Srikakulam

News February 23, 2025

SKLM: ‘కేసులు త్వరగా దర్యాప్తు చేయాలి’

image

గంజాయి అక్రమ రవాణా, ఇతర మాదక ద్రవ్యాల కేసుల్లో పటిష్ఠంగా దర్యాప్తు చేపట్టి శిక్షలు శాతం పెరిగేలా చేయాలని విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. శనివారం ఎచ్చెర్లలోని ఓ ప్రైవేటు కళాశాలలో SKLM, VZM, మన్యం జిల్లాల పోలీసు అధికారులతో గంజాయి, కేసుల దర్యాప్తులో చట్టపరమైన నిబంధనలు, పాటించాల్సిన నియమాలపై వర్క్‌ షాప్ నిర్వహించారు. ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి, ఏఎస్పీ వెంకట రమణ ఉన్నారు.

News February 22, 2025

పలాస: తల్లి మందలించిందని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి పద్మనాభపురం శివాజీ నగర్ కాలనీలో శుక్రవారం రాత్రి ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే పరీక్షలు సమీపిస్తుండడంతో చదవమని తల్లి మందలించగా మనస్తాపం చెందిన యశ్వంత్ (17) ఉరేసుకున్నాడు. శనివారం విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 22, 2025

SKLM : విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు

image

విద్యార్థిని వీడియోలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి, పోర్న్ సైట్లలో సొమ్ము చేసుకుంటున్న ఇద్దిరిని శ్రీకాకుళం పోలీసులు అరెస్ట్ తెలిపారు. నగరానికి చెందిన ఓ విద్యార్థిని తిరుపతిలో చదువుతున్న సమయంలో సోయల్‌ పరిచయమయ్యాడు. ఆమెకు తెలియకుండా తీసిన వీడియోలను మార్ఫింగ్ చేసి, కొత్త నంబర్లతో పంపుతూ వేధించేవాడు. ఆ వీడియోలు చూసేందుకు సోయల్ నుంచి క్యూఆర్ కొనుగోలు చేసిన నందికొట్కూరుకు చెందిన రఘును కూడా అరెస్టు చేశారు.

News February 22, 2025

SKLM: గ్రూప్-2 సర్వీసెస్ పరీక్షలకి సమయపాలన తప్పనిసరి

image

ఈ నెల 23న జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అభ్యర్థులంతా సమయపాలన పాటించాలని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 15 పరీక్షా కేంద్రాల్లో జరుగుతాయన్నారు. శ్రీకాకుళం మండలం – 8, ఎచ్చెర్ల మండలం – 7గా కేటాయించారు. ఈ పరీక్షలు రెండు సెషన్లలో జరుగుతాయని వెల్లడించారు. ఉదయం 10 నుంచి 12.30, మధ్యాహ్నం 3 నుంచి 5.30 వరకు పరీక్షలు ఉంటాయన్నారు.

News February 22, 2025

శ్రీకాకుళం: జిల్లాను ప్రగతి పథంలో తీసుకువెళ్లాలి

image

జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్లేందుకు అందరూ సమష్టిగా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థాయి సంఘాల అధ్యక్షురాలు పిరియా విజయ అన్నారు. శుక్రవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోని జడ్పీ కార్యాలయంలో 2వ, 4వ, 7వ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. జిల్లా అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖాధికారులు హాజరయ్యారు.

News February 21, 2025

SKLM: వయసు 23.. 12 దొంగతనం కేసులు

image

శ్రీకాకుళంలో గంజాయితో శుక్రవారం నలుగురు యువకులు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. చదువుపై దృష్టిని సారించాల్సిన యువకులు తప్పటడుగులు వేస్తూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు కన్నీరు మిగులుస్తున్నారు. అరెస్టయిన వారిలో ధర్మాన ప్రవీణ్(23)పై ఏకంగా 12 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇటీవల జైలుకు వెళ్లొచ్చాడు. యోగేశ్వర రావు, జలగడుగుల తార వికాస్‌పై గతంలో గంజాయి కేసులు ఉండటంతో జైలుకెళ్లారు.

News February 21, 2025

అచ్చెన్న అబద్ధాలు చెప్పడం తగదు: ధర్మాన కృష్ణ దాస్

image

వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అన్ని శాఖలకు మంత్రి స్థానంలో ఉండి అచ్చెన్నాయుడు అబద్ధాలు చెప్పడం తగదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ విమర్శించారు. శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మిర్చి రైతులు గిట్టుబాటు ధరలు లేక సతమతం అవుతుంటే గత ప్రభుత్వంలో రేటు పలికిందా? అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి వాస్తవాలు మాట్లాడాలని హితవు పలికారు.

News February 21, 2025

శ్రీకాకుళంలో ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే

image

ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం చూపించేది కమ్యూనిస్టు ప్రణాళికని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గోవిందరావు, బి.కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని సీపీఎం కార్యాలయంలో పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు అధ్యక్షతన ఇంటర్నేషనల్ రెడ్ బుక్ డే నిర్వహించారు. లెనిన్ రాసిన గ్రంథాన్ని అధ్యాయం చేయాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు.

News February 21, 2025

మందస: విద్యార్థిని ఆత్మహత్యపై కేసు నమోదు

image

మందస మండలం లోహరిబందలో ఇటీవల ఓ విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎస్.ఐ కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసినట్లు గురువారం తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె మధ్యాహ్నం భోజనం చేసి ఇంటికి వచ్చి జీడీ తోటలోకి వెళ్లి చెట్టు కొమ్మకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో మండలంలో కలకలం రేపింది. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News February 21, 2025

శ్రీకాకుళం ప్రజలారా జాగ్రత్త…!

image

శ్రీకాకుళం అంటేనే వలసలు గుర్తుకొస్తాయి. చదువు రాని వాడు చేపల వేటకు రాష్ట్రాలు దాటి వెళ్తున్నాడు. కాస్తోకూస్తో చదివినోడు దుబాయ్, ఇటలీ, మలేషియా అంటూ విమానం ఎక్కుతున్నాడు. వీళ్ల కష్టాలే కొందరికి వరంగా మారింది. విదేశాల్లో ఉద్యోగాలు తీసిస్తామంటూ రూ.లక్షలు దోచేస్తున్నారు. వీరిని నమ్మి పరాయి దేశానికి వెళ్తున్న సిక్కోలు బిడ్డలు కష్టాలు పడుతున్నారు. జిల్లాలో ఈమోసాలు ఇటీవల ఎక్కువైపోవడం ఆందోళన కలిగిస్తోంది.

error: Content is protected !!