India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు పరిష్కారం చూపాలని కలెక్టర్ హరేంద్రప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వినతులు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 313 వినతులు అందాయి. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందినవి 130, జీవీఎంసీకి సంబంధించి 82, పోలీసు విభాగానికి చెందినవి 15 ఉండగా ఇతర విభాగాలకు చెందిన ఫిర్యాదులు 86 ఉన్నాయి.
కైలాసగిరిపై నూతనంగా నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి అతి త్వరలో అందుబాటులోకి తీసుకువస్తామని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ కె.ఎస్ విశ్వనాథన్ వెల్లడించారు. సోమవారం కైలాసగిరిపై నిర్మాణంలో ఉన్న గ్లాస్ బ్రిడ్జి పనులు పరిశీలించారు. ఆసియాలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం కైలాసగిరిపై జరుగుతోందన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు.
జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు 113 వినతులు వచ్చాయి. ఈ వినతులను జీవీఎంసీ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ కమిషనరు కేతన్ గార్గ్తో కలిసి తీసుకున్నారు. ఇందులో జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి 4, రెవెన్యూ 8, ప్రజారోగ్యం 7, పట్టణ ప్రణాళిక 67, ఇంజినీరింగు 22, యుసిడి 5 మొత్తంగా 113 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
విశాఖపట్నం కలెక్టరేట్లో సోమవారం (ఆగస్టు 11, 2025) ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరించబడతాయి. అదే విధంగా, సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.
సెప్టెంబర్ 14న విశాఖలో గాదిరాజు ప్యాలెస్లో ‘నేషనల్ డాగ్ షో’ నిర్వహించనున్నట్లు విశాఖ కెన్నెల్ అసోసియేషన్ సెక్రటరీ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆర్ & బి జంక్షన్ వద్ద ఆదివారం పోస్టర్ ఆవిష్కరించారు. ఈ డాగ్ షోలో దేశం నలుమూలల నుంచి ఊటి, కోడాయికెనాల్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కోల్కతా, జార్ఖండ్, చత్తీస్ఘడ్ వంటి వివిధ ప్రదేశాల నుంచి 50 జాతులు, 300 శునకాలు పాల్గొంటాయన్నారు.
గాజువాక సమీపంలో జగ్గు జంక్షన్ కర్నవాణిపాలెం వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ను ట్రాలర్ ఢీకొట్టిన ఘటనలో ఏ.మోహన్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు గాజువాక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు అదే ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.
విశాఖలోని పలు హోటల్స్, రెస్టారెంట్లపై సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. కమర్షియల్ సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లను వాడుతున్నట్లు గుర్తించి 44 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరిపై 6ఏ కేసులు నమోదు చేస్తున్నట్లు సివిల్ సప్లై అధికారులు తెలిపారు. వ్యాపారులు డొమెస్టిక్ సిలిండర్లు వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల్లో KGHకి ఎటువంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ వాణి స్పష్టం చేశారు. ఈ అక్రమాల్లో KGH, ఆంధ్రా మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ఇద్దరు డాక్టర్ల ప్రమేయం ఉందని మీడియా కథనాల ద్వారా తనకు తెలిసిందన్నారు. దీనిపై ఇంత వరకూ అధికారిక సమాచారం అందలేదని చెప్పారు. ప్రస్థుతం ఈ కేసుపై తెలంగాణ పోలీసులు విచారణ చేస్తున్నారని, డాక్టర్ల ప్రమేయం ఉందని తేలితే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
విశాఖ నుంచి బయలుదేరే పలు రైళ్లు రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం సందీప్ శనివారం తెలిపారు. విశాఖ-రాయపూర్ పాసింజర్ (58527/28), విశాఖ – కోరాపూట్ పాసింజర్ (58537/38), విశాఖ – భవానిపట్నం పాసింజర్ (58503/04)ను ఆగస్టు 19 నుంచి 28 వరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.