India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ఐటీ ప్రాంగణంలో ఆఖరి విడత కౌన్సెలింగ్ శనివారం నిర్వహించారు. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి చేపట్టిన ఈ కౌన్సెలింగ్లో 213 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. మొత్తం నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఉన్న 4,400 సీట్లు భర్తీ అయ్యాయి.
మోసపూరిత ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్తో లావాదేవీలు నిర్వహించి ఓ వ్యక్తి రూ.20 లక్షలు నష్టపోయాడు. బాధితుడి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో శనివారం వెలుగులోకి వచ్చింది. ఒంగోలు భాగ్యనగర్కు చెందిన కె.ఓబులేసు కొందరు నమ్మించి ఎస్బీఐ-ఐఎన్జటీ అనే సైట్ ద్వారా రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టించారు. తర్వాత వారు స్పందించకపోవడంతో మోసపోయానని గ్రహించి ఒంగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సెప్టెంబరు నెలకు సంబంధించి రేషన్తో పాటు పంచదారను పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసింది. ఆమేరకు చౌక ధరల దుకాణాలకు చేర్చడం జరిగింది. ఏఏవై కార్డులకు 1 కిలో రూ 13.50, ఇతర కార్డులకు 1/2 కేజీ రూ.17 పంపిణీ చేయనున్నారు. తూకం, నాణ్యత, పంపిణీలో లోపాలుంటే 1967 టోల్ ఫ్రీ నంబర్కు తెలియజేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందువల్ల అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు బయటికి రావాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సూచించారు. రాచర్ల మండలం జేసీ చెరువు నెమలిగుండ్ల రంగనాయక స్వామి దేవస్థానంకు వెళ్లిన భక్తులు వాగు ఉధృతిలో కొట్టుకుపోకుండా అధికారులను అప్రమత్తం చేసి రక్షించామన్నారు. పోలీస్, రెవెన్యూ, అటవీ శాఖ సమన్వయంతో పనిచేసినందుకు కలెక్టర్ అభినందించారు.
ఈ ఫొటోలో ఉన్న చిన్నారి తమ పాప అయితే తగిన ఆధారాలు చూపించి తీసుకెళ్లాలని ఒంగోలు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రెస్ నోట్ ద్వారా విజ్ఞప్తి చేశారు. 18 రోజుల వయసు ఉన్న ఈ పాపకు లావాణ్య అని అధికారులు నామకరణం చేశారు. ఒంగోలు రాంనగర్లోని 3వ లైన్లో ప్రస్తుతం చిన్నారిని ఉంచారు. పాపకు సంబంధించి ఎవరైనా ఉంటే అక్కడికి రావాలని అధికారులు కోరారు. లేకుంటే చిన్నారిని అనాథగా ప్రకటిస్తామని వెల్లడించారు.
ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మాణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇటీవల కేంద్ర పౌర విమానాల శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒంగోలులో ఎయిర్ పోర్టు నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ దశలో కొత్తపట్నం మండలం అల్లూరు, ఆలూరు గ్రామాల వద్ద 723 ఎకరాల భూమిని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇది ఒంగోలు, కొత్తపట్నం తీర ప్రాంతానికి సమాన దూరం ఉండనుంది. దీంతో తీర ప్రాంత ప్రజలకు సైతం ఎయిర్ పోర్టు సేవలు దగ్గర కానున్నాయి.
రాష్ట్రంలో కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో శనివారం ఆయన అధికారులను అప్రమత్తం చేశారు. వర్షాల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని సూచించారు. అలాగే ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బంది తలెత్తకుండా ఉండేలా చూడాలని ఆదేశించారు.
బేస్తవారిపేట పట్టణ సమీపంలోని అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసరావుపేట నుంచి గుంతకల్లు వెళ్తున్న లారీ డ్రైవర్ నిద్ర మత్తులో లారీని డివైడర్పైకి ఎక్కించాడు. దీంతో వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు.
జిల్లాలో నేరాల కట్టడికి అన్ని చర్యలను ఎప్పటికప్పుడు తీసుకోవాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో నెలవారి సమీక్షను ఎస్పీ నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అసాంఘిక కార్యక్రమాలపై నిరంతర నిఘా ఉంచాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు సంబంధించి ప్రకాశం జిల్లాకు ఐఏఎస్ అధికారి గంధం చంద్రుడు నియమితులయ్యారు. ఏపీ స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఆయనను జిల్లాలో ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ అధికారిగా నియమిస్తూ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.