Srikakulam

News August 20, 2024

విజయవాడలో హత్య.. శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అరెస్ట్

image

విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్ సాయి(24) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన పిట్ట కామయ్యతో పాటు మరో ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విజయవాడ డీసీపీ హరికృష్ణ వివరాలు వెల్లడించారు. కళ్యాణ్ సాయి, నారాయణ, పీ.కామయ్యా, కె.నాగేశ్వరరావు నలుగురూ మద్యం తాగేందుకు వెళ్లగా అక్కడ వాగ్వివాదం జరగడంతో సాయిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 20, 2024

విజయవాడలో హత్య.. శ్రీకాకుళం జిల్లా వ్యక్తి అరెస్ట్

image

విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళ్యాణ్ సాయి(24) అనే యువకుడిని హత్య చేసిన ఘటనలో శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామానికి చెందిన పిట్ట కామయ్యతో పాటు మరో ఇద్దరిని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం విజయవాడ డీసీపీ హరికృష్ణ వివరాలు వెల్లడించారు. కళ్యాణ్ సాయి, నారాయణ, పీ.కామయ్యా, కె.నాగేశ్వరరావు నలుగురూ మద్యం తాగేందుకు వెళ్లగా అక్కడ వాగ్వివాదం జరగడంతో సాయిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 20, 2024

పొందూరు: వీఆర్ గూడెం అంగన్వాడీ కార్యకర్త మృతి

image

తీవ్ర అనారోగ్యానికి గురైన పొందూరు మండలం వీఆర్ గూడెం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త కె.స్వప్న (25) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. ఐదు నెలల గర్భవతి అయిన స్వప్న తీవ్ర అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం చేర్పించారు. శిశువు పెరుగుదలలో లోపం కారణంగా అబార్షన్ కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగి స్వప్న మృతి చెందింది. ఆమెకు రెండేళ్ల పాప ఉంది.

News August 20, 2024

శ్రీకాకుళం: ఇంటర్‌తో ఐటీ రంగంలో ఉద్యోగాలు

image

ఇంటర్ అర్హతతో ఐటీ రంగంలో ప్రవేశించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు డీవీఈవో ఎస్.తవిటినాయుడు పేర్కొన్నారు. 2023- 2024లో ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఈ నెల 24న నరసన్నపేట జ్ఞాన జ్యోతి కళాశాలలో ఓ కంపెనీ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 75 శాతం అంత కంటే మార్కులు సాధించిన వారు అర్హులన్నారు. కంపెనీ నిర్వహించే కెరీర్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుందన్నారు.

News August 20, 2024

శ్రీకాకుళం: జిల్లాలో రేపు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని ఎపీ విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అధికారులు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. మన్యం, అల్లూరి, విజయనగరం జిల్లాలోని పలు ప్రాంతాల సైతం మంగళవారం పలు చోట్ల మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు పడతాయని స్పష్టం చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News August 19, 2024

టెక్కలి: ఆందోళన చేస్తూనే సోదరుడుకి రాఖీ

image

గత కొన్ని రోజులుగా టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద భార్య దువ్వాడ వాణి, కుమార్తె హైందవి ఆందోళన చేస్తున్న విషయం విధితమే. సోమవారం రాఖీ పౌర్ణమి సందర్భంగా హైందవి సోదరుడు రూపాంక్ ఆందోళన చేస్తున్న తన సోదరి హైందవి వద్దకు వచ్చి రాఖీ కట్టించుకొని ఆశీస్సులు తీసుకున్నాడు. తన తండ్రితో విభేదాల మధ్య రాఖీ వేడుకలు నిర్వహించుకున్నారు.
.

News August 19, 2024

శ్రీకాకుళం: మరో రెండు రోజుల్లో B.Tech ఫలితాలు

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్వి శ్వవిద్యాలయంలో B.Tech 3,5వ సెమిస్టర్ ఫలితాలు విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎగ్జామినేషన్స్ డీన్ డాక్టర్ ఎస్ ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ ఫలితాలు రెండు రోజుల్లో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పరీక్ష ఫలితాలు వర్సిటీ పరిధిలో త్వరితగతిన విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.

News August 19, 2024

శ్రీకాకుళం: నేటితో ముగుస్తున్న పీజీ సెట్ సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

శ్రీకాకుళం జిల్లాలో కళాశాలల్లో ఏపీ పీజీసెట్-2024 ప్రవేశానికి సంబంధించి కౌన్సెలింగ్‌లో భాగంగా ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈనెల 19వ తేదీతో ముగియనుంది. ఈ సందర్భంగా అభ్యర్థులు కౌన్సెలింగ్ ద్వారానే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ కాలేజీలలో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈనెల 23వ తేదీలోపు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. 24న ఆప్షన్లకు మార్పు 28న సీట్లు కేటాయించనున్నారు.

News August 19, 2024

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో అసలేం జరుగుతుంది..?

image

గత 13 రోజులుగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో జరుగుతున్న పరిణామాలు మలుపులు తిరుగుతూ ఎవరికీ అంతు చిక్కడం లేదు. తనకు వాణి నుంచి విడాకులు కావాలని శ్రీనివాస్ అంటుండగా, మొదట్లో శ్రీనివాస్‌తోనే ఆస్తులు కావాలి అన్న వాణి తాజాగా ఆస్తులు ఏమీ వద్దు శ్రీనివాస్‌తో మేము ఉంటామన్నారు. ఇక దివ్వెల మాధురి కూడా శ్రీనివాస్‌ను వదులుకోను అంటోంది. పోలీసులు రాత్రింబవళ్లు అక్కడే ఉంటున్నారు.

News August 19, 2024

శ్రీకాకుళం: కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే రూట్‌లో మార్పులు

image

విజయవాడ డివిజన్‌లో ట్రాక్ భద్రతా పనులు చేస్తున్నందున శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట మీదుగా ప్రయాణించే కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌(నం.11019) ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు సెప్టెంబరు 2 నుంచి 28 వరకు ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా కాక గుడివాడ-భీమవరం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు. ఆయా తేదీల మధ్య ఈ రైలుకు ఏలూరు, తాడేపల్లిగూడెంలో స్టాప్ లేదని పేర్కొన్నారు.