Prakasam

News August 19, 2025

‘పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు చేపట్టాలి’

image

జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం పటిష్టంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని జేసీ గోపాలకృష్ణ అన్నారు. విజయవాడ సీసీఎల్ఏ కార్యాలయం నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జేసీ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో చేపట్టిన రీ సర్వే ప్రక్రియ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడారు.

News August 19, 2025

నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలి: కలెక్టర్

image

జిల్లాలో 10వ తరగతి విద్యార్హత ఉన్నవారు కనీసం 10 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులకు ఉల్లాస్ అక్షర ఆంధ్ర అక్షరాస్యత కార్యక్రమంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. 15 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారిని అక్షరాస్యులుగా మార్చడమే లక్ష్యమన్నారు.

News August 19, 2025

భైరవకోనకు వెళ్తున్నామని.. మృత్యువు ఒడిలోకి

image

కనిగిరి మండలం పునుగోడు చెరువులో మంగళవారం మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంకవరం గ్రామానికి చెందిన ఎన్నింటి గౌతమ్ (17), కనిగిరి నక్కల తిప్పకు చెందిన బొందలపాటి శివప్రసాద్(19)గా గుర్తించారు. వీరిద్దరూ ఈనెల 17న భైరవకోనకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. ఈ క్రమంలో వారు మృత్యువాత పడ్డారు.

News August 19, 2025

యూరియా వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

జిల్లాకు కేటాయించిన యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర అవసరాలకు ఉపయోగించకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. మంగళవారం ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో యూరియా వినియోగంపై కలెక్టర్ సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు.

News August 19, 2025

భైరవకోనకు వెళ్తున్నామని.. మృత్యువు ఒడిలోకి

image

కనిగిరి మండలం పునుగోడు చెరువులో మంగళవారం మృతి చెందిన ఇద్దరు యువకుల వివరాలు, ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఎస్సై శ్రీరామ్ వివరాల మేరకు.. కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంకవరం గ్రామానికి చెందిన ఎన్నింటి గౌతమ్ (17), కనిగిరి నక్కల తిప్పకు చెందిన బొందలపాటి శివప్రసాద్(19)గా గుర్తించారు. వీరిద్దరూ ఈనెల 17న భైరవకోనకు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయటకు వచ్చారు. ఈ క్రమంలో వారు మృత్యువాత పడ్డారు.

News August 19, 2025

ప్రకాశం: పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి

image

ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలోని పునుగోడు చెరువులో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న SI శ్రీరామ్ సిబ్బందితో కలిసి చెరువులోని మృతదేహాలను వెలికితీశారు. మృతిచెందిన వారు ఎవరనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. కొద్దిసేపట్లో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కనిగిరికి తరలించే అవకాశం ఉంది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 19, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

image

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్‌కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.

News August 19, 2025

ఉపరాష్ట్రపతి అభ్యర్థి బరిలోకి మార్కాపురం వాసి.!

image

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం చింతకుంటకు చెందిన డాక్టర్ మందటి తిరుపతిరెడ్డి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా ఆయన సమర్పించిన నామినేషన్‌కు ఆమోదం సైతం లభించింది. సుప్రీంకోర్టు న్యాయవాదిగా గుర్తింపు పొందిన తిరుపతిరెడ్డి 2022లో జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లోనూ నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎన్నికలు జరుగుతుండగా మరోమారు నామినేషన్ వేశారు.

News August 19, 2025

నోరు మెదపని అధికారులు: ప్రకాశం కలెక్టర్ సీరియస్

image

సరైన సమాచారం లేకుండా వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకావడంపై పలువురు కమిషనర్లు, MPDOల తీరుపై జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ పలు శాఖలు చేపడుతున్న పనులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశ్నలకు పలువురు అధికారులు తెల్లముఖం పెట్టడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

News August 19, 2025

దివ్యాంగ విద్యార్థులకు DEO సూచన

image

ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.