India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఒకే సమస్యపై ప్రజల నుంచి పదేపదే వచ్చే వినతులపై లోతైన విశ్లేషణ అవసరమని విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వస్తున్న ఫిర్యాదులు, అధికారులు తీసుకుంటున్న చర్యలపై కలెక్టరేట్లో సోమవారం సమీక్ష చేశారు. పలు అంశాలపై కలెక్టర్ చర్చించారు. నాణ్యమైన పరిష్కారం చూపాల్సిన బాధ్యత అధికారులందరిపైనా ఉందన్నారు.
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల బ్యాలెట్ పత్రాలు విశాఖ జిల్లాకు సోమవారం చేరుకున్నాయి. ఓటర్లు, పోలింగ్ కేంద్రాలు, పోటీ చేసే అభ్యర్థుల ఫోటోలు, ఇతర వివరాలతో కూడిన నివేదికలను స్థానిక అధికారులు ఇప్పటికే పంపించారు. సంబంధిత బ్యాలెట్ పత్రాలను కర్నూలులో ప్రింటింగ్ చేశారు. ఈ పత్రాలు విశాఖకు సోమవారం చేరుకున్నాయి.
విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి విదేశాలకు చౌకగా విమానాల్లో ప్రయాణించేలా ఎయిర్ ఏషియా సంస్థ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. జీరో బేస్ ఫేర్ పేరుతో విశాఖ నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్కు ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. ఈ ఏడాది జులై 1 నుంచి 2026 జూన్ 15 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.
విశాఖ KGHలో ఓ వృద్ధురాలు గుండెపోటుతో చనిపోయిందని సూపరింటెండెంట్ శివానంద్ చెప్పారు. ‘విజయనగరం(D) L.కోట మండలానికి చెందిన వృద్ధురాలు(63) గుయిలెయిన్-బారే సిండ్రోమ్(జీబీఎస్) అనుమానాస్పద లక్షణాలతో ఫిబ్రవరి 6న KGHలోచేరారు. ఆమెకు షుగర్, బీపీ ఉన్నాయి. మేం అందజేసిన చికిత్సతో కాస్త కోలుకున్నారు. ఇవాళ ఛాతీ నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. గుండెపోటుతో చనిపోయినట్లు తేలింది. ఆమె GBSతో చనిపోలేదు’ అని ఆయన తెలిపారు.
దువ్వాడలోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థులు కొట్లాటకు దిగారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. కాలేజీలో జరుగుతున్న ఈవెంట్లో డాన్స్ చేస్తున్న సమయంలో వివాదం తలెత్తింది. సెకండియర్ విద్యార్థి ప్రదీప్ కాలు పొరపాటున థర్డ్ ఇయర్ విద్యార్థి సూర్యాకు తగిలింది. దీంతో ఆగ్రహానికి గురైన సూర్యాతో పాటు అతని స్నేహితులు.. ప్రదీప్, అతని ఫ్రెండ్ ఈశ్వర్పై దాడి చేశారు.
గాజువాకకు చెందిన కర్రీ సాయికిరణ్(17) పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ అదుపుతప్పి బండరాయిను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. G.మాడుగుల(M) గుదలం వీధి మలుపు వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో పోలీసుల సహాయంతోనే పాడేరు తరలించారు. అక్కడి నుంచి కేజీహెచ్కు తీసుకొస్తుండగా మృతి చెందినట్లు తెలిపారు. సాయి కిరణ్ మృతితో చైతన్య నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
విధి నిర్వహణలో సామాజిక బాధ్యతతో వ్యవహరించిన పెట్రోలింగ్ పోలీసులు పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఆదివారం రాత్రి భీమిలి బీచ్ రోడ్డులో తిమ్మాపురం నుంచి రామానాయుడు స్టూడియో మధ్యలో లారీ నుంచి మట్టి జారి రోడ్డు మధ్యలో పడింది. దీనిని గమనించిన బీచ్ పెట్రోల్ కానిస్టేబుళ్లు సతీశ్, గణేశ్ వెంటనే స్పందించి మట్టిని తొలగించారు. అటుగా ప్రయాణిస్తున్న వాహనదారులకు జాగ్రత్తగా వెళ్లమని సూచించారు.
జిల్లాలో కూరగాయల దిగుబడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. కూరగాయలు దిగుబడి ఎక్కువగా ఉండి మద్దతు ధర లేకపోవడంతో రైతుల అవస్థలు పడుతున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో మార్కెటింగ్ చేయక సహాయ సహకారాలతో రైతులు నేరుగా దగ్గరలోని రైతు బజార్లో తమ కూరగాయలు విక్రయించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు.
వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి లైంగికంగా తనను వేధిస్తున్నాడంటూ 2023లో పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఓ యువతి పెబ్బిలి రవికుమార్పై ఫిర్యాదు చేసింది. వెంటనే అతను హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్నాడు. అయితే ఇటీవల పెందుర్తి పోలీసులు రిట్ పిటిషన్ వెయ్యగా బెయిల్ రద్దవ్వడంతో అతనిని శనివారం అరెస్టు చేసినట్లు ఏసీపీ సాయి పృథ్వీ తేజ తెలిపారు. రవికుమార్ ప్రస్తుతం ఏపీ బీసీ సమైక్య అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు.
విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఫేక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇబ్బందులు పెడుతున్న వ్యక్తిని శనివారం రిమాండ్కు పంపించారు. నగరానికి చెందిన ఓ మహిళకు ఫేక్ ఇన్స్టా ద్వారా తన ఫేస్తో అశ్లీలంగా మార్ఫ్ చేసిన ఫొటోస్ వచ్చాయి. న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే ఫొటోస్ ఫార్వార్డ్ చేస్తానని బెదిరించాడు. బాధితురాలి ఫిర్యాదుతో కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించి అరెస్ట్ చేశారు.
Sorry, no posts matched your criteria.