India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒంగోలులోని ఓ కళాశాలకు చెందిన బీటెక్ సెకండియర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన మంగళవారం జరిగింది. హాస్టల్లోని గది నుంచి దుర్వాసన రావడంతో విద్యార్థులు హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే విద్యార్థి ఉంటున్న గదిని తెరిచి చూడగా ఉరివేసుకొని విద్యార్థి మృతి చెంది కనిపించాడు. విద్యార్థి కందుకూరు మండలం అనంతసాగరానికి చెందిన భాస్కర్గా గుర్తించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆగస్టు 15 నాటికి జిల్లాలో బంగారు కుటుంబాల దత్తత ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో మార్గదర్శకుల ఎంపికను సైతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రకాశం జిల్లాకు 13, 14 తేదీలలో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం ఏర్పడే అల్పపీడనం అధిక ప్రభావం ఏపీలోని పలు జిల్లాలపై చూపుతుందన్నారు. ఆ జిల్లాలో జాబితాలో ప్రకాశం కూడా ఉందని, భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీ కోసం కార్యక్రమానికి 52 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ దామోదర్ అధ్వర్యంలో సాగిన మీకోసం కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదుదారులు వచ్చారు. సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకుని, మీ కోసం ఫిర్యాదులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఆదేశించారు.
మార్కాపురం జిల్లా కానుందనే టాక్ జోరందుకుంది. ఇందుకు ప్రధాన కారణం ఇటీవల ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్యలు తీసుకోవడమే. అయితే మార్కాపురంను జిల్లాగా ప్రకటన చేయాలన్న కల ఈనాటిది కాదు. ఎన్నికల సమయంలో సాక్షాత్తు సీఎం చంద్రబాబు ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చారు. కాగా అతి త్వరలో మార్కాపురం జిల్లా కానుందన్న వార్తల నేపథ్యంలో.. డివిజన్ పరిధిలోని ప్రజల నోట ఇప్పుడు ఇదే టాక్ ఆఫ్ టాపిక్గా మారింది.
కొత్తపట్నం బీచ్ వద్ద ఆదివారం హేమంత్ అనే వ్యక్తిని మెరైన్ పోలీసులు కాపాడారు. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నలుగురు వ్యక్తులు ఆదివారం సముద్ర స్నానం కోసం వచ్చారు. వీరిలో ఎం.హేమంత్ అలల తాకిడికి గురై అదృశ్యమయ్యాడు. అక్కడే ఉన్న మెరైన్ పోలీస్ సిబ్బంది ఆ వ్యక్తిని సురక్షితంగా ఒడ్డుకి చేర్చి PHCకి తరలించారు. అతని ప్రాణాలను కాపాడి బంధువులకు అప్పగించారు.
ఒంగోలులో అతడు రీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు అభిమానుల పేరుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అసభ్య వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు ఆదివారం ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల ఆధ్వర్యంలో పలువురు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేష్ పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా ఫారెస్ట్ పరిధిలో 75 బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల కాగా నేటితో ఆ గడువు ముగియనుంది. ఇంటర్ పాసై 18-30 ఏళ్లలోపు వయసు ఉన్న యువతీ, యువకులు APPSC వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. (1)బీట్ ఆఫీసర్ (CF) 10, (2) బీట్ ఆఫీసర్ (ఫ్రెషర్) 23, (3) అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (CF) 5, (4) అసిస్టెంట్ బీట్ ఆఫీసర్(ఫ్రెషర్) 37.
రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సామాజిక రక్షణ చట్టం కోసం ఆగస్టు 25న కలెక్టరేట్ వద్ద జరగనున్న ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి మాలకొండయ్య పిలుపునిచ్చారు. ఒంగోలులో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన, 50 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్, రజక వృత్తిదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.
Sorry, no posts matched your criteria.