Srikakulam

News September 13, 2024

పలాస హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్

image

పలాసలోని కిడ్నీ రీసెర్చ్ హాస్పిటల్లో అరుదైన ఆపరేషన్ జరిగింది. వజ్రపుకొత్తూరు మండలం గరుడభద్ర గ్రామానికి చెందిన యండమూరి నరసమ్మ(58) జీర్ణాశయంలో ఇబ్బంది ఉందని హాస్పిటల్‌కి వచ్చారు. స్కాన్ చేసి కడుపులో గడ్డ ఉందని గుర్తించారు. స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ కవిటి సాహితీ, మత్తు డాక్టర్ తృప్తి సహాయంతో సుమారు 5 కేజీల బరువున్న గడ్డని తొలగించారు.

News September 13, 2024

శ్రీకాకుళంలో టుడే టాప్ స్టోరీస్

image

✵ నందిగాంలో నకిలీ నోట్ల కలకలం ✵ శ్రీకాకుళంలో నాలుగు ఇసుక ర్యాంపులు ✵ అలసత్వం వహిస్తే చర్యలు: అచ్చెన్న ✵ శ్రీకాకుళం-తిరుపతికి ప్రత్యేక రైళ్లు ✵ న్యూకాలనీలో తవిటమ్మ మృతి నేత్రాలు మరొకరికి దానం ✵ ఈనెల 14న జిల్లాకు జాతీయ ST కమిషన్ సభ్యుడు ✵ ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు గడువు పెంపు ✵ జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బి. ప్రసాదరావు ✵ వంశధార కాలువలో పడి వ్యక్తి మృతి ✵ సోంపేటలో పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

News September 12, 2024

SKLM: పాము కాటుతో మహిళ మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన జరిగింది. బూర్జ గ్రామానికి చెందిన ఖండ్యాపు లక్ష్మీ(53) గురువారం పొలానికి వెళ్లారు. అక్కడ పాము కాటు వేయడంతో పొలంలోనే మృతిచెందారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

News September 12, 2024

శ్రీకాకుళం: విజిలెన్స్ ఎస్పీగా ప్రసాదరావు బాధ్యతల స్వీకరణ

image

శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ ఎస్పీగా బర్ల ప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విజిలెన్స్ ఎస్పీ సురేష్ బాబు నుంచి పదవీ బాధ్యతలు తప్పకున్నారు. అనంతరం జిల్లా స్థాయి విజిలెన్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్పీకి పలువురు అభినందనలు తెలియజేశారు.

News September 12, 2024

శ్రీకాకుళం: దసరా,దీపావళికి ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే దసరా, దీపావళి ఫెస్టివల్స్‌కు శ్రీకాకుళం నుంచి తిరుపతికి (07443), తిరుపతి నుంచి శ్రీకాకుళానికి (07442) ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు ద.మ రైల్వే అధికారులు ఓ ప్రకటనలో గురువారం తెలిపారు. 07443 రైలు అక్టోబర్ 7 నుంచి నవంబర్ 11 వరకు నడుస్తుందన్నారు. 07442 రైలు అక్టోబర్ 06 నుంచి నవంబర్ 10 వరకు నడుస్తుందని..ప్రయాణికులు గమనించాలని కోరారు.

News September 12, 2024

సోంపేట: అదుపుతప్పి పంటపొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

శ్రీకాకుళం నుంచి ఇచ్ఛాపురం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకుపోయింది. 20 మంది ప్రయాణీకులతో శ్రీకాకుళం నుంచి బయలుదేరిన బస్సు సోంపేట మండలం మామిడిపల్లి గ్రామం సమీపంలో ఒక్కసారిగా అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణీకులకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలు తెలియరాలేదు.

News September 12, 2024

తిరుపతి- శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు

image

తిరుపతి- శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. అక్టోబరు 6నుంచి నవంబర్ 10 వరకు ఈ రైలు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ స్టేషన్ల మధ్య నడవనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు, శ్రీకాకుళం- తిరుపతి మధ్య అక్టోబరు 7 నుంచి నవంబర్ 11 వరకు ఈ ప్రత్యేక రైలు.. ప్రతి సోమవారం అందుబాటులో ఉంటుందని వివరించారు.

News September 11, 2024

SKLM: నది కాలువలో ఒకరు మృతి

image

నీట మునిగి ఒకరు చనిపోయిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. ఆమదాలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామ సమీపంలోని వంశధార కుడి కాలువలో స్నానం చేయడానికి గుండ చంద్రుడు(44) బుధవారం వెళ్లారు. ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు. ఎస్ఐ వెంకటేశ్ మృతదేహాన్ని పరిశీలించి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.

News September 11, 2024

శ్రీకాకుళం: ప్రకృతి వైపరీత్యాలలో బ్యాంకర్ల సహకారం ఎంతో అవసరం

image

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, సమాజ ఆర్థికాభివృద్ధితో పాటు జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతైనా అవసరం అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (DCC), బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఇటీవలీ వరదల వల్ల నష్టాన్ని అంచనా వేస్తామన్నారు. సహయార్థం తమ వంతు బాధ్యత వహించాలన్నారు.

News September 11, 2024

శ్రీకాకుళం: ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో స్పాట్ అడ్మిషన్లు

image

శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాలలో ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీలో మిగిలి సీట్ల భర్తీ కోసం అర్హులైన విద్యార్థుల నుంచి స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం.ప్రదీప్ తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. జీవశాస్త్రం సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అన్నారు. వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.