Srikakulam

News November 7, 2024

శ్రీకాకుళం జిల్లా పాఠశాలల్లో ప్రారంభమైన FA -2 పరీక్షలు

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో FA -2 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం అయ్యాయి. మూడు రోజులు పాటు జరిగే ఈ పరీక్షల్లో బుధవారం మొదటి రోజు పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 1 నుంచి 5 తరగతుల విద్యార్థులు 9,10 తరగతుల విద్యార్థులు పరీక్షలు రాశారు. మధ్యాహ్నం 6,7,8 తరగతులు విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. మంగళవారం సెలవు కావడంతో బుధవారం నుంచి ఈ పరీక్షలను ఉపాధ్యాయులు నిర్వహించారు.

News November 6, 2024

దంతలో అల్లుడిపై అత్తమామలు, భార్య దాడి

image

కోటబొమ్మాళి మండలం కురుడు గ్రామానికి చెందిన జలుమూరు దశమయ్య పై దంత గ్రామానికి చెందిన అతడి భార్య పావని, మామ బొమ్మాళి లచ్చుమయ్య, అత్త అదిలక్ష్మిలు దాడి చేశారు. కన్నవారి ఇంట్లో ఉన్న భార్య పావని ఆధార్ కార్డు అడగడంతో భార్యతోపాటు అత్తమామలు దశమయ్యపై దాడిచేసి గాయపరిచారు. ఈ మేరకు దశమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి. సత్యన్నారాయణ తెలిపారు.

News November 6, 2024

సోంపేట: అత్తకు తలకొరివి పెట్టిన కోడలు

image

సోంపేట మండలం జింకిభద్ర గ్రామానికి చెందిన యజ్జల గోపమ్మ తన కోడలు తులసమ్మతో కలిసి ఉంటున్నారు. అనారోగ్యంతో గోపమ్మ మంగళవారం మృతిచెందారు. గోపమ్మకు కుమారుడు ప్రసాద్, కుమార్తె బెంగళూరులో కూలీ పనులకు వలస వెళ్లారు. అంత్యక్రియలు చేయడానికి ప్రసాద్ అందుబాటులో లేరు. దీంతో కోడలు తులసమ్మే అత్తకు తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు.

News November 6, 2024

శ్రీకాకుళం: IIIT విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

image

శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం (త్రిబుల్ ఐటీ) విద్యార్థిని  ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ప్రస్తుతం శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విష ద్రావణం తాగిన విద్యార్థిని గుర్తించిన వసతి గృహం సిబ్బంది అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ మొదటి ఏడాది చదువుతున్న ఆమెది సొంత ప్రాంతం నంద్యాల.

News November 6, 2024

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి: కలెక్టర్

image

పార్వతీపురం మన్యం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించాలని మంగళవారం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని, పరికరాలు అందుబాటులో ఉండాలని చెప్పారు. మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లుపై సంబంధిత అధికారులతో తన కార్యాలయంలో మంగళవారం కలెక్టర్ శ్యాంప్రసాద్ సమీక్షించారు.

News November 5, 2024

REWIND: టెక్కలిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు

image

టెక్కలి కచేరివీధిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు అయ్యింది. 2021 నవంబర్ మాసంలో దీపావళి సందర్భంగా టెక్కలికి చెందిన ఎస్.సాయిగోపాల్, వీ.హరి, ఎస్.మూర్తి అనే ముగ్గురు స్నేహితులు ఒక ఇంటి ఆవరణలో దీపావళి చేతిబాంబులు తయారు చేస్తున్న క్రమంలో అప్పట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనతో నాడు టెక్కలి ప్రజానీకం ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులు సుదీర్ఘకాలం చికిత్స అనంతరం కోలుకుని ప్రాణాలతో బయట పడ్డారు.

News November 5, 2024

శ్రీకాకుళంలో కోర్టు కేసులు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్

image

వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఏపీసేవా, మీసేవ, పీజీఆర్‌ఎస్ సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ సంస్థ, సీపీవో, రహదారులు, భవనాలు, విద్యా, పంచాయతీ, ఉద్యాన, APEPDCL, డ్వామా, ఐసీడీఎస్, వైద్య ఆరోగ్య శాఖలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న మీకోసం అర్జీలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

News November 5, 2024

అపార్ ఐడీ కార్డు నమోదు కీలకం: SKLM కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో అపార్ ఐడీ కార్డు నమోదుపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆరా తీశారు. మంగళవారం ఆయన ఆ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. DEO తిరుమల చైతన్య జిల్లాలో నేటికి 60.679 శాతం పూర్తి చేశామన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపార్ ఐడీ కార్డు వెబ్‌‌సైట్లో విద్యార్థుల ఆధార్ కార్డుతో పాటు పూర్తి వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. అపార్ ఐడీ కార్డు విద్యార్థులకు చాలా కీలకమన్నారు.

News November 5, 2024

టెట్ పరీక్షలలో సత్తాచాటిన శ్రీకాకుళం వాసి కుంచాల జ్యోతి

image

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్షలను ఈ ఏడాది అక్టోబర్లో నిర్వహించింది. సోమవారం రాత్రి విడుదలైన పరీక్ష ఫలితాలలో శ్రీకాకుళం రూరల్ మండలం శిలగాం సింగువలస గ్రామానికి చెందిన కుంచాల జ్యోతి తన సత్తాను చాటారు. ఈ పరీక్షలలో 150 మార్కులకు గాను ఆమె 149.07 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు. పదవ తరగతి పరీక్షల నుంచి ఉపాధ్యాయ శిక్షణ కోర్సు వరకు ఈమె ఉత్తమ ఫలితాలను సాధించారు.

News November 5, 2024

SKLM: రబీ వేరుశనగ పంటకు విత్తనాలు సిద్ధం

image

మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో ఈ ఏడాదిలో రబీలో పంట సాగు చేసే రైతుల కోసం సబ్సిడీ వేరుశనగ విత్తనాలు సిద్ధం చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి కె. త్రినాధ స్వామి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 సీజనుకు గాను రైతు సేవా కేంద్రాలలో అధిక దిగుబడి నిచ్చే వేరుశనగ విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. విత్తనాలు కావలసిన రైతులు, రైతు సేవ కేంద్రాలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు.

error: Content is protected !!