Srikakulam

News September 6, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

➠ మట్టి వినాయకుడిని పూజిద్దాం: రామ్మోహన్
➠ రేగిడి మండలంలో కాలువలో పడి వ్యక్తి మృతి
➠ గారలో చాక్లెట్లతో భారీ విఘ్నేశ్వరుడు
➠ రాజమండ్రిలో జిల్లా వాసి మృతి
➠ ఇచ్చాపురంలో బాడీ లోషన్ తాగి వివాహిత ఆత్మహత్య
➠ రాజాంలో అందుబాటులో తిరుమల లడ్డు
➠ కోటబొమ్మాలిలో 20 ఏళ్ల అరుదైన గుడ్లగూబ మృతి

News September 6, 2024

ఇక నుంచి రాజాంలో అందుబాటులో తిరుమల లడ్డూ

image

తిరుపతి లడ్డూ ప్రసాదం మారుమూల గ్రామాలకు కూడా అందించాలనే దృక్పథంతో, లడ్డూను రాజాంలోని టీటీడీ దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న అంతకాపల్లి బాలాజీ టెంపుల్‌లో విక్రయించేందుకు టీటీడీ ఈవో శ్యామలరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు వైజాగ్ రుషికొండ ఏఈవో జగన్మోహనాచార్యులు నెలలో రెండు పర్యాయాలు విక్రయించేందుకు.. రేపు వినాయక చవితి సందర్భంగా ఉదయం 10గం. తిరుపతిలో విక్రయించే ధరకే కౌంటర్ ప్రారంభిస్తామని తెలిపారు.

News September 6, 2024

భోగాపురం పనులు వేగవంతం: కేంద్రమంత్రి

image

ఉత్తరాంధ్రకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శుక్రవారం కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. విమానాశ్రయ టర్మినల్ భవనం, అప్రోచ్ రహదారుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష చేశారు. ప్రపంచంలో అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని, 2026 జూలై కల్లా విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి తెలిపారు.

News September 6, 2024

భోగాపురం పనులు వేగవంతం: కేంద్రమంత్రి

image

ఉత్తరాంధ్రకు ఎంతో ముఖ్యమైన భోగాపురం విమానాశ్రయం నిర్మాణ పనులను శుక్రవారం కేంద్రమంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
విమానాశ్రయ టర్మినల్ భవనం, అప్రోచ్ రహదారుల పురోగతిపై విమానాశ్రయ అధికారులతో పూర్తిస్థాయి సమీక్ష చేశారు.
ప్రపంచంలో అత్యున్నత విమానాశ్రయాలలో ఒకటిగా భోగాపురం విమానాశ్రయం నిలుస్తుందని, 2026 జూలై కల్లా విమాన సేవలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొనివస్తామని మంత్రి తెలిపారు.

News September 6, 2024

శ్రీకాకుళం: కాలువలో పడి యువకుడి మృతి

image

రేగిడి మండలంలో విషాదం చోటుచేసుకుంది. అంబాడ సమీపంలో బహిర్భూమికి వెళ్లిన ఓ యువకుడు మడ్డవలస ప్రధాన కాలువలో పడి మృతి చెందాడు. ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో వెంకటేశ్వరరావు(21) మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వెంకటేశ్వరరావు గతంలో వాలంటీర్‌గా చేసి, ఇటీవలే వైజాగ్‌లోని ఓ కంపెనీలో జాబ్‌లో చేరాడు. తండ్రి సింహాచలం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాజాంలో పోస్టుమార్టం నిర్వహించారు.

News September 6, 2024

SKLM: 20 ఏళ్ల అరుదైన గుడ్లగూబ మృతి

image

కోటబొమ్మాళి మండలంలోని కురుడు పంచాయతీ చౌదరికొత్తూరు గ్రామంలో విద్యుత్ లైన్ వైర్లకు తగిలి శుక్రవారం ఓ అరుదైన గుడ్లగూబ మృతి చెందింది. ఈ గుడ్లగూబకు 20 ఏళ్లు ఉండొచ్చని, కొన్ని ఏళ్లుగా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉండేదని తెలిపారు. సుమారు 5 కేజీల బరువు ఉంటుందని, రాత్రి పెద్ద పెద్ద శబ్దాలతో అరుస్తూ ఉండేదని గ్రామస్థులు తెలిపారు. ప్రస్తుతం ఇలాంటి పక్షులు అంతరించిపోయాయని, అరుదుగా కనిపిస్తున్నాయని పెద్దలు తెలిపారు.

News September 6, 2024

శ్రీకాకుళం: బాడీలోషన్ తాగి వివాహిత సూసైడ్

image

మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇచ్చాపురంలోని ధర్మపురం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగాల సుజాత(25) భర్త నూకయ్యతో 3 రోజుల కింద గొడవ పడింది. కోపంలో విదేశాల నుంచి తెచ్చిన బాడీ లోషన్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి భర్త విదేశాలలో వలస కూలీగా పని చేస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 6, 2024

రాజమండ్రిలో యాక్సిడెంట్.. శ్రీకాకుళం వాసి మృతి

image

రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్(20) మృతి చెందారు. రాజమండ్రి దివాన్ చెరువు వైపుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండీయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 6, 2024

కాశీబుగ్గలో ఉపాధ్యాయునికి కుచ్చు టోపీ

image

కాశీబుగ్గలో ఉపాధ్యాయుడు సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని పోలీసులను ఆశ్రయించారు. ఆయన కుమారుడు భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్ చదువుతున్నారు. ‘గురువారం ఉదయం నాకు ఫోన్ చేసి, నా కుమారుడు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డారని చెప్పారు. తాము పోలీసులమని పనిచేస్తున్నామని డబ్బిస్తే కేసు నుంచి తప్పిస్తామన్నారు. రూ.1.90 లక్షలు పంపించాను. ఇంకా రూ.50 వేలు పంపమన్నారు. అనుమానంతో ఆ నంబరకు ఫోన్ చేయగా అసలు విషయం బయటపడింది’.

News September 6, 2024

ఎచ్చెర్ల ఎంపీడీవోకు సంజాయిషీ నోటీసుల జారీ

image

ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ మండల ఎంపీడీవో రమాదేవికి జిల్లా పరిషత్ సీఈవో డి.వెంకటేశ్వరరావు గురువారం సంజాయిషీ నోటీసు జారీ చేశారు. ఇబ్రహీంబాద్ గ్రామంలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొంటారని తెలిసినా ఆమె హాజరు కాలేదు. ప్రొటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యహరించారని నోటీసులు ఇచ్చారు.