India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సొంత మేనమామ పదేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. కవిటి మండలంలోని రాజపురం పంచాయతీ తొత్తిపుట్టుగలో మార్చి11న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అప్యాయంగా చూడాలస్సిన మేనమామ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి తాళ్లతో కట్టి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నొప్పి భరించలేక బాలిక కేకలు పెట్టడంతో భయపడి పారిపోయాడు. ఈ ఘటనపై డీఎస్పీ వెంకట అప్పరావు కేసు నమోదు చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో శ్రీకాకుళం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వాహనదారులు, పాదచారులు చాలాచోట్ల మజ్జిగ, పండ్ల రసాలు తాగుతున్నారు. మరో రెండు నెలలు జిల్లాలో ఎండల తీవ్రంగా ఉంటే అవకాశం ఉండటంతో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నారుల, వృద్ధుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు.
ఎచ్చెర్ల మండలంలో భార్యను, భర్త దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. ఎచ్చెర్లలోని సంతసీతాపురానికి చెందిన నాగమ్మ(40), అప్పలరెడ్డి కూలిపనులు చేస్తూ జీవనం సాగించేవారు. భార్యపై అనుమానంతో సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటిలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కత్తితో తల, మెడలపై దాడి చేయగా ఆమె మృతి చెందింది. కుమారుడు త్రినాథ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని సీఐ అవతారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళా బలగ హాస్పిటల్ జంక్షన్లో ఉన్న పారిశ్రామిక శిక్షణ కేంద్రం (డీఎల్డీసీ-ఐటీ ఐ)లో ఈనెల 20 వ తేదీన జరగనుందని డీఎల్డీసీ అసిస్టెంట్ డైరెక్టర్ వై.రామ్మోహనరావు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఇతర అర్హత కలిగిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన పెండింగ్ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సదస్సులు, రీసర్వే ఫిర్యాదులు, ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ, ల్యాండ్ బ్యాంక్, కోర్టు కేసులు, వక్ఫ్ ఆస్తుల సర్వే వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటాయని మహిళా శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి. శాంతి శ్రీ మంగళవారం తెలిపారు. వేసవి దృష్ట్యా మార్చి నెల 18వ తేదీ నుంచి మే నెల 31వ తేదీ వరకు అంగన్వాడీ కేంద్రాలు సమయం మార్చినట్లు పేర్కొన్నారు. ప్రీ స్కూల్ పిల్లలకు వేడి ఆహారం ఇచ్చి పిల్లలను వారి వారి గృహాలకు పంపాలని ఆమె తెలిపారు.
కోటబొమ్మాళి రైల్వే స్టేషన్ సమీపంలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మగ వ్యక్తి మృతి చెందినట్లు పలాస జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ మంగళవారం తెలిపారు. మృతుడి వయసు 50 – 55 సంవత్సరాలు మధ్య ఉంటుందన్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. నగరంలోని జడ్పీ మందిరంలో 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న కంప్యూటర్ శిక్షణా కార్యక్రమాన్ని ఆయన సందర్శించారు. నూతనంగా వస్తున్న సాంకేతికతను అలవర్చుకొని నైపుణ్యాభివృద్థి చేసుకోవాలన్నారు.
2కి.మీ కంటే ఎక్కువ దూరం ఉన్న ఓటర్లకు దగ్గరిలో ఉన్న పోలింగ్ కేంద్రానికి షిఫ్టింగ్ / మెర్జ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ డివిజనల్ అధికారిణి సాయి ప్రత్యూష స్పష్టం చేశారు. మంగళవారం శ్రీకాకుళం తహశీల్దారు కార్యాలయంలో వివిధ పార్టీ నాయకులతో సమావేశం జరిగింది. ఓటర్లు జాబితా తయారీకి అన్ని రాజకీయ పార్టీల నుంచి సూచనలు అడిగి తెలుసుకున్నారు.
ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు IlT, JAM ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. ఈ మేరకు మంగళవారం విడుదలైన ఆల్ ఇండియా IIT JAM, MSc కెమిస్ట్రీ ప్రవేశ పరీక్షలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు బాకేశ్వరి 467, గుడియా జ్యోతి 786, బి.పూజిత 1333 ర్యాంకులు సాధించారు. ఈ సంధర్భంగా ప్రిన్సిపల్ డా.రబిన్ కుమార్ పాడి ద్వారా కెమిస్ట్రీ లెక్చరర్ శివకుమార్ విద్యార్థులకు రూ.12 వేల నగదు బహుమతి అందించారు.
Sorry, no posts matched your criteria.