India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విదేశాలకు కూలీ పనికి వెళ్లిన ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కవిటి మండలంలో జరిగింది. మండలంలోని ఆర్ బెలాగానికి చెందిన భుజంగరావు(43) ఇరాక్లో కూలీగా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఆయన మృతిచెందడంతో తోటి కూలీలు ఫోన్ ద్వారా కుటుంబీకులకు చెప్పారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు మృతదేహన్ని దేశానికి రప్పించి.. కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే అశోక్ బాబు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడును కోరారు.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 385 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పి.దుర్గారావు తెలిపారు. జిల్లాలో మొత్తం 19,149 మంది విద్యార్థులకు గాను 18,763 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. కాగా జిల్లాలోని పొందూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక విద్యార్థి మాథ్స్ 2A పరీక్షలో మాల్ ప్రాక్టీస్కి పాల్పడినట్లు ఆయన తెలిపారు.
RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. శ్రీకాకుళం వాసులు ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, విజయనగరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
ప్రయాణికుల రద్దీ మేరకు పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా చర్లపల్లి(CHZ), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 10, 17, 24న BBS- CHZ(నం.08479), ఈ నెల 11, 18, 25న CHZ- BBS(నం.08480) రైళ్లు నడుపుతామన్నారు. కాగా ఈ రైళ్లు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, గుంటూరు తదితర స్టేషన్లలో ఆగుతాయని వారు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.
మందస పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బీ.గవరయ్య(62) అనే వ్యక్తి గురువారం మృతిచెందారు. ఆయన భార్య బుధవారం ఇతర ప్రాంతానికి వెళ్లగా, గురువారం ఇంటికి వచ్చి చూసేసరికి భర్త ఇంట్లో మృతిచెందారు. అయితే కానిస్టేబుల్ మృతికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని సీఐ తిరుపతిరావు, ఎస్ఐ కృష్ణప్రసాద్ పరిశీలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఆక్రమణలు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ప్రకటన విడుదల చేశారు. అభ్యంతరం లేని ప్రభుత్వ భూములలో 2019 అక్టోబర్ 15లోగా గృహాలు నిర్మించిన వారు చట్టబద్ధమైన హక్కులు కల్పించుటకు గాను, ప్రభుత్వం (జీవో ఎం ఎస్ నెంబర్30/2025) విడుదల చేసిందని పేర్కొన్నారు. గ్రామ వార్డులు ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పేదరికం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం (పి-4) సర్వేకు కార్యాచరణ రూపొందించిందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వే కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ను ఉపయోగించి ఈ నెల 8వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే ప్రారంభించి 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలలో భాగంగా
గురువారం పరీక్షకు 815 మంది గైర్హాజరయ్యారని ఆర్ఐఓ ప్రగడ దుర్గారావు తెలిపారు. జనరల్లో 21156 మంది, ఒకేషనల్లో 1342 మంది పరీక్షల్లో హాజరు కావలసి ఉందని వివరించారు. మొత్తంగా 22498 మందికి గాను 21683 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.
పారదర్శకంగా లాటరీ పద్ధతిలో 18 బ్రాందీ షాపులు కేటాయించినట్లు, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. గురువారం శ్రీకాకుళం అంబేడ్కర్ ఆడిటోరియంలో లాటరీ పద్ధతిలో గీత కార్మికులకు, సొండి కులస్థులు సమర్పించిన ధ్రువపత్రాల ప్రకారం ఆయా కేటగిరిలో కేటాయించామన్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ తిరుపతి నాయుడు, అధికారులు పాల్గొన్నారు.
ఆమదాలవలస మండలం తిమ్మాపురం గ్రామం దగ్గర బుధవారం లారీ బీభత్సం సృష్టించింది. పాలకొండ రోడ్డులో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే కిరాణా షాప్స్ మీదకి దూసుకెళ్లింది. ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. కిరాణా షాపుల ఫ్లెక్సీ బోర్డులు పూర్తిగా ధ్వంసమయ్యాయి . లారీ డ్రైవర్ మద్యం తాగి నడిపినట్లు షాపు యజమాని చెబుతున్నాడు.
Sorry, no posts matched your criteria.