India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో గడిచిన 24 గంటల్లో 165.2 మి.మీల వర్షపాతం నమోదయింది. అత్యధికంగా పద్మనాభం మండలంలో 51.4mm, అత్యల్పంగా ములగడలో 5.6mm వర్షపాతం నమోదయింది. పెందుర్తిలో 18.2, భీమునిపట్నంలో 14.2 మి.మీ వర్షపాతం కురిసింది. రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా కలెక్టర్ హరేంధీర ప్రసాద్ గురువారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని మండలాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా నియంత్రించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా లీకేజీలు సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

ఆరిలోవ స్టేషన్ పరిధి సాగర్ నగర్ రాడిసన్ బ్లూ హోటల్ సమీపంలో బీచ్ దగ్గర పొదల్లో ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో పడి ఉన్నట్లు ఆరిలోవ పోలీసులు తెలిపారు. స్థానికులు 108 సమాచారం ఇవ్వగా కేజీహెచ్కి తరలించినట్లు వెల్లడించారు. ఆ వ్యక్తి పాయిజన్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. ఈ వ్యక్తి బంధువులు ఎవరైనా ఉంటే ఆరిలోవ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సిఐ మల్లేశ్వరరావు సూచించారు.

విశాఖ వన్ టౌన్ ఏఆర్ గ్రౌండ్స్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను సీపీ శంఖబ్రత బాగ్చీ పరిశీలించారు. వీవీఐపీ భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది కవాతును సమీక్షించారు. జెండా వందనం, వందన సమర్పణ పరిశీలించారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రముఖులు, స్వాతంత్ర సమరయోధులు, అధికారులు, ప్రజలు కూర్చునే గ్యాలరీలను పరిశీలించారు.

VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్పై ఛలో రుషికొండ కార్యక్రమంలో పోలీసులు పెట్టిన కేసులు విశాఖ జిల్లా కోర్టు జడ్జి ప్రదీప్ కుమార్ కొట్టివేశారు. వైసీపీ ప్రభుత్వం హయంలో ఛలో రుషికొండ కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. అప్పట్లో TNSF రాష్ట్ర అధ్యక్షుడిగా రుషికొండ వెళ్లి నిరసన తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు శోభన్ బాబు, పార్థసారథి వాదనలు వినిపించారు.

భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ బుధవారం అప్రమత్తం చేశారు. సచివాలయ సిబ్బంది సెక్రటరీలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలకు సరిపడా మందుల నిలువను ఉంచాలని డిఎంహెచ్ఓకు కలెక్టర్ ఆదేశించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా ఉండాలని, వారికి పునరావస కేంద్రాలను ఏర్పాటు చేయాలని తహశీల్దార్లకు సూచించారు. బస్సులర పర్యవేక్షణ చేయాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

విశాఖను మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చుదిద్దదామని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ పిలుపునిచ్చారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రతిజ్ఞలో భాగంగా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి అధికారులు, సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. యువత పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్య నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని కోరారు.

జిల్లాలోని ఎన్టీఆర్ గృహ నిర్మాణ లేఅవుట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై కలెక్టర్ హరేంధీర ప్రసాద్ బుధవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్లను వేగంగా పూర్తి చేయాలన్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని సూచించారు. కాంట్రాక్టుల పనితీరుపై సమీక్షించారు.

స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విజయవాడలోని(గవర్నర్ బంగ్లా)లో జరగనున్న కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా శ్రీకాకుళానికి చెందిన అంతర్జాతీయ వాలీబాల్ ఛాంపియన్ అట్టాడ చరణ్కు ఆహ్వానం అందింది.
ప్రస్తుతం అట్టాడ చరణ్ విశాఖపట్నం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) అకాడమీలో శిక్షణ పొందుతూ గాజువాక వడ్లపూడిలో నివాసం ఉంటున్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఆహ్వానం లెటర్ను చరణ్కు అందజేశారు.

ఆధార్ సీడింగ్ లోపాలను సరిదిద్దాలని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక (C.G.R.F)
ఛైర్మన్ సత్యనారాయణ ఆదేశించారు. కన్సూమర్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.వెంకటరమణ ఫిర్యాదుపై మంగళవారం వర్చువల్ విచారణ జరిగింది. విచారణలో ఫిర్యాదుదారు వెంకటరమణ మాట్లాడుతూ.. ఆధార్ సీడింగ్ పొరపాట్లు వల్ల పలువురు పేదలు ప్రభుత్వ పథకాలు కోల్పోతున్నారని తెలిపారు.
Sorry, no posts matched your criteria.