Prakasam

News November 17, 2024

ఒంగోలులో తీవ్ర విషాదం.. ముగ్గురు చిన్నారులు మృతి

image

ఒంగోలు నగర సమీపంలోని కొప్పోలు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ముగ్గురూ ఒకే స్కూటీపై వెళ్తుండగా మంచినీటి ట్యాంకర్‌ను ఢీకొన్నారు. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.

News November 17, 2024

ఒంగోలు పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గేమ్‌ల వివరాలు ఇవే

image

ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో‌ శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు వాలీ బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో, మహిళలకు వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలతోపాటు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.

News November 16, 2024

ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎవరంటే..?

image

ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసరెడ్డి YCPని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చుండూరి రవిబాబును YCP ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. దీంతో ఆయన నేపథ్యం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. సీనియర్ NTరామారావు హయాంలో టీడీపీలోకి ప్రవేశించారు. 2004, 2009లో TDP టికెట్ ఆశించినా రాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపుతో YCPలో చేరారు. ఇతని స్వస్థలం నాగులుప్పలపాడు మండలం.

News November 16, 2024

మాజీ MLA టీజేఆర్‌కు కీలక బాధ్యతలు

image

ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు సంతనూతలపాడు మాజీ MLA టీజేఆర్ సుదాకర్ బాబు, వెంకట రమణా రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.

News November 15, 2024

ప్రకాశం జిల్లాలో 33 మంది కానిస్టేబుళ్ల బదిలీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న 33 మంది కానిస్టేబుళ్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఎస్పీ ఆర్.దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కానిస్టేబుళ్ల బదిలీల్లో కొందరికి నిర్దేశిత కాల పరిమితి పూర్తయిన వారు ఉన్నారు. ఆయా పోలీస్ స్టేషనల్లో పనిచేస్తూ బదిలీ అయిన వారిని రిలీవ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News November 15, 2024

ప్రకాశం: అక్రమ మద్యం విక్రయాలపై తనిఖీలు

image

ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా బెల్ట్ షాపులు, బార్లు, రెస్టారెంట్లు & దాబాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. లైసెన్స్ లేని దుకాణదారులు, అక్రమ మద్యం అమ్మేవారి వివరాలు సేకరించారు.

News November 15, 2024

తిరుమల శ్రీవారికి 15 బైకుల అందజేత

image

తిరుమల శ్రీవారికి ఒంగోలు వాసులు ఎలక్ట్రిక్ స్కూటర్లను వితరణగా ఇచ్చారు. పియరల్ మినరల్ అండ్ మైన్స్ కంపెనీ ఎండీ వెంకట నాగరాజ దాదాపు రూ.25 లక్షల విలువైన 15 బైకులను అందజేశారు. ఈ సందర్భంగా వాటికి ఆలయం ముందు పూజలు చేశారు. దాతలకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి కృతజ్ఞతలు తెలిపారు.

News November 15, 2024

పొన్నలూరు క్రీడాకారిణి మైథిలి మరణం.. కేసు 

image

పొన్నలూరు మండలానికి చెందిన క్రీడాకారిణి మైథిలి గత నెల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే బాలిక మృతికి జిల్లా స్పోర్ట్స్ సెక్రటరీ వనజ, పీఈటి బన్నీ, కృపాకర్ కారణం అంటూ కొద్దిరోజులుగా తల్లిదండ్రులు పోరాటం చేస్తున్నారు. పోటీలు జరిగిన తర్వాత తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చలేదని పవన్ కళ్యాణ్‌ని కలసి వివరించారు. దీంతో గురువారం ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. 

News November 15, 2024

ప్రకాశం ఎస్పీ స్ట్రాంగ్ వార్నింగ్

image

సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన, అనైతిక, విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో గురువారం రాత్రి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, టెలిగ్రాం, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్), ఇతర సోషల్‌ మీడియాలో ఇతరులను కించపరిచేలా పోస్టులు పెట్టి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దన్నారు.

News November 14, 2024

ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ

image

ప్రకాశం జిల్లాలో 12 మంది ఏఎస్ఐలు బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ దామోదర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీలు తక్షణమే అమలులోకి వస్తాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్సైలు, సీఐలు బదిలీ అయినా ఏఎస్ఐలకు రిలీవింగ్ ఆర్డర్లను ఇవ్వాలని, బదిలీ అయినా పోలీస్ స్టేషన్ వివరాలను వారికి తెలపాలని ఎస్పీ అధికారులకు సూచించారు.