India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఓ పత్రికపై పరువు నష్టం దావా కేసులో మంత్రి లోకేశ్ నేడు విశాఖ కోర్టుకు హాజరుకానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ పేరుతో ఆ పత్రికలో గతంలో కథనాన్ని ప్రచురించారు. ఆ కథనంపై లోకేశ్ న్యాయపోరాటానికి దిగారు. ఈ క్రమంలో పరువునష్టం దావా వేయగా.. విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టులో వాదోపవాదనలు జరిగేవి. పలు కారణాలతో చాలా రోజులుగా వాయిదాలు పడిన ఈ కేసు విచారణ మళ్లీ ప్రారంభమైంది.
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి 32 మంది ఎంపికయ్యారు. ఈనెల 31నుంచి తిరుపతిలో జరగ నున్న పోటీలకు వీరంతా జిల్లా నుంచి పాల్గొంటారని తైక్వాండో అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. అదేవిధంగా ఉమెన్స్ లీగ్ పోటీలు కూడా అదే తేదీల్లో తిరుపతిలో జరగనున్నాయన్నారు. ఈనెల 27న గాజువాకలో జిల్లాస్థాయి కాడెట్ క్యొరుగి, పూమేసే పోటీల్లో పలువురు పతకాలు సాధించారన్నారు.
విశాఖ నగరానికి చెందిన వృద్ద దంపతులు లక్ష్మీనారాయణ, ఎండమ్మను వారి ఇద్దరు కుమారులు గతేడాది రోడ్డుపై వదిలేశారు. జీవీఎంసీ నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ మమత వీరిని వృద్ధాశ్రమంలో చేర్చారు. లక్ష్మీనారాయణ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. కాకినాడ, HYDలో ఉంటున్న ఇద్దరు కొడుకులకు సమాచారం అందించినా వారు స్పందించలేదు. దీంతో వృద్ధాశ్రమం నిర్వాహకులు లక్ష్మీనారాయణకు అంత్యక్రియలు జరిపించారు.
బచేలి, కిరండూల్ మార్గంలో భారీవర్షాల కారణంగా పలు రైళ్ల గమ్యాలను కుదించినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-కిరండూల్(08551) ప్రత్యేక పాసింజర్, విశాఖ-కిరండూల్ (18514) ఎక్స్ ప్రెస్ ఈనెల 29 నుంచి సెప్టెంబరు 4 వరకు దంతెవాడ వరకు నడుస్తాయన్నారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్-విశాఖ(08552) పాసింజర్, కిరండూల్-విశాఖ(18513) ఎక్స్ ప్రెస్ ఈనెల 30 నుంచి సెప్టెంబరు 5 వరకు దంతెవాడ నుంచి నడుస్తుందన్నారు
విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అన్ని న్యాయస్థానాల్లో వచ్చే నెల 14న జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ తెలిపారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు సివిల్ చెక్ బౌన్స్ బ్యాంకింగ్ మోటార్ ప్రమాదాల నష్ట పరిహారం కేసులు, తగదాలు తదితర వాటిని పరిష్కరించుకోవచ్చని అన్నారు. వివరాలకు 089-2560414 నెంబర్కు సంప్రదించాలని కోరారు.
విశాఖ ఉక్కు ఛైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ పదవికి సెప్టెంబర్ 3న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు తెలిపింది. ఉ.10 నుంచి 11 గంటల వరకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. ఇందుకు దుర్గాపూర్ స్టీల్ ప్లాంటులో ఈడీ(వర్క్స్)గా పని చేస్తున్న దిప్తెందు ఘోష్, ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ట్రావెన్కోర్ డైరెక్టర్ (ఫైనాన్స్) ఎస్. శక్తిమణి అనే ఇద్దరు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది.
కంచరపాలెంలో ఐటీఐ ప్రవేశాలకు సంబంధించిన మూడో విడత కౌన్సెలింగ్ గురువారం జరగనున్నట్లు ప్రభుత్వ పాత ఐటీఐ ప్రిన్సిపల్ జె.శ్రీకాంత్ తెలిపారు. గత రెండు విడతల్లో జరిగిన కౌన్సెలింగ్లో అన్ని సీట్లు భర్తీ చేయగా ఇంకా ఇరవై ఎనిమిది సీట్లు మిగిలాయని, వాటిని భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు చేసి, పత్రాలను ధ్రువీకరణ చేయించుకున్న అభ్యర్థులు అన్ని ఒరిజినల్ పత్రాలతో హాజరవ్వాలని ఆయన తెలిపారు.
సింగపూర్, మలేషియాలో సెప్టెంబర్ 22 నుంచి 30వ తేదీ వరకు అంతర్జాతీయ క్రీడా పోటీలు జరగనున్నాయి. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామానికి చెందిన పీవీఎం నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహితీ ఈ పోటీలకు ఎంపికయ్యారు. నాగజ్యోతి పవర్ లిఫ్టింగ్, సాహితీ స్విమింగ్ పోటీల్లో పాల్గొననున్నారు. వీరిద్దరూ విజయాలను అందుకొని రాష్ట్రానికి తిరిగి రావాలని పలువురు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రావణ మాసం 4వ శుక్రవారం సందర్భంగా సింహాచలంలో 30వ తేదీన సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించనున్నట్లు ఈవో శ్రీనివాసమూర్తి తెలిపారు. మహిళలందరూ కలిసి పూజ చేసుకోవడానికి దేవస్థానం అవకాశం కల్పిస్తోందన్నారు. పూజకు అవసరమైన సామగ్రి, పసుపు, కుంకుమ, విడి పువ్వులు, పత్రి ఉచితంగా అందజేస్తామని చెప్పారు. పూజకు వచ్చే మహిళలకు కొండ దిగువ నుంచి పైకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు.
విశాఖ వేదికగా సర్యులర్ ఎకానమీ- పాలసీ టు ఇంప్లిమెంటేషన్ పేరుతో జాతీయ స్థాయి వర్క్ షాప్ గురువారం జరగనుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ బుధవారం పర్యవేక్షించారు. సిటీలోని నోవాటెల్ హోటల్లో జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఈ సదస్సులో సుమారు 150 మంది ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు.
Sorry, no posts matched your criteria.