India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కనిగిరి MLA ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి శుక్రవారం గుంటూరు ఐజీ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా MLA ఉగ్ర మాట్లాడుతూ.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడకుండా కఠినంగా వ్యవహరించాలని ఐజీని కోరినట్లు తెలిపారు. పోలీసు అధికారులకు తమ సహాయసహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు.
ఒంగోలులోని సమతానగర్లో కొబ్బరి కాయలతో గణనాథుడిని తయారుచేశారు. గత 30 ఏళ్లుగా స్థానిక ‘కమిటీ కుర్రాళ్లు’ గణేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. కాగా ఈ ఏడాది సరికొత్తగా 17 అడుగుల ఎత్తులో కొబ్బరికాయలతో గణేష్ను రూపొందించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితానికి ముందుకు రావాలని కోరారు.
టంగుటూరు మండలం జమ్ములపాలెంలో నాలుగేళ్ల నుంచి లో వోల్టేజీ సమస్య నెలకొంది. దీంతో నిత్యం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగులు మొదలు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానిక యువకుడు సమస్యను ప్రస్తావిస్తూ ‘X’ వేదికగా విద్యుత్ శాఖ మంత్రికి పోస్ట్ చేశారు. దీంతో స్పందించిన మంత్రి గంటలోనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. సమస్యకు పరిష్కారం చూపాలన్నారు.
చీరాల ఐటీసీలో ఉద్యోగం ఇప్పిస్తామని పోలిరెడ్డి అనే ఓ నిరుద్యోగికి నలుగురు వ్యక్తులు మాయమాటలు చెప్పారు. తర్వాత డబ్బుల కోసం బెదిరించి అతడి నుంచి రూ.1.5 లక్షల నగదు దోచుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో పోలీసులు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.లక్ష రికవరీ చేసినట్లు డీఎస్పీ జగదీశ్ నాయక్ చెప్పారు. అలాగే నిందితుల వద్ద లభ్యమైన రూ.19 లక్షల నకిలీ నోట్లను కూడా సీజ్ చేశామని చెప్పారు.
విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని డ్వామా పీడీ, చీరాల డీఎల్డీవో బి.రాజేశ్పై కలెక్టర్ వెంకట మురళి వేటు వేశారు. ఆయనను పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 31న పింఛన్ల పంపిణీ, విపత్తు నిర్వహణ విధుల్లో ఆయన పాల్గొనకపోవడంతో విధుల నుంచి తప్పించారు. డ్వామా ఇన్ఛార్జి పీడీగా డీపీవో కె.రవికుమార్ను నియమించారు.
ఒంగోలు కేశవస్వామిపేటలో ఓ యువకుడిపై దాడి జరిగింది. రెండు నెలలక్రితం ఓ యువతి ఫొటో ఫేస్బుక్లో పెట్టినందుకు స్థానిక సీతారామాపురంలో నివాసం ఉండే పూజలదేవా కుమారుడిని జానకి రామ్ కొట్టాడు. ఈక్రమంలో దేవా కుమారుడు కంటిని కోల్పోయాడు. తమపై దాడికి పాల్పడిన జానకి రామ్పై బుధవారం సాయంత్రం దేవా దాడి చేసి గాయపరిచారు. రిమ్స్లో చికిత్స పొందుతూ, జానకి రామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
SMS వాట్సప్లో కేవైసీ ధృవీకరణ పేరుతో వచ్చే లింక్స్ని క్లిక్ చేయకూడదని ప్రకాశం పోలీసు వారు హెచ్చరిస్తున్నారు. కేవైసీ కోసం బ్యాంకులు ఎలాంటి లింక్స్ పంపించవన్నారు. మీ మొబైల్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్, ఓటీపీ లాంటి వివరాలను ఎవరితో షేర్ చేసుకోవద్దని తెలియజేశారు. ఏదైనా అనుమానాస్పద లింక్ వస్తే ఈ https://sancharsaathi.gov.in/ వెబ్సైట్లో రిపోర్ట్ చేయాలన్నారు.
చిన్నగంజాం మండలం మోటుపల్లి పంచాయతీ రుద్రమంబాపురానికి చెందిన మత్స్యకారులు.. 10 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లారు. కాగా బోటు చెడిపోవడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిలో కొండూరి రాముడు, బసన్నగారి జయరాజు, కాటంగారి బాబురావు, ఆవల మునియ్యలు కోస్ట్ గార్డ్స్ సాయంతో కాకినాడ తీరానికి చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము క్షేమంగా రావటానికి కృషి చేసిన పర్చూరు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.
చిన్నగంజాం మండలం మోటుపల్లి పంచాయతీ రుద్రమంబాపురానికి చెందిన మత్స్యకారులు.. 10 రోజుల క్రితం సముద్రంలో వేటకు వెళ్లారు. కాగా బోటు చెడిపోవడంతో అక్కడే చిక్కుకున్నారు. వారిలో కొండూరి రాముడు, బసన్నగారి జయరాజు, కాటంగారి బాబురావు, ఆవల మునియ్యలు కోస్ట్ గార్డ్స్ సాయంతో కాకినాడ తీరానికి చేరుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తాము క్షేమంగా రావటానికి కృషి చేసిన పర్చూరు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు.
ఒంగోలు నగరంలోని TDP కార్యాలయంలో ఒంగోలు MLA దామచర్ల జనార్దన్ రావు నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డీఎంహెచ్వోల వంటి పలుశాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ప్రజలకు అవసరమైన అత్యవసర సదుపాయాలను కల్పించాలని తెలిపారు. నగరంలో పారిశుధ్య పనులు, డ్రైనేజ్ సమస్యలు లేకుండా చూడాలన్నారు.
Sorry, no posts matched your criteria.