India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సీఎం చంద్రబాబుపై X వేదికగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్ వేశారు. ‘బాబు సార్….. బాబు సార్ అంతే. మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలు పడుతుంటే, కరెంట్ లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే సోలార్ లాంతర్లు ఇవ్వాలనే ఆలోచన వచ్చింది చూడు చంద్రబాబు సార్ మీకు కృతజ్ఞతలు. అసలు ప్రజలకే Hydraulic Turbine ఇస్తే వారే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారుగా బాబు గారు’ అని పోస్ట్ చేశారు.
నాలుగు రోజులుగా భారీ వర్షాలు, వరదల ధాటికి ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణుకుతోంది. ఎక్కడ చూసిన వరద నీటితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇలాగే 2015లో పోతురాజు కాలువ పొంగి ఒంగోలు – కర్నూలు రోడ్డుకు ఇరువైపులా ఉన్న సగం కాలనీలు నీళ్లతో నిండిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేకపోవడంతో ఇప్పుడు జిల్లాకు వరదలు వచ్చాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రకాశం జిల్లా ఎస్పీ ఏ ఆర్ దామోదర్ మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ విభాగాలైన డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్, డీసీఆర్బీ.. డీటీఆర్బీ పరిపాలన విభాగంలోని ABP సెక్షన్లు తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం మరమ్మతులు, నవీనీకరణ చర్యలకు అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈనెల 7న వినాయక చవితి పండుగను ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. మంటపాలలో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని ఎస్పీ అన్నారు.
ఈనెల 7న వినాయక చవితి పండుగను ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. మంటపాలలో అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలన్నారు. విద్యుత్ వైర్లను ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలని, ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలని, మండపాల వద్ద ఎక్కువ శబ్ద కాలుష్యం చేసే స్పీకర్లను ఉపయోగించరాదని ఎస్పీ అన్నారు.
గిద్దలూరు మండలం గిద్దలూరు పుల్లయ్య హోటల్స్ సమీపంలో శాలువా వెంకటరమణ అనే 12 సంవత్సరాల బాలుడిని సోమవారం ఉదయం కన్న తండ్రి వదిలిపెట్టి వెళ్లిపోయాడు. రాత్రి అక్కడే ఉన్న బాలుణ్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు తమది బెస్తవారిపేట అని తెలుపగా.. అతడిని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మార్కాపురం మండలంలోని గొట్టిపడియ బీట్లోని చక్రాల కాలువ లొకేషన్ అటవీ ప్రాంతంలో మేతకు వెళ్ళిన గేదెను <<14000352>>చిరుత పులి చంపి<<>> తినేసినట్లు గ్రామస్థులు తెలిపారు. ఆదివారం మేత కోసం పశుపోషకులు గేదెను అడవిలోకి వదలగా.. రాత్రి ఇంటికి రాకపోవడంతో సోమవారం ఉదయం కాపరులు అడవిలో గాలించి చిరుత పులి దాడిచేసి చంపి తిన్నట్లు గుర్తించారు. అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు.
ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి రాతపూర్వక పిర్యాదులు/ వినతులను స్వీకరించి, వారితో ముఖాముఖీగా మాట్లాడి.. వారి సమస్యలను సమగ్రంగా అడిగి తెలుసుకున్నారు. వాటిని చట్టపరిధిలో విచారించి నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని ఎస్పీ వారికి భరోసా కల్పించారు.
కందుకూరు పట్టణ శివారులోని ఏకలవ్య నగర్ ప్రాంతంలో సోమవారం రాత్రి రెండు మోటారు బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇందూరు సాయి అనే యువకుడు మృతి చెందాడు. సాయి మణికంఠ అనే మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండడంతో అతనిని ఒంగోలు రిమ్స్కు తరలించారు. కందుకూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.
సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్కు వాట్సాప్లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.
Sorry, no posts matched your criteria.