Visakhapatnam

News July 18, 2024

సింహాచలం గిరి ప్రదక్షిణ.. రూట్ మ్యాప్ ఇదే

image

ఈనెల 20న జరిగే సింహాచలం గిరి ప్రదక్షిణ తొలి పావంచ వద్ద మొదలుపెట్టి.. అడవివరం-ధారపాలెం-ఆరిలోవ-హనుమంతువాక-పోలీసు క్వార్టర్స్- కైలాసగిరి టోల్ గేట్- అప్పుఘర్ జంక్షన్- MVPడబుల్ రోడ్-వెంకోజీపాలెం- HB కాలనీ-కైలాసపురం-మాధవధార-మురళీనగర్-బుచ్చిరాజుపాలెం-లక్ష్మీ నగర్-ఇందిరా నగర్- ప్రహ్లాదపురం-గోశాల జంక్షన్-తొలి పావంచ మీదుగా సింహాచలం మెట్ల మార్గం చేరుకోవాలి. సుమారు 32 కిలోమీటర్ల ప్రదక్షిణ చేయాలి. >Share it

News July 18, 2024

రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం: గుడివాడ

image

APలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ఆరోపించారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు స్వేచ్ఛగా రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు, నాయకులపై కూటమి శ్రేణులు చేస్తున్న దమనకాండ రోజురోజుకు మితిమీరిపోతుందన్నారు. దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలతో రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితి దిగజారిపోయిందని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.

News July 18, 2024

ఏయూ ఇన్‌ఛార్జ్ వీసీగా శశి భూషణరావు

image

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ ఉపకులపతిగా ఈసీఈ విభాగం సీనియర్ ఆచార్యులు జి.శశిభూషణరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఏయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఆచార్య శశిభూషణరావు ఏయూ పాలకమండలి సభ్యునిగా పనిచేశారు. రక్షణ రంగ సంబంధ పరిశోధనలో శశిభూషణ్ రావు నిష్ణాతులు.

News July 18, 2024

సింహాచలం గిరి ప్రదక్షిణకు అనువంశిక ధర్మకర్తకు ఆహ్వానం

image

ఈ నెల 20వ తేదీన ప్రారంభం కానున్న సింహగిరి ప్రదక్షిణ ఉత్సవానికి హాజరు కావాలని ఆలయ అనువంశిక ధర్మకర్త, మాజీ మంత్రి అశోక గజపతి రాజును దేవస్థానం ఈవో శ్రీనివాసమూర్తి ఆహ్వానించారు. ఈ మేరకు విజయనగరంలోని అశోక్ బంగ్లాలో ఆయనను కలిసి ఉత్సవ ఏర్పాట్లను వివరించారు. అలాగే ఆషాఢ పౌర్ణమి సందర్భంగా 21న ఆలయంలో జరిగే చందన సమర్పణ వైదిక కార్యక్రమాలను తెలియజేశారు.

News July 18, 2024

KGHలో ఓపి తీసుకోవాలంటే ఈ యాప్ తప్పనిసరి

image

KGHలో వైద్యానికి వచ్చేవారికి abha యాప్ తప్పని సరి చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యాప్‌లో తమ వివరాలు నమోదు చేసుకుంటే మొబైల్ ఫోన్ ద్వారా టోకెన్ వస్తుంది. టోకెన్ నంబర్ చెబితే కౌంటర్‌లో ఓపి సీట్ ఇస్తారు. మొబైల్ ఫోన్ లేనివారు ఆధార్ కార్డుతో డైరెక్టుగా ఓపి తీసుకోవచ్చు. మొబైల్ యాప్ వినియోగం తెలియని వారికి స్థానికంగా స్టాఫ్ నర్సులు సహాయం అందిస్తారు.

News July 18, 2024

విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా

image

విశాఖ ఉక్కు డైరెక్టర్ సురేశ్ చంద్ర పాండే తన పదవికి రాజీనామా చేశారు. 13 నెలల క్రితం భాధ్యతలు చేపట్టిన ఆయన అనేక వివాదాస్పద నిర్ణయాలతో కర్మాగానికి, కార్మికులకు ఇబ్బందులు కలిగించారని ఆరోపణ ఎదుర్కొన్నారు. కార్మిక నాయకులు ఉక్కు మంత్రిత్వ శాఖకు దీనిపై ఫిర్యాదులు చేశారు. ఈ నెల 19న స్టీల్ సెక్రటరీ, సీఎండీ కలిసి దీనిపై నివేదికను ఢిల్లీ బోర్డుకు పంపాల్సి ఉంది. అంతలోనే ఆయన రాజీనామా చేశారు.

News July 18, 2024

సింహాచలంలో ఆర్జిత సేవలు రద్దు

image

ఆషాఢ పౌర్ణమి పురస్కరించుకొని ఈనెల 20,21 తేదీల్లో సింహాచలంలో జరిగే సుప్రభాత సేవ, ఆరాధన, నిత్య కళ్యాణం, అష్టోత్తరం, సహస్రనామార్చన వంటి ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. ఈ తేదీలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి దర్శనానికి తరలి రానున్న నేపథ్యంలో నీలాద్రి ద్వారం నుంచి మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

News July 18, 2024

విశాఖ: పెరిగిన టమాటా ధర..

image

విశాఖలో టమాటా రేటు మరోసారి భారీగా పెరిగింది. వారం క్రితం కిలో రూ.40 కి విక్రయించిన టమాటా బుధవారం ఒక్కసారిగా కిలో రూ.67కి చేరింది. బయట మార్కెట్‌లో మరింత పెరిగి కిలో రూ.100 వరకు విక్రయిస్తున్నారు. మదనపల్లి మార్కెట్ ‌కు తక్కువ మొత్తంలో టమాటా రావడం వల్ల ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం రాయితీపై టమాటాను రైతు బజార్‌లలో విక్రయించాలని వినియోగదారులు కోరుతున్నారు.

News July 18, 2024

విశాఖ: నిందితుడి ఫొటో విడుదల చేసిన పోలీసులు

image

పెదగంట్యాడ మండలం గొంతినవానిపాలెం యువతిపై దాడికి పాల్పడ్డ సిద్దు ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. సిద్దు చేసిన దాడిలో యువతి తల్లి గాయపడి చికిత్స పొందుతోంది. గాజువాక పీఎస్‌లో క్రైమ్ నంబర్ 239/2024 పోక్సో కేసులో నిందితుడు సిద్దు జైలుకు వెళ్లి వచ్చాడు. పరారీలో ఉన్న నిందితుడి సమాచారం తెలియజేయాలని పోలీసులు కోరారు. న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్ సీఐ 9440904309 నంబర్‌కి సమాచారం ఇవ్వాలన్నారు.

News July 18, 2024

అగనంపూడి వద్ద మళ్లీ టోల్‌గేట్ ఏర్పాటు ?

image

అగనంపూడి వద్ద టోల్‌గేట్ మళ్లీ ప్రారంభించేందుకు నేషనల్ హైవే అథారిటీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ టోల్‌గేట్‌ని తొలగించాలంటూ స్థానికులు కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నారు. తాజాగా టోల్ వసూలుకు టెండర్‌లను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారింది. ఏడాదికి రూ.81 కోట్ల వరకు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. ఈ నిర్ణయం పై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.