India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు జరిగే వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన ఈ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా ఉన్నతాధికారులు, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వైసీపీ శ్రీకాకుళం జిల్లా యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ను నియమిస్తూ వైసీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు వర్కింగ్ ప్రెసిడెంట్గా విధులు నిర్వహిస్తారన్నారు. దీంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.
మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి పునరావాస అంశాలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు. టెక్కలి ఆర్డీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పునరావాస గ్రామాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, విద్యుత్, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.
మూలపేట పోర్టు నిర్మాణానికి సంబంధించి పునరావాస అంశాలపై బుధవారం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ సమీక్ష నిర్వహించారు. టెక్కలి ఆర్డీవోతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. పునరావాస గ్రామాల నిర్మాణం, స్థలాల కేటాయింపు, విద్యుత్, తాగునీటి సరఫరా, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలపై సమగ్రంగా చర్చించారు.
భావనపాడు సముద్రతీరంలో మంగళవారం ముగ్గురు విద్యార్థులు గల్లంతైన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరి మృతదేహాలు భావనపాడు సముద్ర తీరానికి మంగళవారం అర్దరాత్రికి కొట్టుకొచ్చాయి. స్థానికులు, మెరైన్ పోలీసులు, మత్స్యకారులు డెడ్ బాడీలను గుర్తించారు. మరో విద్యార్థి ధుర్యోదన ఆచూకి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎమ్మెస్సీ మెడికల్ బయో టెక్నాలజీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీరాములు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జువాలజీ, మైక్రోబయోలాజీ, బయోటెక్నాలజీ తదితర కోర్సుల్లో చేరేందుకు డిగ్రీతో పాటు ఏపీ పీజీ సెట్-2025 అర్హులు అన్నారు. పూర్తి వివరాలకు కళాశాలను సంప్రదించాలన్నారు.
టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్లో జరగనున్న దులీప్ ట్రోఫీకి శ్రీకాకుళం జిల్లా నుంచి విజయ్ను ఎంపిక చేశారు. రంజీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజయ్ ను సెలెక్ట్ చేశారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన విషయ తెలిసిందే. తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో స్థానం దక్కించుకున్నాడు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పింఛన్లు, అన్నకాంటీన్లు, మున్సిపల్ సేవలు, మహిళలపై నేరాలు, డ్రగ్స్ అరికట్టే విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.
రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 10% మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న 20% మందిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళగిరి సచివాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. పి4 సర్వేకు మార్గదర్శకాలు సిద్ధం చేశామని ఈనెల 15లోగా పూర్తి చేసి 19వ తేదీ కల్లా సిద్ధంగా ఉండాలన్నారు.
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అధికారులు కోరారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవలో కాంట్రాక్టు ప్రాతిపదికన 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు డిగ్రీ, ఆపైన విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Sorry, no posts matched your criteria.