India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫేక్ ప్రొఫైల్ DPలతో అపరిచిత ఫోన్ నంబర్ల నుంచి వచ్చే నగదు అభ్యర్థనలకు స్పందించకండి అని ప్రకాశం జిల్లా ఎస్బీ దామోదర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్ నేరాల బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. స్నేహితుల ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ల DPలుగా పెట్టుకొని మోసాలకు పాల్పడతారని అటువంటి వారిపై జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఒంగోలు అసెంబ్లీ ఎన్నికలలో వాడిన EVMలపై అనుమానం వ్యక్తం చేస్తూ వైసీపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు కమిషన్ నుంచి అనుమతి రావడంతో సొమవారం నుంచి మాక్ పోలింగ్కు కలెక్టర్ అన్సారియా ఏర్పాట్లు చేశారు. మాక్ పోలింగ్ ప్రారంభమైన వెంటనే వైసీపీ నేతలు అభ్యంతరం తెలిపారు. వీవీ ప్యాట్స్ లెక్కింపు అడిగితే దానికి విరుద్ధంగా ఎలక్షన్ కమిషన్ నడుస్తుందని కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఇచ్చారు.
ప్రకాశం జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి బుచ్చిబాబు(40) కాలిఫోర్నియా బీచ్లో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. 20 నెలల క్రితం ఆయన అమెరికా వెళ్లారు. ఆరు నెలల క్రితం భార్య, ఐదేళ్ల కుమారుడు కూడా అమెరికాకు వెళ్లారు. శనివారం బీచ్కి వెళ్లి స్నానం చేస్తుండగా నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముండ్లమూరులోని బుచ్చిబాబు తల్లిదండ్రులకు ఆదివారం ఈ సమాచారం అందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
చీరాల రైల్వే స్టేషన్ ఏర్పాటై 125 ఏళ్లు పూర్తయ్యాయి. దేశంలో వివిధ ప్రాంతాలను కలుపుతూ బ్రిటిష్ పాలకులు రైల్వే లైను నిర్మించారు. ఇందులో భాగంగా కోల్ కతా, చెన్నై ప్రధాన రహదారిలో చీరాల రైల్వేస్టేషన్ను 1899లో అప్పటి పాలకులు ఏర్పాటు చేశారు. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిపాలన కింద ఉంది.
ఒంగోలులో ఈరోజు నుంచి 24 వరకు రీ మాక్ పోలింగ్ను అధికారులు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేశారు. ఈవీఎంలు, ఓటింగ్ సరళిపై అనుమానాలు ఉన్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి అభ్యంతరం తెలపడంతో అధికారులు మాక్ పోలింగ్కు ఏర్పాటు చేశారు. ఒంగోలు నియోజకవర్గంలోని మొత్తం 12 కేంద్రాల్లో ఈ ప్రక్రియ జరగనుంది. దీంతో ఏం జరగనుందా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి నేటి నుంచి మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈవీఎంల్లో అవకతవకలపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని 6, 26, 42, 59, 75, 76, 123, 184, 192, 199, 245, 256 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను పరిశీలించనున్నారు. ఉ.10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షిస్తారు.
హాకీ మాంత్రికుడు ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలపరిధిలో ఈనెల 29న స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో సుభద్ర తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ 2023-24 క్రీడల్లో తప్పక పాల్గొని ఉండాలన్నారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు.
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. ఆదివారం జిల్లాలోని 21 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ స్టేషన్లలో ఉన్న ఎస్సైలకు స్థానచలనం కలిగించడంతో పాటుగా విఆర్లో ఉన్న వారికి పోస్టింగులు ఇచ్చారు. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ఎస్పీ పేర్కొన్నారు.
ముండ్లమూరుకు చెందిన దొద్దాల కోటేశ్వరరావు కుమారుడు బుచ్చిబాబు (40) అమెరికాలోని కాలిఫోర్నియాలో శనివారం మృతి చెందారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో బీచ్ కు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు బుచ్చిబాబు తల్లిదండ్రులు తెలిపారు. తల్లిదండ్రులకు కొడుకు చనిపోయిన విషయం తెలియటంతో శోకసముద్రంలో నిండిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మార్కాపురం పట్టణానికి చెందిన కరాటే స్కూల్ విద్యార్థులు చెన్నైలో జరిగిన కరాటే పోటీల్లో సత్తా చాటారు. చెన్నై మౌంట్ ఫోర్ట్ లోని ఇండోర్ స్టేడియంలో జరిగిన 3 జోన్ కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మార్కాపురానికి చెందిన విద్యార్థులు రెండు గోల్డ్ మెడల్స్, 4 బ్రాంజ్ మెడల్స్ సాధించారు. కె.మహితా రెడ్డి, భార్గవ్లు గోల్డ్ మెడల్స్ సాధించారు.
Sorry, no posts matched your criteria.