India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొగాకు రైతులకు ఒంగోలు పొగాకు వేలం నిర్వహణ అధికారిణి తులసి కీలక సూచనలు చేశారు. ఒంగోలు పొగాకు వేలం కేంద్రం-2లో బ్యారన్లకు ఈనెల 18 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని తెలిపారు. పొగాకు బ్యారన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, మూడేళ్లకు ఓసారి రిజిస్ట్రేషన్ చేసే పద్ధతిని రైతులు గమనించాలని కోరారు. కౌలు రైతులు తప్పనిసరిగా సర్టిఫికెట్ లీజు కోసం నో డ్యూస్తో తమను సంప్రదించాలని సూచించారు.
ప్రస్తుతం మార్కాపురం జిల్లా ఏర్పాటుపై చర్చ సాగుతోంది. దర్శి, యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరుతో జిల్లా ఏర్పడవచ్చని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలో మార్కాపురం జిల్లాలో కలిసే మండలాల ప్రజలు భిన్నరీతిలో తమ వాదన వినిపిస్తున్నారు. దర్శి నియోజకవర్గం తాళ్లూరు, ముండ్లమూరు మండలాలను ప్రకాశంలోనే కొనసాగించాలని కోరుతున్నారు. మరి మీ మండలాలు మార్కాపురం ఉండాలా? ప్రకాశం జిల్లాలో ఉండాలా? అని కామెంట్ చేయండి.
శ్రీశైలం, నంద్యాల ఘాట్ రోడ్లలోనూ మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకాశం జిల్లా ప్రజా రవాణా అధికారి సత్యనారాయణ వెల్లడించారు. ఒంగోలులో ఆయన Way2Newsతో మాట్లాడుతూ.. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఘాట్ రోడ్లలో సీట్లు ఖాళీగా ఉన్నంత వరకు ప్రయాణికులను ఎక్కించుకోవాలని కండక్టర్లు, డ్రైవర్లకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు.
ప్రకాశం జిల్లాలో పలుచోట్ల యూరియా అందుబాటులో లేదు. త్రిపురాంతకం మండల పరిధిలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలతోపాటు గ్రోమోర్ సెంటర్లలో యూరియా అందుబాటులోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమౌతున్న రైతులకు యూరియా లేకపోవడం సాగుకు ఇబ్బందిని కలిగిస్తుంది. బయట దుకాణాల్లో ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు.
ప్రకాశం జిల్లాలో పలుచోట్ల యూరియా అందుబాటులో లేదు. త్రిపురాంతకం మండల పరిధిలోని ప్రైవేటు ఎరువుల దుకాణాలతోపాటు గ్రోమోర్ సెంటర్లలో యూరియా అందుబాటులోలేదని స్థానిక రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ వరి సాగుకు సిద్ధమౌతున్న రైతులకు యూరియా లేకపోవడం సాగుకు ఇబ్బందిని కలిగిస్తుంది. బయట దుకాణాల్లో ఎక్కువ ధరకు యూరియా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నా అందుబాటులో లేకపోవడంతో అన్నదాతలు అవస్థ పడుతున్నారు.
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించారు.
ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా ఒంగోలు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెకు పోలీసులు గౌరవ వందనం చేశారు. కలెక్టర్ కాలి పట్టీతో వేడుకలకు హాజరయ్యారు. కాలికి ప్రాక్చరై నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ కలెక్టర్ వేడుకలకు వచ్చారంటూ అక్కడి అధికారులు చర్చించుకోవడం కనిపించింది. వేడుకలు ముగిసేవరకు కలెక్టర్ అక్కడే ఉన్నారు.
చీమకుర్తిలోని ఓ ప్రైవేటు స్కూల్ నుంచి బాలికను శుక్రవారం కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. బాలిక తండ్రి తన నుంచి రూ.5 లక్షల అప్పు తీసుకుని ఇవ్వలేదని ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తి ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తర్వాత కుమార్తెతో తండ్రికి ఫోన్ చేయించాడు. బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఈశ్వర్ రెడ్డి బాలికను తిరుపతి వైపు తీసుకెళ్తుండటంతో పోలీసులు అతడిని వెంబడిస్తున్నారు.
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని క్రీడా పురస్కారాలను అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. ఒంగోలులోని డీఈవో కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన జిల్లాలోని 5 పాఠశాలలను ఎంపిక చేస్తామన్నారు. 2025 విద్యా సంవత్సరంలో స్కూల్ గేమ్స్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులు 18లోగా ధ్రువీకరణ పత్రాలను ఎస్సీఎఫ్ కార్యాలయంలో అందజేయాలన్నారు.
ప్రకాశం జిల్లాలో నూతన బార్ పాలసీ అమలుపై ఎక్సైజ్ శాఖ అధికారులు సమీక్షించారు. జిల్లా జనాభా ప్రాతిపదికన 25 బార్లు నిర్వహించడానికి ప్రతిపాదన చేశారు. 50వేల లోపు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.35 లక్షలు, ఆపైన 5లక్షల లోపు జనాభా ఉన్న ఏరియాల్లో రూ.55 లక్షలు ఫీజుగా నిర్ణయించారు. ఈ బార్లకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరించనున్నారు.
Sorry, no posts matched your criteria.