Prakasam

News August 28, 2024

చిన్నగంజాం మండలంలో సినీ తారల సందడి

image

బాపట్ల జిల్లా చిన్నగంజాం మండల పరిధిలోని మోటుపల్లి గ్రామంలో బుధవారం సినీ తారల సందడి నెలకొంది. మైత్రి మూవీస్ బ్యానర్‌పై గోపీచంద్ డైరెక్షన్‌లో హిందీ సినిమా షూటింగ్ మోటుపల్లిలో జరుగుతుంది. ఈ సినిమాలో హీరోగా సన్నీ డియోల్ నటిస్తున్నారు. కాగా సినీ తారలను చూసేందుకు స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. చిన్నగంజాం ఎస్సై రమేశ్ షూటింగ్ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తున్నారు.

News August 28, 2024

ప్రకాశం: ‘యువతిపై 6 నెలలుగా అత్యాచారం’

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

News August 28, 2024

ప్రకాశం: ‘యువతిపై 6 నెలలుగా అత్యాచారం’

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

News August 27, 2024

జగన్ హయాంలో డిస్కంల కుంభకోణం: గొట్టిపాటి

image

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ప్రకటనలో తెలిపారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగాపడిపోయిందన్నారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.

News August 27, 2024

జగన్ హయాంలో డిస్కంల కుంబకోణం: గొట్టిపాటి

image

YS జగన్ పాలనలో విద్యుత్ వ్యవస్థ సర్వనాశనం అయ్యిందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పత్రికా ప్రకటన ద్వారా అన్నారు. జగన్ అనాలోచిత నిర్ణయాల కారణంగా డిస్కంల పనితీరు దారుణంగా పడిపోయిందని తెలిపారు. గడిచిన ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పులు అంతకంతకు పెరిగాయని ఆరోపించారు. డిస్కంల అప్పులు పేరు చెప్పి కరెంటు బిల్లులు పెంచి, జగన్ ప్రజల రక్తం తాగారని మండిపడ్డారు.

News August 27, 2024

ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’

image

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

News August 27, 2024

ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’

image

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

News August 27, 2024

ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’

image

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజులపాటు, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, వయస్సు 19- 45 ఉండి రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణా కాలంలో భోజనం, వసతి సౌకర్యాలు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు.

News August 27, 2024

ఒంగోలు: ‘ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ’

image

ఒంగోలు రూట్ సెట్ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 30 రోజుల్లో పాటు ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత అర్హులని, 19- 45 సం. రేషన్, ఆధార్ కార్డులు కలిగి ఉండాలన్నారు. శిక్షణ కాలంలో శిక్షణతో పాటు భోజనం, వసతి సౌకర్యాలు ఉన్నాయని వెల్లడించారు.

News August 27, 2024

మెత్తటి మాటలతో మోసం చేశారు: ఎమ్మెల్యే తాటిపర్తి

image

ఎన్నికల ప్రచారంలో మెత్తటి మాటలతో పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. ‘పాత పెన్షన్ పథకాన్ని (OPS) పునరుద్ధరిస్తాం, CPSను రద్దు చేస్తామని ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. OPS పునరుద్ధరించడం అసాధ్యమని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త UPS విధానంపై మీ నిర్ణయం ఏంటి..?’ అని ‘X’ వేదికగా ప్రశ్నించారు.