India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా పోలీసులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా.. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్కు ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి ఏవిదంగా వాడాలో తెలిపారు. ఏయే కోణాల్లో వాడాలి తదితర అంశాలపై మహిళా కానిస్టేబుల్స్కి వివరించారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలోని పత్తేపురంలో మంగళవారం <<14653215>>మధ్యాహ్నం దొరికిన ఆడ శిశువు<<>>ను సంతమాగులూరు ప్రాథమిక వైద్యశాలకు తరలించిన విషయం తెలిసిందే. ప్రాథమిక వైద్య సేవలు చేయగా.. శిశువు 3KGల బరువు ఉందని.. పొలాల్లో పడేయడంతో ఆక్సిజన్ అందక డీహైడ్రేషన్ అయినట్లు తెలిపారు. శిశువుకు పొట్ట కాస్త ఉబ్బుగా ఉందన్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్కు తరలించామన్నారు.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 38 ఉన్నత పాఠశాలల్లో పనివేళలు మారుస్తూ DEO ఎ.కిరణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఓ ఉన్నత పాఠశాల చొప్పున 38 పాఠశాలలను సెలెక్ట్ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పని వేళలు పొడిగించారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాఠశాలల టైమింగ్ మారిన విషయం తెలిసిందే.
అప్పుడే పుట్టిన ఆడ శిశువును పొలాల్లో పడేసిన ఘటన అందరినీ కలచివేస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పట్టాపురంలోని పొలాల్లో మంగళవారం అప్పుడే పుట్టిన ఆడ శిశువు లభ్యమైంది. అటుగా వెళుతున్న స్థానికులు చిన్నారి ఏడుపు విని అక్కడికి వెళ్లి చూడగా.. పసికందు ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని శిశువును సంతమాగులూరు ప్రాథమిక వైద్యశాలకు తరలించారు.
దోర్నాలలో ఓ తల్లికి బిడ్డకు జన్మనిచ్చానన్న ఆనందం కొన్ని క్షణాలు కూడా లేకుండా పోయింది. బాధితుల వివరాల ప్రకారం.. దోర్నాల మండలం నందిగూడేనికి చెందిన గురవయ్య భార్య వీరమ్మ సోమవారం ఓ బాబుకు జన్మనిచ్చింది. ఆమెను చూడటానికి అతడు, తన కూతురు పల్లవి అలాగే ఆశా వర్కర్ నాగమ్మను బైక్పై బయల్దేరారు. కొత్తూరు సమీపంలోకి రాగనే వారిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పల్లవి(2), నాగమ్మ(36) అక్కడికక్కడే మృతి చెందారు.
అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు నారా <<14645103>>చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు <<>>కురిపించారు. విజనరీ లీడర్ అవార్డు లభించడం పట్ల ఎమ్మెల్యే ఏలూరికి అధినేత చంద్రబాబు ఫోన్లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల అభ్యున్నతికి ఏలూరి చూపుతున్న దార్శనికతపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ దామోదర్ మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు.
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తల్లి, కూతురు లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
పోలీసులు ప్రతిరోజు ఏదొక రూపంలో వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్టులు పెట్టుకోండి అని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని వాటిని తేలిగ్గా తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒంగోలులో జరిగిన ఘటన ఒక ఉదాహరణ. ముగ్గురు విద్యార్థులు స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్యాంకర్ను ఢీకొనడంతో ముగ్గురూ చనిపోయారు. అదే హెల్మెట్ ధరించి ఉంటే వారు బతికే వారని స్థానికులు పేర్కొన్నారు.
అంతర్జాతీయ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో చీరాల టూటౌన్ ఎస్బి విభాగంలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ సీహెచ్ నాగరాజు సత్తా చాటి 40+ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. వెస్ట్ బెంగాల్ లోని న్యూ కూచ్ స్టేడియంలో ఈ నెల 15 నుంచి 17 వరకు పోటీలు జరిగాయి. దీంతో పలువురు ప్రముఖులు నాగరాజు ప్రతిభను అభినందిస్తున్నారు. షాట్ పుట్లో గోల్డ్, జావిలిన్ త్రోలో సిల్వర్ మెడల్ సాధించారు.
Sorry, no posts matched your criteria.