India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శనివారం ట్విట్టర్ వేదికగా ఆయన ముందస్తుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సర (ఉగాది) శుభాకాంక్షలు తెలుపుతూ.. ఈ నూతన తెలుగు సంవత్సరాదిలో అన్నీ శుభాలు జరగాలని జిల్లా ఎస్పీ దామోదర్ ఆకాంక్షించారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచెర్ల-మాగుటూరు మధ్య నల్లమల్ల అడవుల్లో కాటమ రాజుస్వామి తిరునాళ్ల సందర్భంగా.. శనివారం మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేవుళ్లకు జరిపే ఉత్సవాలు తిరునాళ్లు ఒక రాజుకి చేస్తున్నారంటే ఆయన ఎంత ప్రజారంజక పాలకుడో మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు. యాదవ తిలకుడు కాటంరాజు తిరునాళ్ల సందర్భంగా ప్రకాశం జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు.
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం గుండంచర్లలో శనివారం శ్రీ గంగా భవాని సమేత వేణుతల కాటమరాజు తిరునాళ్ల సందర్భంగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. కాటమరాజు కరుణతో రాష్ట్ర ప్రజలందరూ సుఖ శాంతులతో సిరిసంపదలతో కలకాలం ఉండాలని, ఆకాంక్షిస్తున్నట్లు నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టే కేంద్రాలు 30,31వ తేదీల్లో పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజుల్లో కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. కాబట్టి వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెలాఖరు అయినా తక్కువ చెల్లింపులు జరిగాయని అన్నారు.
జిల్లా సహకార అధికారి(DCO)ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోనే ప్రకాశం జిల్లా సహకార సంఘం అన్ని విధాలా వెనుకబడి ఉంది. దీనికి తోడు సంబంధిత అధికారి శ్రీనివాసరెడ్డి ఆ శాఖను సమన్వయం చేయటంలో విఫలమయ్యారని తేలింది. ఆ శాఖ ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో కలెక్టర్ కఠిన నిర్ణయం తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో కాల్స్ చేసి బెదిరించడం ఎక్కువైపోయింది. ఈక్రమంలో SP దామోదర్ ఓ ప్రకటన చేశారు. ACB అధికారులమంటూ వచ్చే కాల్స్పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తప్పు చేశారని.. అరెస్ట్ కాకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలని ప్రజలు, అధికారులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫేక్ ఐడీ కార్డులతోనూ మోసాలు చేస్తుంటారని.. ఎక్కడైనా ఇలా జరిగితే 91211 02266కు వాట్సప్లో సమాచారం ఇవ్వాలని కోరారు.
జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేనిపై మరో వివాదాస్పద ఆరోపణలు వస్తున్నాయి. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఓ స్టోన్ క్రషర్ నిర్వాహకుల నుంచి మాజీ మంత్రి విడదల రజినీ రూ.2 కోట్లు వసూలు చేసినట్లు సీఐడీ కేసు నమోదు చేసింది. గతంలో అప్పటి మంత్రి బాలినేనితో మాట్లాడి క్రషర్ యజమానిపై రజిని కేసు పెట్టించిందని లావు చెబుతున్నారు.
ఇంధన సర్దుబాటు ఛార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎస్కే. మాబు డిమాండ్ చేశారు. ఒంగోలులోని విద్యుత్ భవన్ వద్ద శుక్రవారం జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్నారు. ప్రజలపై భారాలు మోపడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు, చీకటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
అటు వైసీపీ ఇటు జనసేనలో మాజీ మంత్రి బాలినేని వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. నరసరావుపేట MP శ్రీకృష్ణదేవరాయలు బాలినేని పేరు ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం విజిలెన్స్ ఎస్పీ జాషువాపై ఒత్తిడి తీసుకువచ్చి బాలినేని స్టోన్ క్రషర్ నిర్వాహకుడిపై అభియోగం మోపినట్లు ఆరోపణలు చేశారు. కాగా స్టోన్ క్రషర్ నిర్వాహకుల వద్ద రూ.2 కోట్లు మాజీ మంత్రి రజిని వసూలు చేసినట్లుగా సీఐడీ కేసు నమోదు చేసింది.
Sorry, no posts matched your criteria.