Srikakulam

News June 24, 2024

నరసన్నపేట: చోరీ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

image

చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నరసన్నపేట సివిల్ జడ్జి సి.హరిప్రియ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. 2019 నవంబర్ 6 తేదీన నరసన్నపేటలో విద్యుత్ శాఖ ఏఈ పల్లి బాలకృష్ణ ఇంట్లో మండలానికి చెందిన బమ్మిడి దేవకుమార్ బంగారం దొంగతనం చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలు శిక్ష ఆమె విధించారు. ఈ క్రమంలో ముద్దాయిని రిమాండ్‌కు తరలించారు.

News June 24, 2024

రాజాం: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

సారథి గ్రామానికి చెందిన వంజరాపు సన్యాసినాయుడు (74) అనారోగ్యంతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నాడు. దీంతో పురుగు మందు ఆదివారం తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అందిస్తుండగా సోమవారం పరిస్థితి విషమించి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తన కుమారుడైన రవి ఇచ్చిన ఫిర్యాదు పై రాజాం పోలీస్ స్టేషన్ ఏ.ఎస్.ఐ లక్ష్మీనాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News June 24, 2024

భామిని: అడుగంటిపోయిన వంశధార

image

గతేడాది నవంబర్ నెల నుంచి వర్షాలు లేకపోవడంతో వంశధార నదిలో చుక్క నీరు లేక అడుగంటి పోయింది. వంశధార నది పరివాహ ప్రాంతమైన ఒడిశాలోను వర్షాలు కురవక పోవడంతో నదిలో నీటి ప్రవాహం లేకుండా పోయిందని తీర ప్రాంతాలకు చెందిన రైతులు ఆందోళన చెందుతున్నారు. భామిని మండలంలో పసుకుడి గ్రామం వద్ద వంశధార నది ఎడారిని తలపింస్తోంది. ఈ ఏడాది వరి సాగుకు నీటి లభ్యత ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News June 24, 2024

టెక్కలి: వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేలు

image

టెక్కలి పోలీసులకు దొంగలు సవాల్ విసురుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా వరుస దొంగతనాలకు పాల్పడుతున్నారు. టెక్కలి పోలీస్‌ స్టేషన్‌తో పాటు పోలీస్ సర్కిల్ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయాల అధికారులు టెక్కలిలో ఉన్నప్పటికీ దుండగులు యథేచ్ఛగా దొంగతనాలకు పాల్పడుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. నగదు, బంగారం, బైక్‌లతో పాటు ఇతర విలువైన వస్తువులు చోరీకి గురవుతున్నాయి.

News June 24, 2024

శ్రీకాకుళం: జులై 29 నుంచి BFA, MFA పరీక్షలు

image

AU పరిధిలో BFA, MFA రెండో సెమిస్టర్ పరీక్షలను జులై 29 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అధికారి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. 29న BFA విద్యార్థులకు హిస్టరీ, 30న ఇంగ్లిష్, 31న ఫండమెంటల్స్ ఆఫ్ డిజైన్ MFA విద్యార్థులకు 30న మోడల్ ఇండియన్ ఆర్ట్, 31న మోడల్ రెస్టారెంట్ ఆర్ట్ పరీక్షలు జరగనున్నాయి.

News June 24, 2024

శ్రీకాకుళం: ఆకాశాన్ని తాకుతున్న టమాట ధరలు

image

జిల్లాలో టమాట ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రైతు బజార్లో టమాటా ధర కిలో70 రూపాయలు, బహిరంగ మార్కెట్లో ఏకంగా 100 రూపాయలు పలుకుతుందని ప్రజలు వాపోతున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. రైతు బజార్‌లో టమాటా నిల్వలు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

News June 24, 2024

సైకిల్‌పై పార్లమెంటుకు విజయనగరం MP

image

విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీలోని అతిథి గృహం నుంచి సైకిల్‌పై పార్లమెంట్‌కు బయలుదేరారు. ముందుగా ఆయన తన తల్లికి పాదాభివందనం చేసి పార్లమెంటుకు వెళ్లారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీ నేతలు హాజరయ్యారు.

News June 24, 2024

శ్రీకాకుళం: భర్తను హత్య చేసిన భార్య

image

ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో దారుణం చోటుచేసుకుంది. సోమవారం ఉదయం గ్రామానికి చెందిన కుప్పయ్యను ఆయన భార్య హారమ్మ కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. గతేడాది కుప్పయ్య తన కుమారుడిని చంపి జైలులో ఉన్నాడు. ఇటీవలే ఆయన బెయిల్‌పై బయటికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామానికి వచ్చిన కుప్పయ్యను రాత్రి హారమ్మ కత్తితో హత్య చేసింది. నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

News June 24, 2024

ఢిల్లీలో శ్రీకాకుళం వాసి మృతి

image

నందిగాం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం ఢిల్లీలో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. కామధేనువు గ్రామానికి చెందిన మధుబాబు మూడేళ్లుగా ఢిల్లీలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. శుక్రవారం ఢిల్లీ రైల్వే స్టేషన్లో అపస్మారక స్థితిలో ఉన్న ఆయణ్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధు మృతి చెందాడు. ఆధార్ కార్డ్ ఆధారంగా ఢిల్లీ పోలీసులు స్థానికపోలీసులకు సమాచారం అందించారు.

News June 24, 2024

శ్రీకాకుళం నేపథ్యంతోనే తండేల్..

image

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా నేపథ్యమంతా శ్రీకాకుళం చుట్టూనే ఉంటుందని చిత్ర కథా రచయిత కార్తీక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్ల మండలం, కూనపేటలో పుట్టిన తాను సినిమాపై ఆసక్తితో 2012లో హైదరాబాద్‌కు వచ్చానన్నారు. 2018లో జిల్లాలోని కొంత మంది మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటి 14 నెలలు పాకిస్థాన్‌లో ఉండగా.. ఆ నేపథ్యాన్నే సినిమాగా తీస్తున్నామన్నారు.