Srikakulam

News February 24, 2025

SKLM: ఎన్నికల విధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

image

ఉపాధ్యాయ MLC ఎన్నికల విధులపట్ల సంబంధిత పోలింగ్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సహాయ ఎన్నికల అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం జెడ్పీ మందిరంలో ఈనెల 27న ఉపాధ్యాయ MLC ఎన్నికల సంబంధించి ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించే పీవో, ఎపీవోలకు రెండో విడత శిక్షణ తరగతులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రంలో విధులు, పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు.

News February 24, 2025

అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో సిక్కోలు ఎమ్మెల్యేలు

image

శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లాలోని నియోజకవర్గాలకు చెందిన శాసనసభ్యులు కింజ‌రాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, నడుకుదిటి ఈశ్వరరావు, మామిడి గోవిందరావు, బెందాళం అశోక్, కూన రవికుమార్ హాజరయ్యారు. నియోజకవర్గంలోని సమస్యలపై రేపటి నుంచి సభలో గళం వినిపించడానికి సిద్ధమయ్యారు.

News February 24, 2025

శ్రీకాకుళం ఎమ్మెల్సీ ఓటర్లు మొత్తం 5,035 మంది

image

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 5,035 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటారని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర రావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. పురుషులు 3,416 మంది కాగా మహిళలు 1619 మంది ఉన్నారని తెలిపారు. ఎన్నికల పోలింగ్ సంబంధించి పీవో, ఏపీవోలు ఎన్నికల కమిషన్ సూచించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పూర్తిగా చదివి అవగాహనతో పకడ్బందీగా, నిష్పక్షపాతంగా పోలింగ్ ప్రక్రియను ముగించాలని తెలిపారు.

News February 24, 2025

మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి: అచ్చెన్న 

image

ఈ నెల 26న మహాశివరాత్రి సందర్భంగా టెక్కలి ఎండల మల్లికార్జున స్వామి దేవాలయం ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులకు సోమవారం చరవాణిలో మాట్లాడారు. దర్శనానికి వివిధ ప్రాంతాలు నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. అలాగే ప్రసాద వితరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News February 24, 2025

శ్రీకాకుళం: వంశధార గొట్ట బ్యారేజ్‌లో డెడ్ స్టోరేజ్

image

జిల్లాకు సాగునీరు అందించే వంశధార గొట్ట బ్యారేజ్‌లో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. దీంతో సాగునీటీతో పాటు, వంశధార నదీ పరివాహక ప్రాంతాలలో తాగునీటికి ఇక్కట్లు తప్పడం లేదు. ఒడిశాలో వర్షాలు పడితే గాని బ్యారేజ్ నిండే పరిస్థితి కనిపించడం లేదు. గతేడాది అక్టోబర్ నుంచి వర్షాలు లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది.

News February 24, 2025

సౌదీ అరేబియాలో శ్రీకాకుళం వాసి మృతి

image

శ్రీకాకుళం జిల్లా  సంతబొమ్మాలి మండలం ఎం మరువాడ గ్రామానికి చెందిన కొవిరి రామారావు (37) సౌదీ అరేబియాలో ఆదివారం రాత్రి కడుపు నొప్పితో మృతి చెందారు. అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారని సోదరుడు శ్రీనివాసరావు తెలిపారు. 3 నెలల క్రితం సౌదీ అరేబియాకు ఉపాధి నిమిత్తం పనిచేసుకునేందుకు వెళ్లారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News February 24, 2025

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా చికెన్ మేళాలు

image

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ మేళాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పలు ప్రైవేట్ పౌల్ట్రీ సంస్థల ఆధ్వర్యంలో ఈనెల 24న చిలకపాలెం, పొందూరు, 25న నరసన్నపేట, టెక్కలి, హిరమండలం, 28న పలాస, సోంపేటలో సాయంత్రం 5 గంటల నుంచి చికెన్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం శ్రీకాకుళం నగరంలో చికెన్ మేళా జరిగింది. చికెన్ మేళాల నిర్వహణపై ఇటీవల రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు.

News February 24, 2025

అరసవల్లి ఆదిత్యుని ఆదాయం

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయానికి ఆదివారం వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.8,09,600లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,34,906/-లు, ప్రసాదాల రూపంలో రూ.2,51,675/-లు ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.

News February 23, 2025

టెక్కలి: ప్రమాదవశాత్తు జారిపడి కూలీ మృతి

image

టెక్కలి జాతీయ రహదారిపై ఆదివారం ప్రమాదవశాత్తు జారిపడి మెలియాపుట్టి మండలం బంజీరు గ్రామానికి చెందిన గూడ మార్కండరావు(36) అనే కూలీ మృతిచెందాడు. గోడౌన్ నుంచి సరకులను ట్రాక్టర్ ద్వారా తీసుకువెళ్లేందుకు రోజుకూలీ డ్రైవర్‌గా ఉన్న ఈయన ప్రమాదవశాత్తు జారిపడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 23, 2025

కింజరాపు ఎర్రన్నాయుడుది మచ్చ లేని చరిత్ర : CM

image

దివంగత మాజీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు జయంతి నేడు. దీనిపై CM ట్విటర్ వేదికగా ఆయన గొప్పతనాన్ని గుర్తుచేసుకున్నారు.’ప్రజా సేవలో తిరుగులేని నిబద్ధత, నిజాయితీ, ఆత్మీయత కలబోసిన నాయకుడు ఎర్రన్నాయుడు గారు.మూడు దశాబ్దాలకు మించి రాజకీయ చరిత్రలో మచ్చలేని చరిత్రను సొంతం చేసుకున్న నా ఆత్మీయ నేస్తం ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకుందాం!’అని తన Xఖాతాలో రాసుకొచ్చారు.