఫీసులో సంప్రదిస్తే హాల్ టికెట్ అందిస్తామని చెప్పారు.

News March 25, 2025

ఒంగోలు: యువకుల ఫోన్ల తనిఖీ

image

IPL బెట్టింగ్‌తో పాటు ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ వాడే వారి సంఖ్య పెరుగుతోంది. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఒంగోలు బస్టాండ్ వద్ద డీఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు యువకుల ఫోన్లు చెక్ చేశారు. బెట్టింగ్ యాప్స్, సింగిల్ నంబర్ వాడే వారిని గుర్తించారు. 300 మంది అనుమానితులను తనిఖీ చేసి రూ.5,500 సీజ్ చేశారు. యువత బెట్టింగ్‌కు అలవాటై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని డీఎస్పీ కోరారు.

error: Content is protected !!