India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మంగళవారం జాబ్ మేళా జరిగింది. 14 కంపెనీలు హాజరుకాగా జిల్లా నలుమూలల నుంచి 741 మంది ఇంటర్వ్యూలకు వచ్చారు. పలు కేటగిరీల్లో 245 మందికి ఎంపిక కాగా నియామక పత్రాలను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి హయాంలో యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. జిల్లా ఉపాధికల్పనాధికారి సుధ ఉన్నారు.

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఏప్రిల్ 20 నుంచి 28 వరకు గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడును సిరిమానోత్సవాలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ఏప్రిల్ 20 నుంచి 28 వరకు గ్రామదేవత అసిరితల్లి సిరిమానోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ గ్రామ పెద్దలు, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు మంత్రి అచ్చెన్నాయుడును సిరిమానోత్సవాలకు ఆహ్వానించారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను నిమ్మాడ క్యాంప్ కార్యాలయంలో మంత్రి మంగళవారం ఆవిష్కరించారు.

టెక్కలి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉన్న సబ్ కలెక్టర్ ఫిల్లింగ్ స్టేషన్లో మేనేజర్-(2), పంపు ఆపరేటర్-(6) ఔట్ సోర్సింగ్ పోస్టులకు సంబంధించిన ఉద్యోగాల దరఖాస్తుకు నేడే చివరి రోజు అని టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ విద్యార్హత, పోలీస్ నో అబ్జెక్షన్, అనుభవ ధ్రువీకరణ పత్రాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం 11 గం.లకు ఇంటర్వ్యూలో పాల్గొనాలన్నారు.

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు గ్రూప్ ఫోర్, క్లాస్ ఫోర్ నియామకాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగ శాఖ ఇన్ఛార్జ్ పీడీ బొడ్డేపల్లి శైలజ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తు నమూనా, కాళీ పోస్టుల వివరాల కోసం www.srikakulam.ap.gov.in వెబ్సైట్ను సంప్రదించాలన్నారు. ఏప్రిల్ 14 లోపు నేరుగా, రిజిస్టర్ పోస్టు, కొరియర్లో దివ్యాంగ శాఖకు దరఖాస్తులు అందజేయాలన్నారు.

వేసవి నేపథ్యంలో పశువులకు తాగునీరు అందించే నీటి తొట్టెలను వినియోగించాలని శ్రీకాకుళం పశు సంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ కె.రాజగోపాల్ రావు సూచించారు. తన కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. గతేడాది ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో జిల్లాలోని 30 మండలాల్లో 894 నీటి తొట్టెలను నిర్మించినట్లు చెప్పారు. వీటిని ఉదయాన్నే నీటితో నింపితే పశువులకు దాహార్తి సమస్య ఉండదన్నారు.

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.

శ్రీకాకుళం జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. పాతపట్నం మండలం బూరగాంలోని ఓ వీధి పెరట్లో సోమవారం సాయంత్రం పసికందు ఏడుపులు వినిపించాయి. స్థానికులు అక్కడికి వెళ్లి చూడగా సమీపంలో ఎవరూ లేరు. ఏ తల్లో మగబిడ్డను పడేసి వెళ్లినట్లు గుర్తించారు. అదే గ్రామానికి చెందిన ఓ మహిళకు పిల్లలు లేకపోవడంతో పసికందును చూసుకుంటానని చెప్పడంతో స్థానికులు ఆమెకు అప్పగించారు.
Sorry, no posts matched your criteria.