Srikakulam

News March 18, 2025

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు

image

టెక్కలిలో ఆకతాయిల అల్లరి చేష్టలు గోడలపై దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం పదో తరగతి రెగ్యులర్, ఓపెన్ స్కూల్ పరీక్షలు జరుగుతున్న క్రమంలో టెక్కలిలోని ఒక పరీక్షా కేంద్రం వద్ద “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అని రాయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఆకతాయిల పనే అని పలువురు అంటున్నారు. దీనిపై పలువురు ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

News March 18, 2025

కోటబొమ్మాళి: బంధువులకు విద్యార్థి అప్పగింత

image

కోటబొమ్మాళి మండలంలోని జగనన్న కాలనీకి చెందిన 10వ తరగతి విద్యార్థి ఆదివారం పరారైన విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం విశాఖ రైల్వే స్టేషన్‌లో బాలుడి ఆచూకీ దొరికింది. వాట్సాప్ పోస్టుల ద్వారా ఓ వ్యాపారి బంధువులకు విషయాన్ని తెలియజేశాడు. అనంతరం విద్యార్థి పిన్ని వచ్చి తీసుకువెళ్లాలని ఆయన చెప్పారు.

News March 18, 2025

ఎచ్చెర్లలో దారుణ హత్య

image

ఎచ్చెర్ల మండలం సంతసీతారామపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్య నాగమ్మ (40) ను భర్త అప్పలనాయుడు కత్తితో నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. హత్యకు కుటుంబంలో గొడవలే కారణమని సమాచారం.

News March 18, 2025

SKLM: ప్రభుత్వ ఉద్యోగులకు కంప్యూటర్ శిక్షణ

image

ప్రభుత్వ శాఖల నుంచి ఇద్దరు లేదా ముగ్గురుకి మార్చి 18 నుంచి 22 వరకు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జడ్పీ మందిరంలో ఆయన మాట్లాడుతూ.. అన్ని శాఖల నుంచి ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసి సత్వరమే అందజేయాలన్నారు. కంప్యూటర్ శిక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్, ఎక్సెల్ షీట్స్, అడ్వాన్స్ టూల్స్‌పై శిక్షణ ఇస్తామన్నారు.

News March 17, 2025

REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

image

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది. 

News March 17, 2025

కోటబొమ్మాళి : టెన్త్ పరీక్షలకు భయపడి విద్యార్థి పరార్

image

కోటబొమ్మాలి మండలంలోని జగనన్న కాలనీలో నివాసముంటున్న విద్యార్థి 10వ తరగతి పరీక్షలకు భయపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పరీక్షలకు చదవమని ఇంట్లో మందలించారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం నుంచి అతను కనిపించలేదు. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో కోటబొమ్మాళి పీఎస్‌లో పేరెంట్స్ ఫిర్యాదు చేశామన్నారు. 

News March 17, 2025

జలుమూరు : ఖైదీలకు ఫోన్‌లు అందించిన దంపతులు అరెస్ట్

image

శ్రీకాకుళం జిల్లా జలుమూరు పీఎస్ విధులు నిర్వహిస్తున్న భార్యాభర్తలను అరిలోవ పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో ఈ కారాగారంలో పని చేసిన ఫార్మాసిస్టు శ్రీనివాసరావుతో పాటు అతడి భార్య పుష్పలతను ఆదివారం అరెస్ట్ చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు. జైలులో ఉన్న నాగమల్లేశ్వరావు అనే ముద్దాయికి ఫోన్లు అందించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.

News March 17, 2025

హరిపురంలో బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య

image

మందస మండలం హరిపురం రైల్వే స్టేషన్ సమీపాన బీహార్‌కు చెందిన బ్యాటరీ వర్కర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన సోనూ కుమార్ సాహు (28) ఆదివారం మనస్తాపంతో గురై తన గదిలో గల దూలానికి నైలాన్ తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికులు సమాచారాన్ని మందస పోలీసులకు అందించారు. మందస ఎస్‌ఐ కె.కృష్ణ ప్రసాద్ వివరాలు సేకరిస్తున్నారు.

News March 16, 2025

శ్రీకాకుళం: గ్రీవెన్స్ సెల్ సమయం మార్పు

image

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ సెల్ సమయాన్ని మార్చారు. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 10 గంటలకే గ్రీవెన్స్ సెల్ ప్రారంభమవుతుందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ప్రజలు సద్వినియోగం చేసుకొని తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన కోరారు.

News March 16, 2025

సారవకోట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

image

సారవకోట మండలం కురిడింగి గ్రామం వద్ద పాతపట్నం నర్సంపేట హైవే రోడ్డుపై లారీ కారు పరస్పరం ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరి మృతి చెందారు. ఆదివారం పాతపట్నం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న లారీ, నరసన్నపేట నుంచి పాతపట్నం వైపు వస్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలో చనిపోయారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.