Visakhapatnam

News August 21, 2025

జీవీఎంసీ కౌన్సిల్ హాలును పరిశీలించిన కమిషనర్ కేతన్ గార్గ్

image

జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్‌ను పరిశీలించారు. శుక్రవారం నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కార్యదర్శి బి.వి.రమణను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటి కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ హాజరు అవునున్న తరుణంలో కౌన్సిల్ హల్‌ను పరిశీలించారు.

News August 21, 2025

మల్కాపురం: మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య

image

మల్కాపురంలో ఓ వ్యక్తి గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెంలో ఉంటున్న కనకరాజు మద్యానికి బానిసయ్యాడు. ఈ మధ్య కాలంలోనే అతని భార్యకు ఆపరేషన్ అయింది. అప్పటి నుంచి ఆమె పుట్టింటిలోనే ఉంటోంది. దీంతో ఒంటరితనం భరించలేక మనస్తాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News August 21, 2025

బీచ్ రోడ్డు: బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకో బాస్..!

image

బీచ్ రోడ్డులో సబ్‌మెరిన్ వద్ద అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. పూర్ణ మార్కెట్‌ ప్రాంతానికి చెందిన కె.సాగర్(26) స్నేహితుడితో కలిసి పార్క్ హోటల్‌ నుంచి RK బీచ్‌ వైపు బైక్‌పై వస్తున్నాడు. ముందు ఉన్న బైక్ యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఆ వాహనాన్ని వీరు ఢీకొట్టి పడిపోయారు. హెల్మెట్ లేకపోవడంతో సాగర్‌ తలకు తీవ్రగాయమై చికిత్స పొందుతూ గంట వ్యవధిలో మరణించాడు. త్రిటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News August 21, 2025

స్టీల్‌ప్లాంట్‌లో క్యాంటీన్ల మూసివేతకు కారణం ఇదేనా?

image

ఓ లేఖ..స్టీల్‌ప్లాంట్‌లో ప్రైవేట్ <<17470374>>క్యాంటీన్లు మూసివేత<<>>కు కారణంగా తెలుస్తోంది. ఓ మాజీ యూనియన్ నాయకుడు ఉక్కుమంత్రిత్వశాఖకు ఆ లేఖ రాసినట్లు సమాచారం. క్యాంటీన్ నిర్వహకులు ఉచితంగా కరెంటు,నీరు వాడుకుంటూ అనాధికార క్యాంటీన్లతో ఉక్క యాజమాన్యానికి రూ.కోట్లలో నష్టం వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో ఉక్కుమంత్రిత్వశాఖ నుంచి CMDకి ఆదేశాల రావడంతో నిర్వాహకులకు నోటీసులు ఇస్తున్నట్లు సమాచారం.

News August 21, 2025

విశాఖ: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్

image

ఆల్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో మెంటాడకు చెందిన బొడ్డు తిరుపతి (25), గొట్టాపు నాగేంద్రబాబు (25), రాపర్తి నాగేశ్వరరావు(25)ను అరెస్టు చేసి వారి నుంచి 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేయగా.. బుధవారం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

News August 21, 2025

భవనం ఖాళీ చేయించిన అధికారులు

image

విశాఖ వెలంపేట పూలవీధిలో ఒక భవనం మరో భవనంపై కుంగిపోయింది. ఈ విషయాన్ని ముందుగా ఒకరు నగర పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన స్పందించి వెంటనే వన్ టౌన్ పోలీసులు, జీవీఎంసీ అధికారులను పంపించారు. పరిశీలన చేసిన వెంటనే ఆ భవనంలో ఉన్న పది కుటుంబాలను ఖాళీ చేయాలని సూచించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఇతర అధికారులు కూడా పరిశీలించారు. బిల్డర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

News August 21, 2025

‘విశాఖలో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డు నిర్మాణం’

image

ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్‌లో పతకాలు సాధించిన స్కేటర్లను బుధవారం విశాఖలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గణబాబు, VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. రూ.3.50 కోట్లతో అంతర్జాతీయ స్థాయి స్కేటింగ్ బోర్డును విశాఖలో నిర్మిస్తున్నట్టు వెల్లడించారు.

News August 21, 2025

స్టీల్ ప్లాంట్లో ప్రమాదం.. కార్మికుడి మృతి

image

స్టీల్ ప్లాంట్‌ లోని ఎస్ఎంఎస్ విభాగంలో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉద్యోగి మృతి చెందాడు. వడ్లపూడి ప్రాంతానికి చెందిన కర్రీ పైడి కొండయ్య ఎస్ఎంఎస్ విభాగంలోని టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సాయంత్రం విభాగంలోని క్రేన్ పై పనులు చేస్తుండగా జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.

News August 20, 2025

అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోండి: DEO

image

ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని DEO ప్రేమ్ కుమార్ కోరారు. ప్రభుత్వ, జడ్పీ, మున్సిపల్ ఉపాధ్యాయులు మ్యూచువల్, కేటగిరిలో బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. LEAP APP ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పంపించాలని తెలిపారు. హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.‌ ఈనెల 24 వరకు MEOలకు దరఖాస్తులు పంపాలన్నారు.

News August 20, 2025

సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆర్కే రోజా

image

సింహాచలంలోని వరాహ లక్ష్మీనరసింహ స్వామిని మాజీ మంత్రి రోజా కుటుంబ సమేతంగా బుధవారం దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి కప్పస్తంభం అలింగనం చేయించారు. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. వేద పండితులు ఆశీర్వాదం అందజేసి స్వామి వారి చిత్రపటాలు, ప్రసాదాలను అందజేశారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలకు శాంతి, ఐశ్వర్యం కలగాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు.