India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై సీఎం చంద్రబాబుకు ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్. రియాజ్ ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఒంగోలు నియోజకవర్గంలో చేసిన అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. గురువారం అమరావతిలో సీఎంను కలిసిన రియాజ్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష పడింది. ఈ కేసులో సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ దామోదర్ ప్రత్యేకంగా అభినందించారు. కొమరోలు మండలం అక్కపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్.. అదే గ్రామానికి చెందిన ఓ బాలుడి పట్ల ప్రకృతి విరుద్ధ లైంగిక చర్యకు పాల్పడడంతో కేసు నమోదయింది. నేరం రుజువు కావడంతో నిందితుడికి న్యాయమూర్తి జీవిత ఖైదుతో పాటు రూ.50వేల జరిమానా విధించారు.
బల్లికురవ మండలంలోని కొమ్మినేని వారి పాలెంలో గురువారం విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న వ్యవసాయ కార్మికులు ప్రమాదవశాత్తు జారి కిందపడిపోవడంతో కరీమున్ అనే మహిళ మృతిచెందింది. మరో మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్లే ఈ ఘటన జరిగినట్లుగా స్థానికులు పేర్కొన్నారు.
అద్దంకి మండలానికి చెందిన విద్యార్థినిని సంపెంగుల రాజేశ్ అనే వ్యక్తి వెంటపడి వేధించి ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెదిరించి నాలుగు సార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ తెలియజేశారు.
విశాఖలో చూపించామని చెప్తున్న హుందాతనం.. ఒంగోలు, ఏలూరులో ఎక్కడికిపోయిందని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ప్రశ్నించారు. ‘ఓడిపోయే విశాఖ ఎమ్మెల్సీ సీట్లో రాజకీయ హుందాతనం పేరుతో ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎగ్గొట్టడం. ఒంగోలు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లను కొనడంలో మాత్రం హుందాతనం బదులు బొంకుతనం ప్రవేశపెట్టడం టీడీపీ రాజకీయ విధానం.’ అని Xలో పోస్ట్ చేశారు.
నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.
నోబెల్ బహుమతి గ్రహీత బాలల హక్కుల కార్యకర్త కైలాశ్ సత్యార్థి ప్రకాశం జిల్లాలో పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఒంగోలు వచ్చిన కైలాశ్ సత్యార్థి కలక్టరేట్లో కలెక్టర్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఇతర అధికారులు స్వాగతం పలికారు. ముందుగా కలెక్టరేట్ ప్రాంగణంలో ఆయన మొక్కలు నాటారు. బాలల హక్కులపై జిల్లా యంత్రాంగం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న వర్క్ షాపునకు ముఖ్య అతిథిగా కైలాశ్ హాజరయ్యారు.
ప్రకాశం జిల్లాలోని గ్రామ పంచాయతీలకు రూ.37.94 కోట్ల ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. జిల్లాలో 729 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలోని మొదటి వాయిదా కింద విడుదల చేయాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.37.94 కోట్లను కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామాల్లో అత్యవసర పనులు చేపట్టేందుకు పంచాయతీ అధికారులు ఈ నిధులను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.
వైసీపీ MLC పోతుల సునీత బుధవారం పార్టీ సభ్యత్వంతో పాటు MLC పదవికి కూడా రాజీనామా చేశారు. ఈ క్రమంలో ఆమె టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా, ఆమె రాజీనామాతో ఖాళీ అయిన MLC స్థానాన్ని పులివెందులకు చెందిన TDP సీనియర్ నేత బీటెక్ రవికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పులివెందుల పోటీ చేసిన బీటెక్ రవి జగన్పై ఓడిపోయిన విషయం తెలిసిందే.
➤ కనిగిరిలో నవ వధువు ఆత్మహత్య
➤ మాగుంటను ఎందుకు నిందితుడిగా చేర్చలేదు: సుప్రీం
➤ ముండ్లమూరులో ఆరు నెలలగా యువతిపై అత్యాచారం
➤ మార్కాపురం: కుర్చీలోనే కుప్పకూలి బ్యాంక్ మేనేజర్ మృతి
➤ చినగంజాంలో సందడి చేసిన సినీ తారలు
➤ రాచర్ల: గుండెపోటుతో విద్యార్థిని మృతి
➤ చీరాల: వైసీసీకి పోతుల సునీత రాజీనామా
➤ ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షం
➤ రాష్ట్ర స్థాయి పోటీలకు కందుకూరు విద్యార్థి ఎంపిక
Sorry, no posts matched your criteria.