India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధికి కృషి చేసిన రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు త్యాగాలు మరువలేని అన్నారు.
స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో త్రివర్ణ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జన్మించారు. బారువ, మందస పాఠశాలలో విద్యాభ్యాసం ముగించుకొని 21వ ఏట గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. పలు ఉద్యమాలలో పాల్గొన్న లచ్చన్న అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. లచ్చన్న భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.
పాతపట్నంలో ఇటీవల జరిగిన నల్లి రాజు <<17401849>>మర్డర్<<>> కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రాజు అడ్డు తొలగించుకోవాలని అనుకున్న భార్య అతనికి అన్నంలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. అతను నిద్రలోకి జారున్న తర్వత ప్రియుడు ఉదయ్కు, మరో వ్యక్తి మల్లికార్జున్కి ఫోన్ చేసింది. వారు వస్తూ వీదిదీపాలను ఆర్పేసి ఇంట్లోకి వచ్చి రాజును చంపేశారు. అనంతరం వారు వచ్చిన బైక్ను విడిచి పెట్టి వేరే బైక్పై శవాన్ని తీసుకుని వెళ్లారు.
మెళియాపుట్టి(M) పట్టుపురానికి చెందిన కాంచనపై గుర్తుతెలియని మహిళ దాడి చేసి చోరీ చేసింది. గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పరుగుపరుగున వెళ్లగా గుర్కాతో ఓ మహిళ ఉండడం ఆమె గమనించారు. కాంచనను చూసిన సదరు మహిళ ఇనుప రాడ్డుతో దాడి చేసి విలువైన వస్తువులు దొంగిలించి పారిపోయింది. బాధితురాలు ఫిర్యాదుతో సీఐ రామారావు కేసు నమోదు చేశారు.
భూగర్భ జలాల పెంపు, కరవు నివారణకు సమర్థ నీటి నిర్వహణ కీలకమని CM నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం రాజధానిలోని సచివాలయం నుంచి సాగునీటి సంఘాలు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెలుగొండ, ఉత్తరాంధ్ర, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, వంశధార కమిటీ ఛైర్మన్ రవీంద్ర, జేసీ పాల్గొన్నారు.
మెళియాపుట్టి(M) పట్టుపురానికి చెందిన కాంచనపై గుర్తుతెలియని మహిళ దాడి చేసి చోరీ చేసింది. గురువారం సాయంత్రం స్థానికంగా ఉన్న సాయిబాబా గుడికి వెళ్లి ఇంటికి వచ్చారు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పరుగుపరుగున వెళ్లగా గుర్కాతో ఓ మహిళ ఉండడం ఆమె గమనించారు. కాంచనను చూసిన సదరు మహిళ ఇనుప రాడ్డుతో దాడి చేసి విలువైన వస్తువులు దొంగిలించి పారిపోయింది. బాధితురాలు ఫిర్యాదుతో సీఐ రామారావు కేసు నమోదు చేశారు.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో 14-17 వరకు జిల్లాలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగవచ్చని EPDCL ఎస్ఇ నాగిరెడ్డి కృష్ణమూర్తి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. విస్తారమైన వర్షాలు, ఈదురుగాలులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ హెచ్చరికలు ప్రభుత్వం జారీ చేసిందన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, స్తంభాలు పడిపోయిన, వైర్లు తెగిన సంబంధిత అధికారులకు తెలియజేయాలన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న పోలీస్ పరేడ్ను ఘనంగా నిర్వహించాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. గురువారం ట్రయల్ రన్లో భాగంగా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన పరేడ్ను పరిశీలించారు. శుక్రవారం జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్క పోలీస్ అధికారి తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లా యువత కోసం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పెద్ద మనసు చాటుకున్నారు. రైల్వే పరీక్షలు కోసం ప్రిపేర్ అయ్యే యువతీ, యువకులు కోసం ఎర్రన్న విద్యా సంకల్పం పేరుతో ఆగష్టు 17న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. https://www.yvssrikakulam.live/register ద్వారా రిజిస్ట్రేషన్ అవ్వాలని సూచించారు. ఎంపికైన విద్యార్థులకు 60 రోజులు ఉచిత కోర్స్ అందిస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.