Srikakulam

News September 1, 2024

భారీ వర్షాలు.. శ్రీకాకుళం జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్: 08942240557

News September 1, 2024

శ్రీకాకుళం: తీరం దాటిన వాయుగుండం 

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఒడిశా కళింగపట్నం మధ్యలో తీరం దాటింది. దీంతో రాబోయే 24 గంటలు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు. మరోవైపు వాయుగుండాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

News September 1, 2024

శ్రీకాకుళం: అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

image

నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గార మండలంలోని కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బలమైన గాలులు, తీరం దాటిన అనంతరం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది.

News September 1, 2024

శ్రీకాకుళం: తుఫాన్ సహాయక చర్యలకు ప్రత్యేక అధికారులు

image

తుఫాన్ వర్షాలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ప్రకటించారు. రణస్థలంకు లక్ష్మణమూర్తి (9121251111), గారకు బీ శాంతిశ్రీ (9440814582), పోలాకి ఆర్ వెంకట్రామన్ (8919364818), సంతబొమ్మాళి రామ్మోహనరావు(9440422302), వజ్రపుకొత్తూరు ఉమామహేశ్వరరావు (9866530885), మందస నగేష్ (7093930101), సోంపేట సత్యనారాయణ (9502225511)లను నియమించారు.

News September 1, 2024

శ్రీకాకుళం: నేటి ఖో ఖో జట్ల ఎంపికలు వాయిదా

image

శ్రీకాకుళం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన (ఆదివారం) శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు నాగ భూషణరావు తెలిపారు. ఎంపికలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు.

News September 1, 2024

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో బిగ్ ట్విస్ట్

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య దువ్వాడ వాణీ వివాదం ఎపిసోడ్‌లో శనివారం ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్‌తో సన్నిహితంగా ఉంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి ఫోన్ చేశారు. “దువ్వాడ వాణీ వేధింపుల కారణంగానే నేనే ఆత్మహత్య ప్రయత్నం చేసానని శ్రీనివాస్ మాధురికి సలహా ఇచ్చిన ఆడియో తాజాగా బయటకు రావడం చర్చనీయాంశమైంది.

News September 1, 2024

శ్రీకాకుళం: తుఫాన్ నేపద్యంలో వంశధార గేట్లు మూసివేత

image

శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం నేపద్యంలో శనివారం సాయంత్రం హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రధానంగా వంశధార ఎడమ, కుడి ప్రధాన కాలువల గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ బీ.రాంబాబు తెలిపారు. జిల్లాలోని సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తుఫాన్ కారణంగా వరద పోటెత్తే ఆవకాశం ఉండడంతో గేట్లను మూసివేసినట్లు తెలిపారు.

News August 31, 2024

కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

image

భారీ వర్షాల దృష్ట్యా ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. శనివారం ఆయన జిల్లాల ముఖ్య అధికారులతో జరిపిన సమీక్షలో కలెక్టర్లతో మాట్లాడారు. ఉత్తరాంధ్ర జిల్లాల తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం సూచించారు. తుఫాన్ తీరం దాటేటప్పుడు 55- 65 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశముందని సీఎం ఈ మేరకు సమీక్షలో స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

News August 31, 2024

జి.సిగడాం: వారం రోజులలో 5 మంది మృతి

image

జి.సిగడాం మండలం వెలగాడ గ్రామంలో డయేరియా, జ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. గ్రామానికి చెందిన కోల నాగమ్మ శనివారం డయేరియా బారిన పడి మృతి చెందిందని తెలిపారు. వారం క్రితం నలుగురు మరణించగా, 30 మంది రాజాం, శ్రీకాకుళంలో ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. మరణించిన ఇద్దరిలో ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడు ఉండడంతో విషాదఛాయలు అలముకున్నాయి. చర్యలు చేపట్టాలని కోరుతన్నారు.

News August 31, 2024

వన మహోత్సవం రోజే చెట్లు తొలగించిన పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది

image

శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పాత కొజ్జిరియా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం అంతుపట్టని చర్య చోటుచేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతుంటే.. మరోవైపు పాఠశాల ఆవరణంలో ఉన్న చెట్లు నరికి వేసి తొలగించారు. మొక్కలు నాటాల్సిన రోజే చెట్లు కొట్టివేయడంతో విద్యార్థులు స్థానిక ప్రజలు ఉపాధ్యాయుల తీరుపై మండిపడ్డారు.