Prakasam

News March 25, 2025

ఒంగోలు: ‘ఫిర్యాదులు సత్వరమే పరిష్కరిస్తాం’

image

ప్రజల నుంచి వచ్చే పిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమన్ని జిల్లా ఎస్పీ దామోదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. బాధితుల సమస్యలను శ్రద్ధగా విని, ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. 81 ఫిర్యాదులు అందినట్లు అధికారులు తెలిపారు.

News March 24, 2025

KG చికెన్‌కు రూ.10టాక్స్.. ఇదేనా విజన్: తాటిపర్తి

image

యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మరోసారి వ్యంగ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ‘విజన్ -2047 అంటే KG చికెన్‌కు రూ.10 L&P టాక్స్ కట్టడం. L&P టాక్స్ ఎలా అమలు చేయాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ నడుస్తోంది. కావాలంటే తెలుసుకోండి. భవిష్యత్‌లో ప్రతి కేజీ చికెన్‌పై దోపిడీకి జేబులు సిద్ధం చేసుకోవాలని ప్రజలకు నా విన్నపం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

News March 24, 2025

ఒంగోలులో ESI ఆసుపత్రి స్థాపించాలి: మాగుంట

image

ఒంగోలులో ESI ఆసుపత్రిని స్థాపించాలని పార్లమెంట్‌లో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు. రూల్ నం. 377 క్రింద ఆసుపత్రి ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రకాశం జిల్లాలో 3003 కర్మాగారాలలో 86000 మంది ఉద్యోగ కార్మికులు ఉన్నారని, వారందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారందరినీ దృష్టిలో ఉంచుకొని ఈఎస్ఐ ఆసుపత్రి స్థాపించాలని మాగుంట కోరారు.

News March 24, 2025

ప్రకాశం: నేటి నుంచి ఇన్విజిలేటర్ల మార్పు

image

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 146 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నుంచి 1,300 మందిని జంబ్లింగ్ రూపంలో మార్చారు. గణితం పీఎస్, ఎన్ఎస్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో మార్చామని, వారు ఆయా కేంద్రాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

News March 24, 2025

ప్రకాశం: EKYC ఎక్కడ చేస్తారంటే..?

image

EKYC కాకుంటే వచ్చేనెల నుంచి రేషన్ సరకులు అందవని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాలో 6.61లక్షల రేషన్ కార్డుల ఉండగా.. లబ్ధిదారుల సంఖ్య 19.37లక్షలుగా ఉంది. ఇందులో 17.31లక్షల మందే EKYC చేయించుకున్నారు. రాష్ట్రంలో ఎక్కడున్నా సరే.. అక్కడి మీసేవ, రేషన్ షాపు, ఆధార్ సెంటర్ల ద్వారా EKYC చేస్తారు. ఐదేళ్ల లోపు పిల్లలు తప్ప.. రేషన్ కార్డులో ఉన్నవారంతా EKYC చేయించుకోవాలి. ఈనెల 31 వరకు గడువు.

News March 23, 2025

మార్కాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సూసైడ్

image

కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మార్కాపురంలో చోటుచేసుకుంది. స్థానిక కొండేపల్లి రోడ్డులో నివాసం ఉంటున్న చదలవాడ పద్మజ (52) ZPH బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే గత కొన్నేళ్లుగా భార్యాభర్తల మధ్య వివాదం చోటు చేసుకుంటున్నట్లు SI సైదుబాబు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

News March 23, 2025

ఒంగోలు: పెళ్లి అయిన 9 రోజులకే మృతి

image

పెళ్లి అయిన 9 రోజులకే డాక్టర్ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఒంగోలుకు చెందిన శివాచారి(32) డాక్టర్ చదువుకుని పెదకాకాని మండలంలో డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ సభ్యులు ఈనెల 13న లావణ్యతో వివాహం చేశారు. రెండు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. వెంటనే విజయవాడ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

News March 23, 2025

చీమకుర్తి: లంచం తీసుకుంటూ దొరికిన ప్రిన్సిపల్

image

తన పాఠశాలలో అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే సిబ్బందికి జీతం అందాలంటే ప్రిన్సిపల్‌కి కొంత డబ్బులు సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో అటెండర్‌గా పనిచేసే వ్యక్తి నుంచి రూ.17,500 లంచం తీసుకుంటుండగా, ఏసీబీ డీఎస్పీ శిరీష, చీమకురి ఎస్టీ గురుకుల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్‌ని శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు.

News March 23, 2025

కనిగిరి: బయోగ్యాస్ ప్లాంట్ శంకుస్థాపనకు లోకేశ్.. ఎప్పడంటే.!

image

AP ప్రభుత్వం క్లీన్, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 500 బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రిలయన్స్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఒప్పందంలో భాగంగా.. ప్రకాశం జిల్లాలో పీసీపల్లి మండలంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. 500 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్ నిర్మాణానికి మంత్రి నారా లోకేశ్ ఏప్రిల్ 2న శంకుస్థాపన చేస్తారు.

News March 22, 2025

రైతులు కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి: జేసీ

image

జిల్లాలో 90 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. వాటిని రైతులు వినియోగించుకోవాలని కోరారు. కందులకు రూ.7,550, శనగలకు రూ.5,650, మినుములకు రూ.7,400 చొప్పున కనీస మద్దతు ధర ప్రకటించామన్నారు. బహిరంగ మార్కెట్‌లో కనీస మద్దతు ధర కంటే తక్కువ ఉన్నప్పుడు కొనుగోలు కేంద్రాలలో తమ ధాన్యాన్ని రైతులు విక్రయించి, ప్రభుత్వ కనీసం మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.

error: Content is protected !!