India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక మునిసిపల్ మైదానంలో ఆదివారం ప్రారంభించిన డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం వాయిదా వేయటం జరిగిందని డీఆర్డిఏ పీడీ పీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని సమస్యలు కారణంగా దీనిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమాన్ని సోమవారానికి మార్చామని, దీనిని గమనించాలని స్పష్టం చేశారు.
జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5వ తేదీ ఆదివారం 7 రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బజార్లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
ఆమదాలవలసకు చెందిన వైద్యుడు పీ.హర్షవర్ధన్(36) అనే వైద్యుడు గురువారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతిచెందారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని బీ.ఆర్ నగర్కు చెందిన ఈయన శ్రీకాకుళంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యునిగా పనిచేస్తున్నారు. కాగా గురువారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన ఈయన గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. వైద్యుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
రాష్ట్రంలోని కొత్త విమనాశ్రాయాల నిర్మాణాలపై శుక్రవారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో సీఎం ఆయన నివాసంలో సమీక్షించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఫీజిబిలిటి సర్వే పూర్తయిందని సీఎం కీలక ప్రకటన చేశారు. నిర్మాణానికి దాదాపు 1,383 ఎకరాల్లో నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామన్నారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉందన్నారు.
వీరఘట్టం మండలంలోని అడారు గ్రామానికి చెందిన వండాన సంతోష్ కుమార్, హేమలత దంపతులకు లక్ష్యతా శ్రీ 9 నెలల క్రితం జన్మించింది. ఇంతలోనే ఆ చిన్నారికి బ్రెయిన్ సంబంధిత వ్యాధి రావడంతో తల్లిదండ్రులు వైద్యులకు చూపించారు. వైద్య పరీక్షలు నిర్వహించి చిన్నారి బ్రెయిన్లో కణతులు ఉండటంతో వైద్యం సాధ్యం కాదని డాక్టర్లు చేతేులెత్తేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జేమ్స్లో చికిత్స పొందుతూ శుక్రవారం చిన్నారి మరణించింది.
రథసప్తమి వేడుకల్లో భక్తులకు అసౌకర్యం కలగకుండా పటిష్ఠంగా బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన అరసవల్లిలో పర్యటించారు. అనంతరం పోలీసులు, ఆలయ అధికారులు, అర్చకులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ క్రమంలో ముందుగా జిల్లా ఎస్పీ ఆలయ భౌగోళిక మ్యాప్, దేవస్థానం పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎస్పీ, డీఎస్పీ వివేకానంద ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో 107 రేషన్ డీలర్ల పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు మండలాల వారీగా వివరాలను RDO కె. సాయి ప్రత్యూష శుక్రవారం ఆమె కార్యాలయం నుండి తెలియజేశారు. ఆమదాలవలస- 8, బూర్జ- 3, ఎచ్చెర్ల- 5, జి.సిగాడం- 5, జలుమూరు – 3, లావేరు – 15, నరసన్నపేట – 12, పోలాకి – 12, పొందూరు – 16, రణస్థలం – 10, సరుబుజ్జిలి – 4, శ్రీకాకుళం – 14 ఖాళీలు ఉన్నట్లు RDO స్పష్టం చేశారు.
ఏపీజేఏసీ అమరావతి, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్లను శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రెవెన్యూ శాఖ అధికారులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కె.సాయి ప్రత్యూష, ఏపీజేఏసీ నేతలు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం రేపటి నుంచి అమలు కానుంది. జిల్లాలో 38 జూనియర్ కళాశాలలో 11028 మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే వీరిలో 1787 మంది వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మధ్యాహ్న భోజనం అమలు చేయడం లేదని డీవీఈఓ తవిటి నాయుడు శుక్రవారం తెలిపారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భోజనం అందిస్తామని ఆయన చెప్పారు.
జిల్లా స్థాయి దక్షిణ భారతదేశపు సైన్స్ ఫెస్ట్ 2024-25 శుక్రవారం శ్రీకాకుళంలోని బాలురు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ పోటీలను జిల్లా జాయింట్ కలెక్టర్ అహమ్మద్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అధ్యక్షుడిగా పాల్గొన్నారు. విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం కలిగి, దేశ పురోభివృద్ధికి పాటుపడాలని వక్తలు కోరారు. సైన్స్ ప్రాజెక్ట్స్, సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Sorry, no posts matched your criteria.