Srikakulam

News September 11, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఉచిత ఇసుక నూతన విధానం

image

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి ఉచిత ఇసుక నూతన విధానం అమలులోకి రానుంది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఇసుకకు సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18005994599 కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఇసుక నిర్వహణకు సంబంధించిన అంశాలపై సంబంధిత సిబ్బందికి శిక్షణ అందించనున్నట్లు గన్ను శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా తెలిపారు.

News September 11, 2024

SKLM: రాష్ట్ర పండుగగా కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర

image

కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మతల్లి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ జాతర నిర్వహణ కోసం రూ.కోటి మంజూరు చేసింది. ఈ నిధులను అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం నుంచి సమకూర్చనున్నట్లు పేర్కొంది.

News September 10, 2024

రణస్థలం: వరద బాధితులకు రూ.80లక్షల చెక్కు అందజేత

image

విజయవాడ వరద బాధితుల కోసం మంగళవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఏపీ విలేజ్ సర్వేయర్లు అసోసియేషన్ తరుపున రూ.80లక్షల చెక్కును అందజేసినట్లు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బూరాడ మధు తెలిపారు.శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన మధు యూనియన్ నాయకులు అయ్యప్పలనాయుడు, కిరణ్‌తో కలిసి విజయవాడలో పవన్ కళ్యాణ్‌కు చెక్కును అందించారు. రాష్ట్రంలోని సర్వేయర్లు అందరూ ఒకరోజు వేతనాన్ని అందించినట్లు తెలిపారు.

News September 10, 2024

టెక్కలి: కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపు

image

కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి ఉత్సవాలకు రాష్ట్ర పండుగగా గుర్తింపునిస్తూ మంగళవారం రాష్ట్ర దేవాదాయశాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి నియోజకవర్గంలో కోటబొమ్మాళి ఉత్సవాల నిర్వహణకు రూ.1 కోటి రూపాయలు మంజూరు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అక్టోబర్‌లో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రస్థాయి గుర్తింపుపై పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

News September 10, 2024

నష్ట నివేదికను 11న అందజేయాలి: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షాల కారణంగా నష్టం వాటిల్లిన వివరాలను 11వ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవానం కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీ రాజ్, డీపీవో,ఆర్డబ్ల్యుఎస్, డ్వామా, గృహ నిర్మాణ శాఖ, వైద్య ఆరోగ్య శాఖల అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలకు డేమేజ్ జరిగితే తక్షణమే మరమ్మతు పనులు చేయాలన్నారు.

News September 10, 2024

SKLM: అడ్మిషన్లకు ఈనెల 19లోగా దరఖాస్తు చేసుకోండి

image

దేశవ్యాప్తంగా ఉన్న మిలిటరీ స్కూల్ లలో 6,9 తరగతుల్లో చేరేందుకు ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి శైలజ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. అప్లై చేసిన వారికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.

News September 10, 2024

SKLM: 15 మంది ఎస్సైలకు బదిలీ

image

శ్రీకాకుళం జిల్లాలో 15 మంది ఎస్.ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ మహేశ్వరరెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో భాగంగా విశాఖ రేంజ్ పరిధిలో 9 మంది సీఐలకు బదిలీలు కాగా, అందులో ఇద్దరిని శ్రీకాకుళం జిల్లాకు కేటాయించారు. ప్రస్తుతం విశాఖపట్నం వీఆర్‌లో ఉన్న వి.నాగరాజును శ్రీకాకుళం ట్రాఫిక్ పోలీసుస్టేషన్, జి.ఆర్.కె. తులసీదాసు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు.

News September 10, 2024

SKLM: విపత్తు నిర్వహణ బృందంలో చేరుటకు ఆహ్వానం

image

రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా విపత్తు నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తోందని సేవ చేయాలనుకునే వారు చేరవచ్చని జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. పేర్లు నమోదు చేసు కున్న వారికి శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారు విపత్తుల సమయంలో సేవ చేయాల్సి ఉంటుందని చెప్పారు. వివరాలకు 99486 33398, 90102 73741, 99633 99455 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News September 10, 2024

శ్రీకాకుళం: వర్షాలు తగ్గినా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

వర్షాలు తగ్గుముఖం పట్టినా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టర్ కార్యాలయం నుంచి ఆయన జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఆర్డీఓలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ ఒడిశాలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో జిల్లాలోని నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా చేయాలన్నారు.

News September 9, 2024

నిమజ్జన ప్రదేశాల్లో భద్రత నియమాలు పాటించాలి: ఎస్పీ

image

శ్రీకాకుళంలో పొన్నాడ వంతెన ఇరువైపులా వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం ఎస్పీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులతో సందర్శించారు. భద్రతపరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, ఏడు రోడ్ల-గుజారతిపేట వంతెన, డే&నైట్ వంతెన ఇరువైపులా నిమజ్జనం చేసే ప్రదేశాలలో తగు జాగ్రత్తలు చేపట్టాలన్నారు.