Prakasam

News September 1, 2024

ప్రకాశం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ప్రకాశం: రేపు విద్యా సంస్థలకు సెలవు
*ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
*కంభంలో సముద్రం కప్పలు ప్రత్యక్షం
*దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు
*రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు
*యూరప్ నుంచి ప్రకాశం జిల్లాకు చేరిన మృతదేహం
*‘కనిగిరిలో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలు’
*దర్శి కమిషనర్ పనితీరుపై హర్షం
*కంభంలో బులెట్ బైక్ దొంగతనం

News September 1, 2024

పొదిలి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

పొదిలి మండలం కాటూరివారిపాలెం గ్రామం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాటూరివారిపాలెంలోని పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న గుర్తుతెలియని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 1, 2024

రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు

image

భారీ వర్షాల దృష్ట్యా ఈనెల రెండవ తేదీ (సోమవారం ) జిల్లా వ్యాప్తంగా ‘మీకోసం’ కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా తెలిపారు. ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు, అర్జీలు ఇవ్వడానికి ప్రజలెవరూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆమె సూచించారు. అలాగే తూఫాన్ నేపథ్యంలో ప్రజలు వాగుల వంకల వద్ద జాగ్రత్త వహించాలన్నారు.

News September 1, 2024

దోర్నాల: ఘాట్ రోడ్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

image

దోర్నాల- శ్రీశైలం ఘాట్ రోడ్‌లో భారీ వర్షాల కారణంగా ఆదివారం సాయంత్రం కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో అధికారులు దోర్నాల – శ్రీశైలం ఘాట్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. పడిపోయిన కొండచరియలను JCB సహాయంతో వాటిని తొలగించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ప్రయాణికులు గమనించి తమకు సహకరించాలని అధికారులు కోరారు.

News September 1, 2024

ప్రకాశం: రేపు విద్యాసంస్థలకు సెలవు

image

ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రవేటు పాఠశాలలకు, రెసిడెన్షియల్ స్కూల్స్‌కు, కళాశాలలకు సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News September 1, 2024

కళాశాలలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: RIO

image

ప్రకాశం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించినట్లు RIO సైమన్ విక్టర్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకల వద్దకు విద్యార్థులు వెళ్లరాదన్నారు. అలాగే ఎవరైనా కళాశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

News September 1, 2024

ఒంగోలు: ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు

image

తుఫాను వల్ల ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో ఏవైనా అవాంతరాలు తలెత్తితే, సహాయ సహకారాలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎవరైనా సహాయం కొరకు 08592-227766 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని, ఈ విషయాన్ని నగరపాలక సంస్థ ప్రజలు గమనించాలని కోరారు.

News September 1, 2024

గల్లంతైన చిన్నగంజాం జాలర్ల వివరాలివే.!

image

చిన్నగంజాం మండలం రుద్రమాంబరంకు చెందిన జాలర్లు సముద్రంలో <<13993503>>గల్లంతైన విషయం తెలిసిందే. <<>>వివరాల్లోకి వెళితే.. నలుగురు జాలర్లు 10 రోజుల క్రితం చెన్నై మత్స్యకారులతో సముద్రంలో వెళ్లారు. బోటు మరమ్మతులకు గురికాగా తప్పిపోయారు. ప్రస్తుతం వారు విశాఖకు 150 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తప్పిపోయిన వారు కోండురి రాములు(24), బసవన్నగారి జయరాజు(23), కాటంగారి బాబురావు(35), అవల మునీయ్య (35)గా గుర్తించారు.

News September 1, 2024

గల్లంతైన చిన్నగంజాం జాలర్ల వివరాలివే.!

image

చిన్నగంజాం మండలం రుద్రమాంబరంకు చెందిన జాలర్లు సముద్రంలో గల్లంతైన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. నలుగురు జాలర్లు 10 రోజుల క్రితం చెన్నై మత్స్యకారులతో సముద్రంలో వెళ్లారు. బోటు మరమ్మతులకు గురికాగా తప్పిపోయారు. ప్రస్తుతం వారు విశాఖకు 150 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తప్పిపోయిన వారు కోండురి రాములు(24), బసవన్నగారి జయరాజు(23), కాటంగారి బాబురావు(35), అవల మునీయ్య (35)గా గుర్తించారు.

News September 1, 2024

కడప: ట్రిపుల్ ఐటీల్లో 213 మందికి ప్రవేశాలు

image

వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం నిర్వహించారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి చేపట్టిన ఈ కౌన్సెలింగ్లో 213 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 4,400 సీట్లు భర్తీ అయ్యాయి.