India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మద్యం మత్తులో ఓ వ్యక్తి వీరంగం సృష్టించిన ఘటన పామూరు మండలం నుచ్చుపొదలలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. తిరుపాల్ రెడ్డి, సురేంద్ర శనివారం మద్యం మత్తులో గొడవపడ్డారు. సురేంద్ర స్థానిక నేత రహముతుల్లా సహాయంతో తిరుపాల్ రెడ్డిని పిలిపించి పంచాయితీ పెట్టారు. ఆగ్రహంతో తిరుపాల్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో రహముతుల్లా కుమారుడు నిజాముద్దీన్, బంధువు హజరత్, సురేంద్రలపై కత్తితో దాడి చేసినట్లు తెలిపారు.
ఆంధ్ర కేసరి యూనివర్శిటీ పరిధిలోని 88 డిగ్రీ కళాశాలలో చదువుతున్న మూడో సెమిస్టర్ విద్యార్థులకు నవంబర్ 5వ తేదీ నుంచి, 13వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్శిటీ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ బి పద్మజ తెలిపారు. ఈ పరీక్షలకు గాను ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 88 డిగ్రీ కళాశాల నుంచి మొత్తం 6942 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లా రీజనల్ కో- ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి రేపు ఉదయం మంగళవారం 10:00 గంటలకు ఒంగోలు పార్టీ ఆఫీస్లో ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. మండల పార్టీ అధ్యక్షుడు, MPPలు, ZPTCలు, మున్సిపల్ ఛైర్మన్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కోరారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 74 ఫిర్యాదులు వచ్చాయి. ఆయా ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి, ఆ ఫిర్యాదులపై చట్ట ప్రకారం విచారణ జరిపి త్వరగా ఫిర్యాదు దారులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని ఎస్పీ దామోదర్ ఆదేశించారు.
అద్దంకికి చెందిన ఇంటర్ విద్యార్థి దుర్గాప్రసాద్ (17) గుండ్లకమ్మలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా మృతికి గల కారణాలను పోలీసులు వెల్లడించారు. ఆటోలో పండ్ల వ్యాపారం చేస్తున్న తన తండ్రి ATM నుంచి రూ. 500 బాలుడు డ్రా చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలుడుని అడుగగా మనస్తాపం చెంది, తల్లిదండ్రులను బెదిరించాలనే ఉద్దేశంతోనే గుండ్లకమ్మలో దూకి ప్రమాదవశాత్తు మృతి చెందాడని తెలిపారు.
ఒంగోలులోని వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద రెడ్డి చెప్పారు. సమావేశానికి పార్టీ జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొంటారన్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అన్ని కమిటీలతో సమావేశం నిర్వహిస్తారని పేర్కొన్నారు.
అద్దంకి పట్టణంలో రంగారావు ఆసుపత్రిలో రెండో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి కింద పడి మృతి చెందిన ఘటన ఆదివారం జరిగింది. ఆసుపత్రిలో మరమ్మతుల నిమిత్తం కూలి పనికి వెళ్లిన అతడు ప్రమాదవశాత్తు కిందపడి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై ఖాదర్ బాషా ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
త్రిపురాంతకం మండలంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం సినీ హీరో సమన్ పూజలు చేశారు. శ్రీమత్ బాల త్రిపుర సుందరీ దేవి ఉభయ దేవాలయాలను ఆయన దర్శించుకున్నారు. ఆలయాల ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవారి ఆశీస్సులను అందించారు.
వాహనదారులు పెండింగ్లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని ఎస్పీ దామోదర్ సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయం నుంచి శనివారం ఒక పోస్టర్ను విడుదల చేశారు. పెండింగ్లో ఉన్న చలానాలను వెంటనే చెల్లించాలని లేదంటే వాహనాన్ని పోలీసులు జప్తు చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. సమీపంలోని మీసేవ కేంద్రాలలో, ఫోన్ పే ద్వారా చలానాలను చెల్లించాలని కోరారు.
తర్లుపాడు మండలంలోని సూరెపల్లి రైల్వే గేట్ సమీపంలో శనివారం రైలు కింద పడి వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలిస్తున్నారు. మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.