Srikakulam

News January 3, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్
సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికీ చేరాలి: ఎమ్మెల్యే శిరీష
నరసన్నపేట: రహదారులపై పారుతున్న మురుగు నీరు
జలుమూరు: ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు
ప్రపంచ తెలుగు మహాసభలకు పొందూరు వాసికి ఆహ్వానం
టెక్కలి: ధాన్యం కొనుగోళ్లులో కానరాని కస్టోడియన్లు జాడ
ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించండి: ఎమ్మెల్యే బగ్గు
జిల్లాలో పలుచోట్ల రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ

News January 2, 2026

సిక్కోలు వాసులకు గుడ్ న్యూస్

image

శ్రీకాకుళం జిల్లా ప్రజలకు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుక్రవారం గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లా మీదుగా నడిచే రెండు ప్రధాన రైళ్లను జిల్లాలోని తిలారు, బారువ, ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్ లో ఆగనున్నట్లు తెలిపారు. తిలారులో బరంపురం-విశాఖ ఎక్స్ ప్రెస్(18525/18526), బారువలో విశాఖపట్నం న్యూ విశాఖ ఎక్స్ ప్రెస్(22819/22820), ఇచ్ఛాపురంలో పూరీ-అహ్మదాబాద్(12843/12844) రైళ్లు ఆగనున్నట్లు తెలిపారు.

News January 2, 2026

రణస్థలం: ‘108 నిర్లక్ష్యం లేదు’

image

రణస్థలం సూర్య స్కూల్ పరిధిలో డిసెంబర్ 31న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించడం తెలిసిందే. 108 రావడం ఆలస్యం కావడంతోనే ఆ వ్యక్తి మరణించాడని స్థానికులు కొందరు తెలపడంతో Way2Newsలో అలాగే ప్రచురితమైంది. కానీ సాంకేతిక సమస్య కారణంగా 108కు కాల్ రీచ్ కాలేదు. కాసేపటికే కాల్ కనెక్ట్ కావడంతో వెంటనే ప్రమాద స్థలికి అంబులెన్స్ వెళ్ళింది. ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం లేదని అధికారులు తెలిపారు.

News January 2, 2026

నిమిషంలోనే అంబులెన్స్ బయల్దేరింది: శ్రీకాకుళం DMHO

image

రణస్థలం మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాద సమయంలో 108 అంబులెన్స్ సేవలో సాంకేతిక సమస్య తప్ప మరే జాప్యం జరగలేదని DMHO డా.అనిత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అంబులెన్స్ రాకలో ఎటువంటి నిర్లక్ష్యం లేదని సాంకేతిక సమస్య వలన సమాచారం చేరడం జాప్యం జరిగిందని ఆమె వెల్లడించారు. 8.08 గంటలకు సమాచారం అందిన వెంటనే 8.09 నిమిషాలకు అంబులెన్స్ బయలుదేరి 2 కి.మీ దూరంలో ఉన్న ప్రమాద స్థలానికి 5 నిమిషాల్లోనే చేరిందన్నారు.

News January 2, 2026

SKLM: న్యూ ఇయర్ కిక్..రూ. 3.75 కోట్ల మద్యం తాగేశారు

image

శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏడాది చివరి రోజు డిసెంబర్ 31న ఉదయం-రాత్రి వరకు మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లు ఉన్నాయని ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయాన్నారు.

News January 2, 2026

శ్రీకాకుళం: న్యూ ఇయర్ వేడుకలు.. 36 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు

image

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా బుధవారం అర్ధరాత్రి వరకు విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సోదాల్లో 36 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని, 15 మందిపై బహిరంగ మద్యం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేర నియంత్రణ లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు.

News January 2, 2026

SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.

News January 2, 2026

SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.

News January 2, 2026

SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.

News January 2, 2026

SKLM: జూన్ 2 నుంచి రీ సర్వే గ్రామాల్లో పాస్ పుస్తకాలు పంపిణీ

image

జిల్లాలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీకి రంగం సిద్ధమైందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 2 నుంచి రెవెన్యూ గ్రామసభలు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమంలో కోటబొమ్మాళి మండలం అక్కయ్యవలసలో మంత్రి అచ్చెన్న వీటిని పంపిణీ చేయనున్నారు. 652 గ్రామాల్లో 2,54,218 బుక్స్ పంపిణీకి సిద్ధం చేశామన్నారు.