Prakasam

News July 1, 2024

కురిచేడు: ఆలస్యంగా వెలుగులోకి మృతదేహం

image

కురిచేడు మండలంలోని దేకనకొండ గ్రామ పొలాల్లో ఓ వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైనట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు. మృతుడు తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా గోపాలపేటకు చెందిన అయినవోని లక్ష్మయ్య (55)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నుంచి దర్శికి బతుకుదెరువు కోసం అతను వచ్చినట్లు తెలిసింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

News July 1, 2024

ముండ్లమూరు: చేపలు పట్టేందుకు వెళ్లి.. 

image

బావిలో పడి వ్యక్తి మృతిచెందిన ఘటన ముండ్లమూరు మండలంలోని వేములలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వినుకొండ నాగరాజు (48) చెరువు వద్ద బావిలో చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఆసమయంలో ప్రమాదవశాత్తూ కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. నీరు పూర్తిగా బయటకు వెళ్తేనే మృతదేహం లభ్యమవుతుందని తెలిపారు.

News July 1, 2024

గిద్దలూరు మీదుగా వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు పొడిగింపు

image

గుంటూరు – సికింద్రాబాద్ ట్రైన్ నంబర్ 17253 రైలు జులై 1 నుంచి ఔరంగాబాద్ వరకు పొడిగించి ఔరంగాబాద్ ఎక్స్ ప్రెస్ రైలుగా నడుపుతున్నట్లు గిద్దలూరు కమర్షియల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. గుంటూరులో ఉదయం 7.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.50 గంటలకు ఔరంగాబాద్ చేరుకుంటుందన్నారు. ఇదే రైలు ఔరంగాబాద్‌లో సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9.30 గంటలకు గుంటూరు చేరుతుందన్నారు.

News July 1, 2024

పింఛన్ల పంపిణీకి పంపిణీకి అంతా సిద్ధం: ప్రకాశం కలెక్టర్

image

ప్రకాశం జిల్లాలో పింఛన్ల పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తమీమ్‌ అన్సారియా తెలిపారు. గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు ఉదయం 6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రారంభిస్తారన్నారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేని చోట ఇతర ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. 1వ తేదీనే దాదాపు పూర్తి చేయాలని పేర్కొన్నారు.

News June 30, 2024

సింగరాయకొండ: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలకుంట్లపాడులో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో రాజమండ్రికి చెందిన షేక్ జానీ(40) మృతి చెందాడని ఎస్సై శ్రీరామ్ ఆదివారం తెలిపారు. 5 సం. క్రితం వలస వచ్చి అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ రొయ్యల పరిశ్రమంలో కూలీగా పని చేస్తున్నాడన్నారు. రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టడంతో అదే వాహనం ముందు చక్రం కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశామన్నారు.

News June 30, 2024

దర్శి: అమ్మమ్మ ఇంటికి వచ్చి తనువు చాలించిన చిన్నారులు

image

దర్శి మండలంలోని తూర్పు వీరయ్య పాలెంలో ప్రమాదవశాత్తు వాగులో పడి మృతి చెందిన చిన్నారుల వివరాలను పోలీసులు గుర్తించారు. పొదిలి మండలం వేలూరు గ్రామానికి దర్నాసి విరమణికంఠ (10)కాగా, అద్దంకి మండలంలోని వేల మురిపాడుకు చెందిన పులిమి రాఘవ (12) చెందిన బాలురుగా గుర్తించారు. చిన్నారులు తూర్పు వీరయపాలెంలోని అమ్మమ్మ ఇంటికి రాగా ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News June 30, 2024

గిద్దలూరు: టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్లు

image

గిద్దలూరుకు చెందిన ఆరుగురు వైసీపీ కౌన్సిలర్లు నగర పంచాయితీ ఛైర్మన్ వెంకట సుబ్బయ్య ఆద్వర్యంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుముల అశోక్ రెడ్డి ఆదివారం వారికి తెలుగుదేశం పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన కౌన్సిలర్లలో నాగేశ్వరరావు, గరే సుబ్బారావు, మోడంపల్లె శ్రీరాములు, పెద్దవలి తదితరులు ఉన్నారు.

News June 30, 2024

ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం

image

దర్శి మండలం తూర్పు వీరాయపాలెంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వాగులో పడి ఇద్దరు బాలురు మృతి చెందారు. మృతులు రాఘవ (9), సాయిచరణ్ (8)గా స్థానికులు గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

ప్రకాశం జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

image

రాచర్ల మండలం రామాపురం గ్రామంలో ఓ వ్యక్తి హత్యకు గురయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. రామాపురం గ్రామానికి చెందిన అన్నపురెడ్డి చిన్న రంగారెడ్డి (52) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, ప్రాధమిక దర్యాప్తులో హత్యకు గురి అయినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 30, 2024

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో జిల్లా వాసి మృతి

image

ఆర్మీ యుద్ధ విన్యాసాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. శనివారం చోటు చేసుకున్న ఈ ఘటనలో జిల్లావాసి మృతి చెందారు. రాచర్ల మండలం కాలవపల్లి గ్రామానికి చెందిన ముత్తుముల రామకృష్ణారెడ్డి మిలిటరీలో పనిచేస్తున్నారు. నీటిలో ఆర్మీ విన్యాసాలు చేస్తుండగా మొత్తం ఐదుగురు కొట్టుకుపోయారు. వారిలో ఒకరు రామకృష్ణారెడ్డిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.