Srikakulam

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్..!

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమ, మంగళవారాలలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడేటప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.

News April 6, 2026

SKLM: 11 మంది పిల్లలపై పిచ్చి కుక్క దాడి

image

పొందూరులో పిచ్చికుక్క రెండు రోజుల్లో వీరంగం సృష్టించింది. మండల కేంద్రంలోని నాయుడువీధి, గాంధీనగర్, మార్కెట్ లైన్, కనకాల వీధిలలో 15 ఏళ్ల లోపు 11 మంది పిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. బాధితులను శ్రీకాకుళం RIMSకు తరలించారు. మిగతా వారికి పొందూరు సామాజిక హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజులు కోరుతున్నారు.

News April 6, 2026

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు అలర్ట్.. పిడుగులతో కూడిన వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో సోమవారం, మంగళవార లలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. వర్షాలు పడినప్పుడు ప్రజలు బయట తిరగకూడదని సూచించారు.

News April 6, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News April 6, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News April 6, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News April 6, 2026

SKLM: నేడు ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక

image

శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 6న ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక నిర్వహించబడుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్జీదారులు వారి అర్జీలు నేరుగాపై కార్యక్రమంలో, ఆన్‌లైన్‌లో Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి తమ అర్జీల స్థాయిని తెలుసుకోవచ్చు అన్నారు.

News April 5, 2026

శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు తల్లీ, కుమార్తె మృతి

image

శ్రీకాకుళం జిల్లా మందసలోని పెద్ద కేసుపురంలో ఆదివారం పిడుగుపాటుకు తల్లి, కుమార్తె మృతి చెందారు. గ్రామానికి చెందిన కృష్ణవేణి(35), కుమార్తె చిన్ని(15) కలిసి జీడీ తోటలో పనులు చేస్తున్నారు. సాయంత్రం వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ క్రమంలో పెద్ద శబ్దంతో పిడుగు వారు పనిచేస్తున్న తోటలో అకస్మాత్తుగా పడగా అక్కడికక్కడే ఇద్దరూ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 5, 2026

మందస: తండ్రిని కొట్టి చంపిన కుమారుడు

image

మందస(మ) లొహరిబందలో ఆదివారం జరిగిన హత్య కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం..లొహరిబందిలో నివసిస్తున్న లక్ష్మీనారాయణను కుమారుడు ఏకాంబరం ఇంటిలో ఎవరూ లేని సమయంలో దారుణంగా దాడి చేసి హత్య చేశాడు. రక్తపుమడుగుల్లో ఉన్న లక్ష్మీనారాయణను చూసి కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మానసిక స్థితి సక్రమంగా లేక ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు అంటున్నారు. ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేశారు.

News April 5, 2026

శ్రీకాకుళం: శిక్షణతో ఉద్యోగం పొందండి.. 18-28 ఏళ్ల వారికే

image

శ్రీకాకుళం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణను ఇస్తామని విశాఖలోని నైపుణ్యాభివృద్ధి సంస్థ (SDI) సీఈవో విజయ్ కుమార్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. టెన్త్- బిటెక్ చదివి 18-28 ఏళ్ల మధ్య ఉన్న యువతకు ఉచిత భోజనం, వసతితో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. వెల్డింగ్, ఫిట్టర్, ఎలక్ట్రికల్ విభాగాల్లో విశాఖలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన వారు 79893 13189 కాల్ చేయాలని కోరారు