India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత కుమార్తె రేష్మిత చిన్న వయసులో పెద్ద మనసు చాటుకున్నారు. విజయవాడ ప్రాంతంలో అజిత్ సింగ్ నగర్లో సర్వం కోల్పోయిన మహిళలకు 50 చీరలతో పాటు నిత్యావసర సరుకులైన బియ్యం, పప్పులు, అరటి పళ్ళు పంపిణీ చేశారు. పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా రేష్మిత మాట్లాడుతూ.. తన వంతుగా కొందరు బాధితులకు సాయం అందించానని అన్నారు.
విశాఖ నగరానికి చెందిన ఓ మహిళకు హైదరాబాద్కు చెందిన నిందితుడు రాహుల్ గిరి గోస్వామి కాల్ చేసి మీ మీద మనీ లాండరింగ్ కేసు ఉందని రూ.37 లక్షలు ట్రాన్స్ఫర్ చేయకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరించాడు. మహిళ భయపడి అకౌంట్కి రూ.37 లక్షలు ట్రాన్స్ఫర్ చేసింది. మోసపోయానని గ్రహించిన ఆమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత భాగ్చీ తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి తొలి డాక్టరేట్ అందుకున్న సర్వేపల్లి రాధాకృష్ణన్.. 1931లో అదే వర్సిటీకి రెండో ఉపకులపతిగా వచ్చారు. 1931 నుంచి 1936 వరకు 5 సంవత్సరాలు సేవలు అందించారు. కేవలం 4 విభాగాలతో ప్రారంభమైన ఏయూను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎంతో కృషి చేశారు. ఆయన హయాంలో విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ గ్రహీత సీవీ రామన్ వంటి వారు ఏయూను సందర్శించడమే కాకుండా కొద్ది రోజులు ఇక్కడ ఉండడం విశేషం.
ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక టార్చ్ బేరర్లా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునేందుకు ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరిస్తున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
ఓ యువకుడికి 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి ఆనందిని తీర్పునిచ్చారు. పెద్ద అగనంపూడిలో నివాసం ఉంటున్న బాలిక (13) 2021లో ఓ అపార్ట్మెంట్ పైనుంచి కిందపడి మృతిచెందింది. ఈ కేసులో ఎదురు అపార్ట్మెంట్లో ఉంటున్న విజయనగరం జిల్లాకు చెందిన నరేశ్(28)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమపేరుతో బాలికను పలుమార్లు లోబర్చుకున్నట్లు విచారణలో తేలడంతో పైవిధంగా శిక్ష విధించారు.
విశాఖ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా కాసేపటికే తిరిగి వెనక్కి వచ్చింది. బుధవారం విశాఖ నుంచి హైదరాబాద్కు విమానం బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి తీసుకువచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం సవరించిన తర్వాత విమానం బయలుదేరింది.
దులీప్ ట్రోఫీ తొలిదశ మ్యాచ్లు గురువారం నుంచి బెంగళూరు, అనంతపురంలో ప్రారంభం కానున్నాయి. ఈ టోర్నమెంటులో విశాఖకు చెందిన భరత్, నితీశ్ కుమార్ రెడ్డి, రికీబుయ్ సత్తా చాటేందుకు సిద్ధం అవుతున్నారు. నితీశ్ IPLలో బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ రాణించారు. భరత్కు భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. రికీబుయ్ అంతర్జాతీయ క్రికెట్ ఆడుతూ బ్యాటింగ్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారు.
వరద ముంపు బాధితులకు అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ బాసటగా నిలిచారు. విజయవాడ బాధితులకు సీఎం రమేశ్ కుటుంబం కోటి రూపాయల విరాళం ప్రకటించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోలుకోలేని విధంగా నష్టం జరిగిందన్నారు. సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71,500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు, 80,000 వాటర్ బాటిళ్లతో పాటు 48,500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. ఈ ప్రక్రియను డీఆర్ఓ మోహన్ కుమార్ పర్యవేక్షించారు.
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ ఆదేశం మేరకు వరదల్లో చిక్కుకున్న బాదితులకు ఫుడ్ ప్యాకెట్లు పంపించినట్లు అధికారులు తెలిపారు. విశాఖ జిల్లా సమాఖ్య, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ 5000 ఆహార పొట్లాలు, 1800 మంచినీళ్ళ బాటిల్లు, 3000 టెట్రా పాల పేకెట్లు, 2000 బిస్కట్ పాకెట్లు సిద్ధం చేసి రెండు లారీలలో పంపించామన్నారు. బుధవారం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వాటిని అధికారులు అందుకున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.