Prakasam

News September 2, 2024

ప్రకాశం: ఒక్క క్లిక్‌తో.. గణేశ్ ఉత్సవ పర్మిషన్ పొందండిలా.!

image

సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.

News September 2, 2024

ప్రకాశం: ఒక్క క్లిక్‌తో.. గణేశ్ ఉత్సవ పర్మిషన్ పొందండిలా.!

image

సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.

News September 2, 2024

అద్దంకి: ‘రంగంలోకి 500 మంది విద్యుత్ సిబ్బంది సిద్ధం’

image

వరదల కారణంగా రాష్ట్రంలో విద్యుత్ శాఖకు సంబంధించిన ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అలాగే ఏపీలోని మూడు డిస్కంల సీఎండీలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. సీపీడీసీఎల్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి ఈపీడీసీఎల్ నుంచి 300 మంది, ఎస్పీడీసీఎల్ నుంచి 200 టెక్నీషియన్లను వరద ప్రాంతాల్లో రంగంలోకి దింపాలని యోచిస్తున్నట్లు చెప్పారు.

News September 2, 2024

ప్రకాశం: ఒక్క క్లిక్‌తో.. గణేశ్ ఉత్సవ పర్మిషన్ పొందండిలా.!

image

సింగిల్ విండో విధానంతో గణేశ్ ఉత్సవాల అనుమతులు సులువుగా పొందవచ్చని ప్రకాశం జిల్లా SP దామోదర్ పేర్కొన్నారు. విగ్రహ పర్మిషన్లు సులభతరం చేయటానికి ప్రత్యేక పోర్టల్ రూపొందించినట్లు వెల్లడించారు. వివరాలకు 7995095800 నంబర్‌కు వాట్సాప్‌లో HI అని మెసేజ్ చేయగానే లింక్ వస్తుంది. లేదా, https://www.ganeshutsav.net/ వెబ్‌సైట్ ద్వారా అనుమతులు సులువుగా పొందవచ్చని తెలిపారు.

News September 2, 2024

ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు

image

ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ దామోదర్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి రాతపూర్వక పిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో విచారించి నిర్నీత గడువులో పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.

News September 2, 2024

చిన్నగంజాం దగ్గర బొలేరో బోల్తా

image

చిన్నగంజాం రెస్టారెంట్ దగ్గర బోలెరో అదుపుతప్పి బోల్తా పడటంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను పోలీసులు 108లో చీరాల గవర్నమెంట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు జిజిహెచ్ తరలించారు.

News September 2, 2024

మార్కాపురం మండలంలో పెద్దపులి సంచారం?

image

మార్కాపురం మండలం గొట్టిపడియ పంచాయతీలోని అక్కచెరువు తాండ అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం.! ఆదివారం గేదెను మేత కోసం అటవీ ప్రాంతంలో పశువుల కాపరులు వదిలారు. అయితే రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఉదయం అడవిలో వారు గాలించారు. పెద్ద పులి దాడి చేసి చంపి తిన్నట్లుగా గుర్తించి, వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 2, 2024

ప్రకాశం: ప్రతి నియోజకవర్గ కేంద్రంలో జాబ్ మేళాలు

image

నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రతి నియోజకవర్గ కేంద్రంలో నెలలో ఒక మెగా, రెండు మినీ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి టి. భరద్వాజ్ తెలిపారు. గత ఏడాది 20 జాబ్ మేళాలు జిల్లాలో నిర్వహించగా 2500 మంది హాజరయ్యారని తెలిపారు. వారిలో 1000 మంది ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు. నిరుద్యోగ యువత జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 2, 2024

ఉలవపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

ఉలవపాడు మండలంలోని కరేడు ర్యాంపు 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. మృతుడి వయస్సు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, నెల్లూరు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వ్యక్తి పూర్తి వివరాలు తెలియరాలేదు. SI కె. అంకమ్మ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

News September 2, 2024

ఒంగోలు: ‘ఆ బాధ్యత ఎంఈఓలదే’

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలలు రెసిడెన్షియల్ స్కూల్స్‌కు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సోమవారం సెలవులు ప్రకటించిన దృష్ట్యా పాఠశాలలు తెరవకుండా చూసే బాధ్యత ఎంఈఓలదేనని డీఈఓ సుభద్ర తెలిపారు. ఈ మేరకు ఆదివారం అన్ని మండలాల ఎంఈఓలకు ఆమె వాయిస్ మెసేజ్ సందేశాన్ని పంపారు. జిల్లాలోని పాఠశాలల మూసివేతకు సంబంధించిన సమాచారాన్ని నేడు గూగుల్ షీట్‌లో ఎంఈఓలు పంపాలని డీఈఓ సూచించారు.