Visakhapatnam

News August 15, 2025

విశాఖలో వెలిగిన స్వాతంత్ర్య దీపం.. తెన్నేటి విశ్వనాథం

image

స్వాతంత్ర్య ఉద్యమంలో జ్యోతి తెన్నేటి విశ్వనాథం కీలక పాత్ర పోషించారు. మహాత్మా గాంధీ పిలుపునకు స్పందించి సత్యాగ్రహంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాసేవకు అంకితమయ్యారు. విశాఖ ఎంపీగాను గెలుపొందారు. మద్రాస్ ప్రెసెడెన్సీ నుంచి విడిపోయాక ఆంధ్ర రాష్ట్రానికి ఆర్థిక న్యాయశాఖ మంత్రిగా పని చేశారు. ఉక్కు కర్మాగారం ఏర్పాటులో ఆయన కృషి నగర వాసులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

News August 15, 2025

విశాఖ: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి

image

విశాఖలో రెండు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. జ్ఞానాపురంలో నివాసం ఉంటున్న సత్యరాజ్ బైక్ పై మిత్రుడితో కలిసి ఫంక్షన్‌కు వెళ్లి ఇంటికి తిరిగివస్తుండగా డివైడర్‌ను ఢీకొట్టి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వేములవలస వద్ద అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సాయికుమార్ రోడ్డు దాటుతుండగా మినీ బస్సు ఢీకొని మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 15, 2025

స్వాతంత్ర్య దినోత్సవానికి విశాఖ సిద్ధం

image

విశాఖపట్నం పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటలకు మంత్రి అనగాని సత్యప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో 7 శకటాలు, 8 స్టాళ్లు, 52 మందితో కూడిన పోలీసుల పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వివిధ పథకాల లబ్ధిదారులకు మంత్రి రూ.214.99 కోట్ల ప్రోత్సాహకాలను పంపిణీ చేయనున్నారు.

News August 15, 2025

విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

image

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.

News August 14, 2025

విద్యుత్ కాంతులతో మెరిసిన కలెక్టరేట్

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబైంది. గురువారం మధ్యాహ్నం నుంచి అధికారులు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పురాతనమైన కలెక్టరేట్ భవనం విద్యుత్ కాంతుల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖద్వారం సైతం చూడముచ్చటగా అలంకరించారు. కలెక్టరేట్‌తో పాటు నగరంలోని ఇతర ప్రభుత్వ కార్యాలయాలను కూడా విద్యుత్ దీపాలతో అలంకరించారు.

News August 14, 2025

విశాఖ: రెండు రోజుల పాటు మాంసం విక్రయాలు బంద్

image

విశాఖ నగర పాలక సంస్థ పరిధిలోని మాంసం, చేపలు, చికెన్ దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి. నరేశ్ కుమార్ గురువారం తెలిపారు. జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఆదేశాల మేరకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం, కృష్ణాష్టమి సందర్భంగా శనివారం అన్ని మాంసం దుకాణాలను, జంతు వధశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని వ్యాపారులు గమనించాలని ఆయన సూచించారు.

News August 14, 2025

విశాఖ జిల్లాలో 165 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

News August 14, 2025

భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

News August 13, 2025

సాగర్ నగర్ బీచ్ సమీపంలో అపస్మారక స్థితిలో వ్యక్తి

image

ఆరిలోవ స్టేషన్ పరిధి సాగర్ నగర్ రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో బీచ్ దగ్గర పొదల్లో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. స్థానికులు 108 సమాచారం ఇవ్వగా కేజీహెచ్‌కి తరలించినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ మల్లేశ్వరరావు సూచించారు.

News August 13, 2025

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీపీ

image

విశాఖ వన్ టౌన్ ఏఆర్ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కవాతును సమీక్షించారు. జెండా వందనం, వందన సమర్పణ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాలరీలను పరిశీలించారు.