India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అధికారులు కోరారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవలో కాంట్రాక్టు ప్రాతిపదికన 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు డిగ్రీ, ఆపైన విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా చల్లా కళ్యాణినిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందినవారు. 2023 బ్యాచ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. గతంలో కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ మదనపల్లికి బదిలీ అయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో సోమవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా 75 వసంతాలు వేడుకల సందర్భంగా సిక్కోలు జిల్లా చరిత్ర, అభివృద్ధి, నాగరికత, పల్లె సాంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు ఇతర ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసేలా వీడియో రూపొందించాలని కలెక్టర్ సూచించారు. వీరితో పాటు DRO వెంకటేశ్వరరావు ఉన్నారు.
నరసన్నపేట: అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసిన అంగన్వాడీ సిబ్బంది
SKLM: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 48 వినతులు
ఆముదాలవలస: 1.66 లక్షల ఆర్థిక సహాయం అందజేత
తాగునీటి సమస్యను పరిష్కరించండి: పాతపట్నం ఎమ్మెల్యే
శ్రీకాకుళం: జూనియర్ కళాశాలల వంట బకాయిలు చెల్లించాలి
ఎరువుల సమస్యలపై ఫిర్యాదు చేయండి: కలెక్టర్.
ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 140 అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.
ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఎన్ని మార్కులొచ్చాయి? కటాఫ్ ఎంత ఉండొచ్చనే చర్చ అభ్యర్థుల్లో నడుస్తోంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మన జిల్లాలో కటాఫ్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
✯ మెళియాపుట్టి: విద్యుత్ షాక్ తో 5వ తరగతి విద్యార్థి మృతి
✯మందసలో అధికారులను అడ్డుకున్న రైతులు
✯ విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే రవికుమార్
✯ సారవకోట: లారీని ఢీకొన్న ఆటో.. ఐదుగురికి తీవ్ర గాయాలు
✯ కళింగపట్నంలో పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
✯ పలాస: గంజాయితో ముగ్గురు అరెస్ట్
✯ కంచిలి: అధ్వానంగా ఆసుపత్రి పరిసరాలు
✯ టెక్కలి: శాకాంబరీదేవిగా శివదుర్గ అమ్మవారు
మెళియాపుట్టి మండలం గొప్పిలిలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 5వ తరగతి విద్యార్థి మహేష్ (9) తన ఇంటి మేడపై మొక్కను నాటేందుకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి షాక్కు గురై తీవ్ర గాయాలపాలయ్యాడు. విగతజీవిగా పడిన ఉన్న బాలుడుని కుటుంబీకులు ఆస్పుత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు చెప్పారు.
Sorry, no posts matched your criteria.