Srikakulam

News August 9, 2025

శ్రీకాకుళం: అంగట్లో ఉన్నా.. ఆన్లైన్ వైపే మొగ్గు!

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా చాలా ఏళ్ళుగా సాంప్రదాయ పద్ధతిలో దుకాణాలు, సమీపంలో ఏర్పాటు చేసిన అంగట్లో రాఖీలు, మిఠాయిలు కొనడం ఆనవాయితీ. అయితే మారుతున్న కాలం, సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల వినియోగదారులు ఆన్లైన్ వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో స్థానికంగా రాఖీల కొనుగోళ్లు మందగించాయి. చాలా చోట్ల దుకణాలు వెలవెలబోతూ కనిపించాయి. పెట్టుబడులు కూడా రావడం కష్టమేనని చిరు వ్యాపారులు దిగులు చెందుతున్నారు.

News August 9, 2025

సరుబుజ్జిలి: వ్యక్తిపై కత్తితో దాడి

image

సరుబుజ్జిలిలోని నందికొండ కాలనీకి చెందిన పల్లి వీరవెంకట దుర్గాప్రసాద్‌పై బప్పడాం గ్రామానికి చెందిన పేడాడ శ్రీధర్ కత్తితో దాడి చేసినట్లు సరుబుజ్జిలి ఎస్సై హైమావతి తెలిపారు. స్నేహితులైన వీరిద్దరూ సెల్ ఫోన్ విషయంలో గొడవపడ్డారన్నారు. గురువారం రాత్రి ప్రసాద్‌ను బప్పడాం తీసుకెళ్లి దాడి చేయడం వలన శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఫిర్యాదు మేరకు శుక్రవారం శ్రీధర్‌పై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News August 9, 2025

ఉద్దానం ప్రాంత వాసుల కల ఈసారైనా నెరవేరేనా?

image

కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉద్దానం ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. టెక్కలి, పాతపట్నం, ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట తదితర ప్రాంతాలకు పలాస దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి ప్రస్తుత జిల్లా కేంద్రానికి చేరుకోవాలంటే 100 కి.మీల దూరం ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News August 9, 2025

జలుమూరు: ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ వేసిన రాజశేఖర్

image

జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ సమక్షంలో నామినేషన్ వేశానని శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా( 2019, 2024) సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయడం జరిగిందన్నారు. 2022లో రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.

News August 8, 2025

జలుమూరు: ఉప రాష్ట్రపతికి నామినేషన్ వేసిన రాజశేఖర్

image

జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ సమక్షంలో నామినేషన్ వేశానని శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా( 2019, 2024) సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయడం జరిగిందన్నారు. 2022లో రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.

News August 8, 2025

బంగారు కుటుంబాలకు అండగా ఉంటాం: వైద్యులు

image

జిల్లాలోని బంగారు కుటుంబాలకు వైద్యులు అండగా నిలుస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌‌ను శుక్రవారం వివిధ రంగాలకు చెందిన 85 మంది శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కలిశారు. అధికారులు గుర్తించిన 2,580 కుటుంబాలకు అండగా నిలుస్తామని కలెక్టర్‌కు మాటిచ్చారు. రిమ్స్ డీసిహెచ్ఎస్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు, పలువురు వైద్యులు ఉన్నారు.

News August 8, 2025

శ్రీకాకుళం: 11న పాత ఎలక్ట్రానిక్ పరికరాల వేలం పాట

image

శ్రీకాకుళం మండలం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామాగ్రిని వేలం వేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలంపాట ఉంటుందని శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు స్టోర్ ఇన్‌ఛార్జ్ 9063477888, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 6309990841 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.

News August 8, 2025

సోంపేట: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

సోంపేట మండలం బెంకిలి గ్రామానికి చెందిన పూనే సీతమ్మ (65) మృతదేహం సాదు మెట్ట వద్ద ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం సోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారాణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోవరాజు తెలిపారు.

News August 8, 2025

శ్రీకాకుళం ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై వీడిన చిక్కుముడి

image

శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా జోత్స్న నియామకంపై చిక్కుముడి వీడింది. ఏఎంసీ ఛైర్మన్‌గా జోత్స్న ఎంపిక తర్వాత జనసేన, టీడీపీ పార్టీలో అసంతృప్తి రేగింన విషమం తెలిసిందే. ఆమెను వ్యతిరేకిస్తూ కొంతమంది బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సంప్రదింపులు తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జోత్స్ననే ఛైర్మన్‌గా కొనసాగుతుందని కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

News August 8, 2025

పోలీస్ శిక్షణ కేంద్రాన్ని సిద్ధం చేయండి: శ్రీకాకుళం ఎస్పీ

image

జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రాన్ని త్వరలోనే సిద్ధం చేయాలని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం శ్రీకాకుళం రూరల్ మండలం తండేం వలసలో ఉన్న శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ టీపీఎస్‌కు సంబంధించి శిక్షణ త్వరలో ప్రారంభించడం జరుగుతుందని వివరించారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా మౌలిక పరిస్థితులు కల్పిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు.