India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లాలోని అర్హులైన కౌలు రైతులకు CCRC కార్డులు మంజూరు చేయాలని JC గోపాలకృష్ణ, సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టరేట్ నుంచి మంగళవారం మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వ్యవసాయ సీజన్లో రైతులకు ఎరువుల కొరత రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే అధికారులు సమన్వయంతో పనిచేసి కౌలు రైతులకు కార్డులను మంజూరు చేయాలన్నారు.
ఒంగోలు నగరంలో నక్ష సర్వేను 30 రోజుల్లో సచివాలయాల సెక్రటరీలు పూర్తి చేయాలని కమిషనర్ వెంకటేశ్వరరావు ఆదేశించారు. ఒంగోలులోని తన కార్యాలయంలో నక్ష సర్వే తీరుపై కమిషనర్ సమీక్షించారు. ఈ సర్వే పూర్తి చేసిన వెంటనే నగరపాలక సంస్థకు కేంద్రం రూ.50 కోట్ల ప్రోత్సాహకంగా అందజేస్తుందన్నారు. ఈ విషయాన్ని గమనించి సిబ్బంది పక్కాగా పనిచేయాలని కోరారు.
ఒంగోలుకు చెందిన జనసేన నేత షేక్ రియాజ్కు కీలక పదవి లభించింది. ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(OUDA) ఛైర్మన్గా ఆయనకు అవకాశం దక్కింది. ఈ మేరకు ఉత్వర్వులు వెలువడ్డాయి. గతంలో ఆయన జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. గత ఎన్నికల్లో కూటమి విజయానికి పనిచేయడంతో కీలక పదవి కట్టబెట్టారు.
రాచర్ల మండలంలో కిడ్నాప్నకు గురైన బాలికను ప్రకాశం ఎస్పీ దామోదర్ స్వీయ పర్యవేక్షణలో రక్షించిన విషయం తెలిసిందే. బాలికను కిడ్నాప్ చేసిన దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై ఆయన మాట్లాడుతూ.. గుర్తుతెలియని వ్యక్తులు ఎవరైనా పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మహిళలు, బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
రాచర్ల మండలం అనుమలవీడు వద్ద విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం మంగళవారం సంచలనంగా మారింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థినిని ఎక్కడి నుండో కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. ఎస్పీ దామోదర్ సారథ్యంలో జిల్లా మొత్తం పోలీసులు రంగంలోకి దిగడంతో, ఊపిరాడని కిడ్నాపర్లు ఆమెను దేవరాజుగట్టు వద్ద వదిలారు. ఈ కిడ్నాప్ వెనుక అసలు మిస్టరీ పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
రాచర్ల మండలం అనుమలవీడులోని పాఠశాల వద్ద ఇవాళ ఉదయం ఓ బాలిక కిడ్నాప్కు గురైన విషయం తెలిసిందే. పాఠశాల వద్దకు వచ్చిన దుండగులు కారులో బాలికను ఎత్తుకెళ్లారు. బాలిక తల్లి సీఐ రామకోటయ్య, ఎస్సై కోటేశ్వరరావుకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగారు. ఎస్పీ దామోదర్ పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు సైతం గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసుల భయంతో దేవరాజు గట్టు వద్ద బాలికను దుండగులు వదిలిపెట్టి పారిపోయారు.
దోర్నాల మండలం నల్లగుంట్ల గ్రామ సచివాలయంలోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు మట్టి కొట్టి, పగలకొట్టి పడవేశారు. ఈ ఘటన ఇటీవల వరుస సెలవుల సమయంలో జరుగగా, సోమవారం విధులకు వెళ్లిన సిబ్బంది చూశారు. సచివాలయంలోని పలు ప్లెక్సీలు కూడా చించివేయడం జరిగిందని సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
రాచర్ల మండలం చిన్నగానపల్లె గ్రామంలో గల రామన్నకతువ జలకళను సంతరించుకుంది. ఇటీవల జోరు వర్షాలు కురుస్తుండగా, రాత్రి కూడా వర్షం కురవడంతో రామన్న కతువకు వరద నీరు చేరింది. రామన్న కతువతో పాటు రాచర్ల మండలంలోని పలు గ్రామాల చెరువులకు వరద నీరు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ నీటి ప్రవాహం కంభం చెరువుకు సైతం చేరుతుండగా వేల ఎకరాలకు సాగునీటి ఇబ్బందులు తప్పినట్లుగా చెప్పవచ్చు.
ఇద్దరు మండల సర్వేయర్లను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర సర్వే విభాగం డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరికి కేటాయించిన విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహించినట్లు గుర్తించిన సర్వే విభాగం చర్యలు తీసుకుంది. ఒంగోలు రూరల్ సర్వేయర్ విష్ణువర్ధన్ను జరుగుమల్లి కేటాయించగా, అక్కడి సర్వేయర్ బాబురావును ఒంగోలు రూరల్కు బదిలీ చేశారు. వీరు బాధ్యతలు చేపట్టకపోవడంతో చర్యలు తీసుకున్నారు.
గిద్దలూరు మండలం వెల్లుపల్లె అటవీ ప్రాంతం సమీపంలో పొలాల్లోకి మేతకు వెళ్లిన గేదెను పులి దాడి చేసి చంపినట్లు స్థానికులు భావిస్తున్నారు. అందిన సమాచారం మేరకు.. ప్రతిరోజు వెల్లుపల్లె అటవీ ప్రాంతంలోకి పశువులు వెళ్తుంటాయి. అయితే పెద్దపులి దాడి చేసి గేదెను చంపినట్లు పశుపోషకుడు రంగస్వామి చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉంది. గేదె విలువ రూ.80 వేలు ఉంటుందని యజమాని వాపోయాడు.
Sorry, no posts matched your criteria.