India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రా-ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి నీరు అందించే డుడుమ జలాశయ నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 2,590 అడుగులు కాగా.. బుధవారం సాయంత్రానికి 2,586 అడుగులుగా నమోదయింది. ప్రస్తుతం సరిహద్దు గ్రామాల్లో విస్తారంగా వర్షాలు పడుతుండడంతో డుడుమ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది.
అచ్యుతాపురం ఎస్ఈజెడ్ వసంత కెమికల్స్ కంపెనీ బ్లాక్-6లో బుధవారం ఉదయం 8.15 గంటలకు హలార్ కోటెడ్ ఆటో క్లేవ్<<13645975>> రియాక్టర్ పేలడం<<>> వలనే ప్రమాదం జరిగిందని అనకాపల్లి కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఒడిశాకు చెందిన ప్రదీప్ రౌత్ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మృతుడు కుటుంబానికి రూ.35 లక్షలు నష్టపరిహారం చెల్లించేందుకు కంపెనీ అంగీకరించిందన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. విశాఖ వైసీపీ ఆఫీసులో బుధవారం సాయంత్రం ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ముచ్చుమర్రిలో బాలిక అదృశ్యమై 12 రోజులు అవుతున్నా ఇప్పటికి మృతదేహం ఆచూకీ లభించలేదన్నారు. దిశ యాప్ను కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు.
ఏయూ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ ప్రక్రియలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువు జులై 25వ తేదీ వరకు పొడిగించారు. స్పెషల్ కేటగిరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జులై 23 నుంచి 25 వరకు జరుగుతాయి. కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్స్ నమోదు జులై 26 నుంచి 29 వరకు ఉంటుంది. వెబ్ ఆప్షన్ మార్చుకోవడానికి ఈనెల 30న అవకాశం ఇచ్చారు. ఆగష్టు 3న సీట్ల కేటాయింపు ఉంటుంది.
విశాఖ రేంజ్ డీఐజీగా బుధవారం బాధ్యతలు స్వీకరించిన గోపీనాథ్ జెట్టిని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఎం.దీపిక మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె అనకాపల్లి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే విశాఖ వెళ్లి డీఐజీతో భేటీ అయ్యారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఐజీ ఆదేశించారు.
విశాఖ రేంజ్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా గోపీనాథ్ జెట్టిని విశాఖ రేంజ్ డీఐజీగా బదిలీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన తొలుత సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దర్శించుకుని అనంతరం లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. 2008 బ్యాచ్కు చెందిన జెట్టి గతంలో చింతపల్లి ఏఎస్పీగా విధులు నిర్వహించారు.
సింహాచలం అప్పన్న స్వామి గిరి ప్రదక్షిణ ఈనెల 20న ప్రారంభం కానుంది. 32 కి.మీ. మేర జరిగే ఈ ప్రదక్షిణలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. 11 మెడికల్ క్యాంపులు, 290 తాత్కాలిక, 169 శాశ్వత మరుగుదొడ్లు, 100 సీసీ కెమెరాలు అమర్చారు. ప్రధాన కూడళ్లలో అంబులెన్సులను సిద్ధం చేస్తున్నారు. సమాచారం తెలిపేలా అనౌన్స్మెంట్ సిస్టం అందుబాటులో ఉంచారు.
తిరునల్వేలి -షాలిమార్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం కే.సందీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18, 25 తేదీల్లో తిరునల్వేలిలో రాత్రి 1.50 గంటలకు బయలుదేరి దువ్వాడ మీదుగా షాలిమార్ వెళుతుందన్నారు. షాలిమార్-తిరునల్వేలి ఈనెల 20, 27 తేదీల్లో షాలిమార్లో సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు దువ్వాడ మీదగా తిరునల్వేలి వెళ్తుందన్నారు.
ఎస్ఈజెడ్లో జరిగిన <<13645446>>అగ్ని ప్రమాదంపై<<>> హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అగ్నిప్రమాద సంఘటనపై ఆరా తీశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్కు ఫోన్ చేసి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించాలని ఆమె ఆదేశించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో అప్పికట్ల-నిడుబ్రోలు-చుండూరు స్టేషన్ల మధ్య 3వ లైన్కు సంబంధించిన నాన్ ఇంటర్ లాకింగ్, ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రీ షెడ్యూల్ చేసినట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం కె. సందీప్ తెలిపారు. మరికొన్ని దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని బయలుదేరే సమయాలు మార్పు చేయనున్నట్లు తెలిపారు. ఆ మార్గంలో నడిచే పలు రైళ్లు గంటన్నర, రెండు గంటలు ఆలస్యంగా నడుస్తాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.