Srikakulam

News September 6, 2024

శ్రీకాకుళం: అమృత్ భారత్ స్టేషన్ల పనులు పురోగతిపై కేంద్ర మంత్రి ఆరా

image

అమృత భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్, పలాస, నౌపాడ, ఇచ్చాపురం స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌర ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.

News September 5, 2024

కళింగ టెంపుల్‌ సర్క్యూట్ ‘టూరిజం ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

జిల్లాలోని పర్యాటక కేంద్రాలు, ప్రముఖ ఆలయాలను కలుపుతూ కళింగ టెంపుల్‌ సర్క్యూట్ టూరిజంను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశించారు. అందుకు తగ్గ ప్రతిపాదనలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని పర్యాటక ప్రాజెక్టుల ప్రగతిపై సంబంధిత శాఖలతో కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. కళింగ టెంపుల్ సర్క్యూట్ టూరిజం ప్రసాదం పథకంకు ఎంపిక అయ్యేలా కేంద్ర మంత్రి సహకారం తీసుకుందామన్నారు.

News September 5, 2024

SKLM: వినాయక చవితి ఉత్సవాలకు 1302 దరఖాస్తులు

image

జిల్లాలో గణపతి నవరాత్రుల ఉత్సవాలకు సింగిల్‌ విండో ద్వారా అనుమతుల కోసం ఇప్పటి వరకూ 1302 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం జరిగిన వినాయక చవితి ఉత్సవాల అనుమతులు, ముందస్తు చర్యలు, నిమజ్జనం ఏర్పాట్లపై పలాస, టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.

News September 5, 2024

సంతబొమ్మాళి: 104 వాహనంలో నాగుపాము హల్ చల్

image

సంతబొమ్మాలి మండలం మేఘవరం సమీపంలో బంజీరు తోట వద్ద గురువారం 104 వాహనం ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అయితే 104 వాహనంలో నాగుపాము ఒక్కసారిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అది కాస్త ఇంజిన్ లోకి వెళ్లి ఇరుక్కుపోవడంతో దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తూ..శిబిరాన్ని నిలిపివేసినట్లు సిబ్బంది తెలిపారు.

News September 5, 2024

శ్రీకాకుళం: నేడే ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

image

ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్‌ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక మార్గదర్శకుడిలా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 78 మంది ఉపాధ్యాయులను ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.

News September 5, 2024

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి సరఫరాపై నిఘా

image

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మధ్య ఇచ్ఛాపురం, టెక్కలిలో 196 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరకు రాకుండా ప్రత్యేక బృందాన్ని నియమించి దాడులు నిర్వహించేందుకు సిద్దమయ్యామని తెలిపారు. అయితే నగరానికి చెందిన 9మందిని అందుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

News September 5, 2024

శ్రీకాకుళంలో ముంపునకు గురయ్యే ప్రాంతాలివే

image

నాగావళి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహానికొస్తే సిక్కోలులో బెజవాడ తరహా ముంపు రానుంది. కృష్ణా పార్కు, రైతు బజారు, డీసీసీబీ, బాకర్ సాహెబ్ పేట, నీలమ్మ, చౌదరి సత్యనారాయణ, నాయుడు చెరువు గట్టు, విశాఖ ఏ,బీ,ఫ్రెండ్స్, వంశధార,వరం,మహాలక్ష్మినగర్ కాలనీలు, ఆర్టీసీ కాంప్లెక్స్, పొట్టి శ్రీరాములు, అరసవల్లి మిల్లు, డే అండ్ నైట్ కూడలిలు, చిన్నబరటాం, మండల,రెల్ల, సానా,గూనపాలెం వీధులు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయి.

News September 5, 2024

శ్రీకాకుళం: నేడు కేంద్ర మంత్రి రామ్మోహ‌న్ నాయుడు జిల్లాకు రాక

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉదయం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.

News September 5, 2024

హీరోగా టెక్కలి చిన్నోడు

image

ఓ టెక్కలి కుర్రాడు హీరోగా మారాడు. అతని సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఆ హీరో కోళ్ల గణేశ్(చిన్నా). ఆ సినిమా స్పీడ్ 220. టెక్కలికి చెందిన గణేశ్ గత కొద్ది రోజులుగా చిత్రసీమలో రాణించడానికి ప్రయత్నించాడు. చివరకు హీరోగా మారాడు. ఇదే సినిమాలో గణేశ్‌తో పాటు హేమంత్ రెడ్డి మరో హీరోగా నటించారు. స్నేహం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో సినిమా తీశామని.. అందరూ ఆదరించాలని గణేశ్ కోరాడు.

News September 4, 2024

శ్రీకాకుళం: 78 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక

image

జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 78 మంది ఎంపికయ్యారని డీఈఓ తిరుమల చైతన్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎం క్యాటగిరిలో 9 మంది, ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్) కేటగిరిలో 32 మంది, ఎస్జీటీ కేటగిరిలో 27 మంది, పిఈటి/పిడి కేటగిరీలో 8 మంది, కేజీబీవీ కేటగిరిలో ఇద్దరు ఎంపికయ్యారని తెలిపారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.