Visakhapatnam

News April 4, 2025

విశాఖ: 20 బైక్‌లు సీజ్

image

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు 20 బైక్‌లను సీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు NAD, మద్దిలపాలెం ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా మొదటిసారి దొరికిన వారి లైసెన్స్ 3 నెలలు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన వారి వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

News April 4, 2025

వీఎంఆర్డీఏలో 113 మందికి ప్లాట్ల కేటాయింపు

image

V.M.R.D.A. అధికారులు ఎంఐజి లే అవుట్లోని ప్లాట్లకు గురువారం డ్రా నిర్వహించారు. అడ్డూరు, గరివిడి, పాలవలసల్లో 113 మందికి ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయించారు. అడ్డూరులో 146, గరివిడిలో 212, పాలవలసలో 472 ప్లాట్లను V.M.R.D.A. అభివృద్ధి చేసింది. వీటిలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లాట్ల ధరలో 20 శాతం రాయితీ ఇస్తున్నారు.

News April 3, 2025

పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైలు: విశాఖ సీపీ

image

విశాఖ నగర పరిధిలో స్కూల్స్, కాలేజీలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. సీపీ కార్యాలయంలో గురువారం అధికారులతో సమావేశమయ్యారు. పొగాకు వల్ల రాష్ట్రంలో ప్రతి ఏడాది 48వేల మరణాలు సంభవిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో రోజుకి 250 మంది పిల్లలు పొగాకు వాడుతున్నారన్నారు. పిల్లలకు పొగాకు అమ్మితే ఏడేళ్లు జైళ్ళు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తామన్నారు.

News April 3, 2025

రికార్డు సృష్టించిన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్

image

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో సరుకు రవాణా చేసిందని జనరల్ మేజేజర్ పరమేశ్వర్ ఫంక్వాలా తెలిపారు. 259.254 మిలియన్ల టన్నుల సరకు రవాణ చేసి కొత్త బెంచ్‌మార్క్‌ను దాటిందని వెల్లడించారు. గతంలో ఉన్న 259 మిలియన్ల టన్నుల మార్కుని దాటిని దేశంలోని మొదటి రైల్వే జోన్‌గా ECoR అవతరించిందని పేర్కొన్నారు. 

News April 3, 2025

బ్యాంకు ప్రతినిధులతో విశాఖ కలెక్టర్ సమావేశం

image

స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు బ్యాంకులు పూర్తి స‌హ‌కారం అందించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. ప‌లువురు బ్యాంకు ప్ర‌తినిధుల‌తో గురువారం క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో సమావేశం అయ్యారు. రుణాల మంజూరులో సుల‌భ‌త‌ర విధానాలు పాటిస్తూ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని సూచించారు. స్వ‌యం ఉపాధి పొందాల‌నుకునే వారికి త‌గిన విధంగా అండ‌గా నిల‌వాల‌న్నారు.

News April 3, 2025

బాధ్యతలు చేపట్టిన విశాఖ బార్ అసోసియేషన్ సభ్యులు

image

విశాఖపట్నం బార్ అసోసియేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన వారు గురువారం బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడిగా విజయం సాధించిన ఎమ్.కె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు చింతపల్లి ఆనంద్ కుమార్, జనరల్ సెక్రటరీగా పార్వతి నాయుడు, కోశాధికారిగా శ్రీదివ్యష్ భాద్యతలు చేపట్టారు. బార్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. విజయం సాధించిన అధ్యక్ష, ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తామన్నారు. 

News April 3, 2025

మారికవలసలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

మధురవాడలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొమ్మాది సాయిరాం కాలనీకి చెందిన బలగ ప్రభాకర్ (50) మరో వ్యక్తితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. మారికవలస నేషనల్ హైవేపై లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక సీటులో కూర్చున్న ప్రభాకర్ లారీ చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ డ్రైవ్ చేస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతదేహాన్ని కేజీహెచ్‌కి తరలించారు.

News April 3, 2025

గాజువాకలో యాక్సిడెంట్

image

గాజువాకలో గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ సీఐ కోటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాకకు చెందిన లావేటి క్రాంతి కుమార్, శ్రీహరిపురానికి చెందిన వాసవి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకొని రుషికొండ నుంచి గాజవాక వస్తుండగా షీలా నగర్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు.

News April 3, 2025

విశాఖ: భర్త దాడిలో భార్య మృతి

image

విశాఖలో వివాహిత రమాదేవి చికిత్స పొందుతూ మృతిచెందింది. మాధవధారకు చెందిన రమాదేవి, బంగార్రాజు మధ్య గొడవలు జరగ్గా రమాదేవి పుట్టింటికి వెళ్లింది. గతనెల 30న బంగార్రాజు అక్కడికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బయలుదేరగా అడ్డగించి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను KGHకి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. నిందితుడిని టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 3, 2025

TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానం: డీఈవో

image

విశాఖ జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో TTC ట్రైనింగ్ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానించనున్నట్లు డీఈవో ప్రేమ్ కుమార్ బుధవారం తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 25లోపు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మే1 నుంచి జూన్ 11 వరకు ట్రైనింగ్ ఇవన్నున్నట్లు తెలిపారు. 18 నుంచి 45 సంవత్సరాల లోపు వారు అర్హులన్నారు. పూర్తి వివరాలు, అప్లికేషన్‌కు www.bse.ap.gov.inలో చెక్ చేయాలన్నారు. మే 1 నుంచి తరగతులు ప్రారంభం అవుతాయన్నారు.