Prakasam

News July 3, 2024

BREAKING: కనిగిరి హైవేపై ట్రాక్టర్ అంబులెన్స్ ఢీ

image

కనిగిరి మండలం నందన మారేళ్ల హైవేపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్‌ని అంబులెన్స్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News July 3, 2024

కొరిశపాడు: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

కొరిశపాడు మండలంలోని రావినూతల గ్రామంలో కుటుంబ కలహాల నేపథ్యంలో మోపర్తి బసవరాజు బుధవారం తన పొలంలో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకోగా అప్పటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 3, 2024

ప్రకాశం: డిగ్రీ పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (డిస్టెన్స్) పరిధిలో ఫిబ్రవరి/మార్చి- 2024లో జరిగిన బీఏ, బీకామ్, బీబీఏ (సెమిస్టర్ ఎండ్) పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఆయా పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్‌సైట్ http://anucde.info/ResultsFeb24.asp చూడాలని పరీక్షల విభాగం తెలిపింది.

News July 3, 2024

జాతీయ స్థాయికి ఎంపికైన ఒంగోలు విద్యార్థినులు

image

జాతీయస్థాయి ఆర్చరీ పోటీలకు ఒంగోలులోని ఓ పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు ఎంపికైనట్లు పాఠశాల పర్యవేక్షణ అధికారి వసుంధర దేవి పేర్కొన్నారు. ఐదో తరగతి చదువుతున్న అభిలాష, నాలుగో తరగతి చదువుతున్న గీతాంజలి జూన్ 20న విజయవాడలో జరిగిన అండర్-13 విభాగంలో రాణించారని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించారు.

News July 3, 2024

ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

News July 3, 2024

శానంపూడి ఎంఎల్‌హెచ్‌పీ ఆత్మహత్య

image

శృంగవరపు కోట మండలం శానంపూడి హెల్త్‌ సెంటర్‌లో ఎంఎల్‌హెచ్‌పీగా పనిచేస్తున్న రమావంత్‌ రవినాయక్‌ (33) ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రైలు పట్టాలపై రవినాయక్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం ఆయన స్కూటీపై వచ్చి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని వారు వెల్లడించారు. పోలీసులు సంఘటనా స్థలం సమీపంలో స్కూటీని గుర్తించారు.

News July 3, 2024

ప్రకాశం: భర్తను హత్య చేయించిన భార్య.. ఎందుకంటే?

image

రాచర్ల మండలం రామాపురం గ్రామంలో జూన్ 29వ తేదీన ఓ వ్యక్తిని హతమార్చిన కేసులో ఇద్దరిని రిమాండ్‌కు తరలించినట్లుగా డీఎస్పీ బాలసుందరావు మంగళవారం వెల్లడించారు. పొలం పంపకం విషయంలో సొంత భార్య రాజేశ్వరి భర్త స్నేహితుడితో కలిసి భర్తను హత్య చేయించింది. విచారణలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని డీఎస్పీ బాలసుందరావు తెలిపారు.

News July 2, 2024

మార్కాపురం: భార్యను చంపిన భర్తకు జైలు శిక్ష

image

భార్యను హత్య చేసిన కేసులో భర్తకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ మార్కాపురం కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. మార్కాపురంలోని శరభయ్య మద్యానికి బానిసై భార్యపై అనుమానం పెంచుకున్నాడు. 2019లో భార్య పార్వతి నిద్రిస్తుండగా గొడ్డలి వెనుక భాగంతో తలపై కొట్టడంతో మృతి చెందింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హాజరపరచగా న్యాయమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు.

News July 2, 2024

ప్రకాశం: ఆగస్టు 31 వరకు చేపల వేట నిషేధం

image

ప్రకాశం జిల్లాలోని కందుల ఓబుల్ రెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయర్లో సోమవారం నుంచి ఆగస్టు 31 వ తేదీ వరకు చేపల వేటను నిషేధిస్తూ మత్స్య శాఖ అధికారి ఎం రవీంద్ర మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జులై 1 నుంచి ఆగస్టు వరకు చేపలు సంతానోత్పత్తి జరుపుతాయి కాబట్టి చేపల వేట చేయకూడదన్నారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన యెడల లైసెన్సులను రద్దుచేసే విధంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News July 2, 2024

ముండ్లమూరు: ASI వెంకటేశ్వరరావు సస్పెండ్

image

విధి నిర్వహణలో ఉన్న ఏఎస్సై వెంకటేశ్వరరావు ముండ్లమూరు మండలంలోని శంకరాపురంలో <<13549923>>మందుబాబులతో కలిసి డాన్సు<<>> చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ASI పై ఎస్పీ సుమిత్ సునీల్ విచారణ జరిపారు. విచారణ నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక పంపగా, గుంటూరు రేంజ్ ఐజి త్రిపాఠి ఈరోజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు.