India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాధితులు నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు కోసం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 90 ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి, త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.
పొన్నలూరు గ్రామానికి చెందిన గోసుల సుజాత తన భర్త పెట్టే వేధింపులు భరించలేక ఈ నెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తుండగా ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పొన్నలూరు ఎస్సై అనూక్ సోమవారం కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. కొట్టాలపల్లికి చెందిన వేముల మస్తాన్ మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మస్తాన్ తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి, కందుకూరును ప్రకాశంలో కలపడం వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలు జరిగేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మరి మీ కామెంట్.
జాతీయస్థాయి తొమ్మిదో ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభ చూపారు. మంగళగిరిలో అదివారం జరిగిన టీం పోటీల్లో పదేళ్ల లోపు బాలికల వ్యక్తిగత కటా విభాగంలో కీర్తిక బంగారు పతకం, పదకొండేళ్ల బాలుర కటావిభాగంలో సాయి ప్రతీక్ కాంస్య పతకం, పదేళ్ల లోపు బాలుర కటావిభాగంలో జయ సాయివిష్ణువర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించారు. విద్యార్థులతోపాటు శిక్షణ ఇచ్చిన మాస్టర్ వేణును గ్రామస్థులు అభినందించారు.
➤కోటా శ్రీనివాసరావు (చాకరాయపాలెం ZPHS)
➤ గోనెళ్ల వరలక్షి (ఈపురుపాలెం ZPHS)
➤ పవని బాను చంద్ర మూర్తి (చీరాల-పేరాల)
➤ మర్రి పిచ్చయ్య (పొదిలికొండపల్లి ZPHS)
➤ SK మజ్ను బీబీ (బసవన్నపాలెం ZPHS)
➤అర్రిబోయిన రాంబాబు (సింగరాయకొండ MPPS)
➤బక్కా హెప్సిబా (K.బిట్రగుంట KGBV)
ప్రకాశం జిల్లా ఉలవపాడు SI అంకమ్మ శనివారం ప్రాణాలకు తెగించి ఓ సాహసం చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. ఉలవపాడులోని వేణుగోపాలస్వామి ఆలయ కోనేరులో మతిస్థిమితంలేని యువకుడు శనివారం కాలుజారి పడ్డాడు. విషయం తెలుసుకున్న SI అక్కడికి చేరుకున్నారు. తర్వాత తానే స్వయంగా కోనేరులో దూకి యువకున్ని కాపాడే ప్రయత్నం చేయగా దురదృష్టవశాత్తు అతడు అప్పటికే మృతి చెందాడు.
రెండో జాబితాలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కూటమి నాయకులకు పలు నామినేటెడ్ పదవులు దక్కాయి. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్గా జీవీరెడ్డి నియమితులయ్యారు. ఏపీ కల్చరల్ కమిషన్ ఛైర్మన్గా తేజస్వి పొడపాటి ఎంపికయ్యారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ ఛైర్మన్గా మరెడ్డి శ్రీనివాస రెడ్డి, ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్గా డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్కు అవకాశం దక్కింది.
మంత్రి నారా లోకేశ్పై అసత్య ఆరోపణలు చేశారంటూ MLA తాటిపర్తి చంద్రశేఖర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. యర్రగొండపాలెం టీడీపీ కార్యకర్త చేదూరి కిషోర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చౌడయ్య తెలిపారు. సెప్టెంబర్ 18న లోకేశ్పై వారం వారం పేకాట క్లబ్ ద్వారా లోకేశ్కు కమీషన్ అందుతున్నాయని X వేదికగా ఎమ్మెల్యే పోస్టు చేశారు. కార్యకర్త ఫిర్యాదుతో వాట్సాప్ ద్వారా పోలీసులు ఎమ్మెల్యేకు నోటీసులిచ్చారు.
బ్లేడుతో ఓ వ్యక్తి మహిళ గొంతు కోసిన ఘటన కనిగిరి పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. పట్టణంలోని గార్లపేట రహదారిలోని హోటల్లో టిఫిన్ చేస్తున్న పోలా కోటేశ్వరమ్మ అనే మహిళను మరిది ఆంథోనీ అనే వ్యక్తి బ్లేడుతో గొంతు కోసి గాయపరిచాడు. బంధువులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సీఐ ఖాజావలి, ఎస్సై శ్రీరామ్ ఆసుపత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.