India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తరచూ 1100 టోల్ ఫ్రీ నంబర్పై విస్తృత ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఒక్కరోజు 1100 టోల్ ఫ్రీ నంబర్కు 214 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. సుదూర ప్రాంతాల నుంచి కలెక్టర్ మీకోసం కార్యక్రమానికి రాలేనివారు, ఈ నంబర్కు తమ సమస్యను తెలిపితే వారి సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు.
ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. జిల్లా ఎస్పీ దామోదర్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రకాశం జిల్లాలో జనాభా ప్రాతిపదికన ఓపెన్ కేటగిరీలో 26 బార్లు కేటాయించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ సూపరిడెంట్ అయేషా బేగం సోమవారం తెలిపారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 16, మార్కాపురం మున్సిపాలిటీకి 5, చీమకుర్తి, పొదిలి, దర్శి, కనిగిరి, గిద్దలూరు మున్సిపాలిటీలకు ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ బార్ల నిర్వహణ కోసం 18వ తేదీ నుంచి 26 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. 28న లాటరీ తీస్తారు.
ప్రకాశం జిల్లా వాసుల కోసం రహదారి అభివృద్ధి విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒంగోలు సమీపంలోని త్రోవగుంట నుంచి కత్తిపూడి వరకు గల 250 కిలోమీటర్ల రహదారిని 4 లైన్లుగా విభజించేందుకు నేషనల్ హైవే అథారిటీ నిర్ణయించింది. నేషనల్ హైవే 216గా గుర్తించి ఈ రహదారిని 4 లైన్ల రహదారిగా మార్చనున్నారు. ఈ దారి ఒంగోలు నుంచి బాపట్ల, బాపట్ల నుంచి పెడన, పెడన నుంచి లక్ష్మీపురం, కత్తిపూడి వరకు వెళ్తుంది.
ప్రకాశం జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులకు DEO కిరణ్ కుమార్ కీలక సూచన చేశారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయం నుంచి ఈ మేరకు ప్రకటన విడుదలైంది. 18న సంతనూతలపాడు, 19న వైపాలెం, 20న దర్శి, 21న ఒంగోలు, 22 కొండేపి, 23 మార్కాపురం, 25 గిద్దలూరు, 26న కనిగిరిలో దివ్యాంగ విద్యార్థుల కోసం ఆయా తేదీల్లో శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శిబిరాల్లో పాల్గొన్నవారికి సంబంధించిన యంత్రాలను అందిస్తామని తెలిపారు.
ఈనెల 14న దోర్నాల (M)చిన్నారుట్ల గూడెంలో చిన్నారి అంజమ్మపై చిరుతపులి దాడి చేసిన ఘటన తెలిసిందే. నల్లమల అరణ్యం చరిత్రలో తొలిసారి ఓ వన్యప్రాణి మనుషులపై దాడి చేసిన ఘటనను అటవీశాఖ అధికారులు సీరియస్గా తీసుకున్నారు. చిరుత కదలికలపై దృష్టి సారించేందుకు కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేయగా తాజాగా ఓ కెమెరాకు గూడెం పరిసరాల్లో తరచుగా సంచరిస్తున్న చిరుతపులి చిక్కింది. ఇది చిన్నారిపై దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు.
క్రీడలలో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని జిల్లా SP దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఇండోర్ స్టేడియంలో ఆదివారం జరిగిన జాతీయ స్థాయి కరాటే పోటీలను ఎస్పీ ప్రారంభించారు. అనంతరం కరాటే పోటీలకు హాజరైన విద్యార్థులను ఎస్పీ స్వయంగా పలకరించి, కరాటేలో రాణిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. క్రీడల ద్వారా సామాజిక స్పృహ పెరగడంతో పాటు, మానసిక ఒత్తిడిని అధిగమించవచ్చన్నారు.
పొగాకు రైతులకు ఒంగోలు పొగాకు వేలం నిర్వహణ అధికారిణి తులసి కీలక సూచనలు చేశారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో బ్యారన్లకు ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పొగాకు బ్యారన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మూడేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని రైతులు గమనించాలని కోరారు. కౌలు రైతులు తప్పనిసరిగా సర్టిఫికెట్ లీజు కోసం నో డ్యూస్తో తమను సంప్రదించాలని సూచించారు.
ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై చర్చ సాగుతోంది. దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరుతో జిల్లా ఏర్పడవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలో మార్కాపురం జిల్లాలో కలిసే మండలాల ప్రజలు భిన్నరీతిలో తమ వాదన వినిపిస్తున్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతున్నారు. మరి మీ మండలాలు మార్కాపురం ఉండాలా? ప్రకాశం జిల్లాలో ఉండాలా? అని కామెంట్ చేయండి.
శ్రీశైలం, నంద్యాల ఘాట్ రోడ్లలోనూ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకాశం జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులో ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఘాట్ రోడ్లలో సీట్లు ఖాళీగా ఉన్నంత వరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.