Prakasam

News March 28, 2025

కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

image

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 28, 2025

ప్రకాశం జిల్లాలోనే అధిక ఎండలు

image

ప్రకాశం జిల్లాలో గురువారం ఎండ, వడగాల్పుల తీవ్రత కొనసాగింది. రాష్ట్రంలో అధిక ఎండలు ప్రకాశం జిల్లా నందనమారెళ్లలో 42.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నేడు పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ ఎండలకు బయటకు వెళ్లేముందు, గొడుగు, టోపీలు వాడాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే జిల్లాలోని పలు మండలాల్లో ఉదయం మంచు కురవడం గమనార్హం.

News March 28, 2025

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.

News March 27, 2025

ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించండి: మంత్రి స్వామి

image

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేలా వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ద చూపాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. గురువారం కొండపి ఎంపీడీఓ సమావేశ హాల్‌లో నియోజక వర్గ పరిధిలోని సీహెచ్‌సీ, పీహెచ్‌సీల డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్స్, ఆశా వర్కర్లతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు.

News March 27, 2025

ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్

image

ఒంగోలులోని భాగ్యనగర్‌లో ఉన్న ఈవీఎం గోడౌన్‌ను గురువారం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సందర్శించారు. ప్రకాశం జిల్లాలోని 8 నియోజకవర్గాల రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పరిశీలించారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈవీఎం గోడౌన్‌ను పరిశీలించాలి. కార్యక్రమంలో ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News March 27, 2025

ఒంగోలులో ఇఫ్తార్ విందు కార్యక్రమం

image

ఒంగోలులో జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘంశాఖ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని గోపాలస్వామి కళ్యాణమండపంలో గురువారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, మంత్రి స్వామి, ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే విజయకుమార్, ఒంగోలు మేయర్ గంగాడ సుజాత కమిషనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News March 27, 2025

ఒంగోలు: బాలల వనరుల కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

ప్రకాశం భవన్‌లో జిల్లా బాలల వనరుల కేంద్రాన్ని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా గురువారం ప్రారంభించారు. అనంతరం వెట్టి చాకిరి రహిత ప్రకాశం, బంగారు బాల్యం కార్యక్రమంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో అధికారులు, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ ఛైర్మన్ డాక్టర్ మండ్రు ప్రవీణ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్, బంగారు బాల్యం కమిటీ సభ్యులు ఎం.రమేశ్ బాబు పాల్గొన్నారు.

News March 27, 2025

అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తాం: స్వామి

image

టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో అంగన్వాడీ వర్కర్లతో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి స్వామి మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని చెప్పారు. ఖాళీలను గుర్తించి పోస్టులను భర్తీ చేస్తానన్నారు.

News March 27, 2025

ప్రకాశం: ఈ 9 మండలాల ప్రజలు జాగ్రత్త..!

image

ప్రకాశం జిల్లాలోని 9 మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావటంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. చీమకుర్తిలో 40.6, దర్శిలో 41.5, దొనకొండలో 40.7, కురిచేడులో 41.3, ముండ్లమూరులో 41.5, పొదిలిలో 41, పుల్లలచెరువులో 40.9, తాళ్లూరులో 41.2, త్రిపురాంతకంలో 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని సూచించారు.

News March 27, 2025

ఒంగోలు: కంప్యూటర్ టెస్ట్ వాయిదా

image

ఒంగోలు ఏబీఎన్ హైస్కూల్, ముప్పవరంలోని పీఎస్ ఎన్‌సీసీ హైస్కూల్, చీరాల రామకృష్ణాపురంలోని ఎమ్మెస్ హైస్కూల్లో ఎయిడెడ్ పోస్టుల నియామకానికి ఈనెల 28, 29వ తేదీల్లో కంప్యూటర్ టెస్ట్ జరగాల్సి ఉంది. కొన్ని కారణాలతో టెస్ట్ వాయిదా వేసినట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని కంప్యూటర్ టెస్ట్‌కు సంబంధించిన అభ్యర్థులు గమనించాలని కోరారు. తదుపరి తేదీని త్వరలో వెల్లడిస్తామన్నారు.