India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్టీల్ ప్లాంట్ కార్మికులు 16వ తేదీ నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెకు అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. సీఐటీయూ ఆఫీసులో మంగళవారం జరిగిన సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ అంశంపై ఎంపీ, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవాలన్నారు. 18న గాజువాకలో, 19న నగరంలో కాంట్రాక్టు కార్మికుల ప్రదర్శనల్లో పాల్గొంటామన్నారు. సీఐటీయూ నాయకులు కుమార్, ఎఐటియుసి మన్మధరావు పాల్గొన్నారు.
పార్వతీపురం-సీతానగరం లైన్లో ఇంటర్ లాకింగ్ పనులు వలన పలు రైలు గమ్యాన్ని కుదించడం జరిగిందని వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ మంగళవారం తెలిపారు. ఈ మేరకు గుంటూరు-రాయగడ ఎక్స్ ప్రెస్ (17243/44) ఏప్రిల్ 21నుంచి మే 3వరకు గుంటూరులో బయలుదేరి విశాఖ మీదగా విజయనగరం వరకే వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు రాయగడకు బదులుగా విజయనగరం నుంచి బయలుదేరి విశాఖ మీదగా గుంటూరు వెళ్తుంది.
విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి బుధవారం విశాఖలో పర్యటిస్తారు. సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లపై దేవాదాయశాఖ, జిల్లా అధికారులతో ఉదయం 11గంటలకు సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పాల్గొనున్నారు. వీటికి తగ్గట్టు జిల్లా అధికారులు, దేవదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మధురవాడ సమీపంలో కీచక భర్త చేతిలో హత్యకు గురైన నిండు గర్భిణి <<16097534>>అనూష<<>> మృతదేహానికి వైద్యులు మంగళవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. ఆమెకు నెలలు నిండటంతో గర్భంలోనే ఆడ శిశువు మృతి చెందింది. మృతి చెందిన పసికూనను వైద్యులు బయటకు తీశారు. ‘నవమాసాలు మోసిన మీ అమ్మతోనే నువ్వు వెళ్లిపోతున్నావా’ అంటూ కుటుంబ సభ్యులు విలపించారు. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ ఘటనపై పెద్దఎత్తున మండిపడుతున్నారు.
విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం ఉదయం 10.30 గంటలకు జడ్పీ ఛైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరగనుంది. జిల్లా అభివృద్ధి ఎజెండాపై కీలక చర్చలు జరగనున్నాయి. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించే ఈ సమావేశానికి గౌరవ సభ్యులు, ఆహ్వానితులు హాజరు కావాల్సిందిగా జడ్పీ ఛైర్పర్సన్ సుభద్ర మంగళవారం కోరారు.
మల్కాపురం పోలీస్ స్టేషన్లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.
మల్కాపురంలో ఓ యువకుడు తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. వానపల్లి సాయి గణేశ్ (23) మల్కాపురం హరిజన వీధిలో ఉంటున్నాడు. తనకు బైక్ కొనివ్వాలని వారం రోజులుగా తల్లిదండ్రులతో గొడవపడేవాడు. మంగళవారం ఉదయం ఇంట్లో ఉరేసుకున్నాడు. తండ్రి అప్పలరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
విశాఖలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందారు. టూటౌన్ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావణ్య బస్సు కోసం సహోద్యోగి ద్విచక్రవాహనంపై జైలురోడ్డు నుంచి జగదాంబ జంక్షన్కి వెళ్తున్నారు. ఆ సమయంలో ఆటు నుంచి వస్తున్న జీవీఎంసీ గార్బేజ్ లారీ వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న లావణ్య కుడివైపు పడిపోవడంతో ఆమె తలపై నుంచి లారీ వెళ్లింది.
కైలాసపట్నం బాణసంచా కేంద్రంలో క్రాకర్స్ తయారీకి కెమికల్స్ను గ్రైండర్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. కోటవురట్ల పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడారు. రెండో నంబర్ షెడ్లలో పేలుడు జరిగి వ్యాపించిన మంటలు దగ్గరలో ఉన్న ఒకటో నంబర్ షెడ్కు వ్యాప్తి చెందినట్లు తెలిపారు. పక్క పక్కనే షెడ్లు ఉండటంవల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందన్నారు.
దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మంగళవారం విశాఖ రానున్నారు. ఈరోజు రాత్రి 10:45కు విశాఖ ఎయిర్ పోర్ట్కు చేరుకొని ఓ హోటల్లో బస చేస్తారు. బుధవారం సింహాచలం దేవాలయానికి వెళ్లి చందనోత్సవ పనులపై అధికారులతో కలిసి సమీక్ష చేస్తారు. సాయంత్రం సింహాచలం నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కు చేరుకొని అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.
Sorry, no posts matched your criteria.