Visakhapatnam

News February 12, 2025

రూ.4కోట్లతో సింహాచలం ఆలయ పైకప్పుకు మరమ్మతులు 

image

సింహాచలంలో దేవాలయం పైకప్పు వర్షపు నీటి లీకేజీ నివారణ ప్రాజెక్టు ఒప్పందం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసురావు పాల్గొన్నారు. పుణేకు చెందిన కంపెనీ పనులు చేయడానికి ముందుకు వచ్చింది. 9 నెలల్లో రూ.4కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తి చేయనున్నారు. దేవాలయ కట్టడాలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా సున్నం, అరబిక్ చెట్ల జిగురు, బెల్లం, జనపనార మిశ్రమాన్ని వాడి లీకేజీలు నివారిస్తామన్నారు.

News February 12, 2025

విశాఖ: వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష

image

కేంద్ర పాపులేషన్ రీసెర్చ్ సెంటర్ కేంద్ర బృందం డాక్టర్ పాదాలు, రమణ మంగళవారం విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. సిబ్బంది, అధికారుల పని తీరు సమీక్ష చేసి పలు సూచనలు చేశారు. క్షేత్ర స్థాయి సిబ్బంది హాజరును పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో DMHO జగదీశ్వరరావు, ఆరోగ్య శాఖ సిబ్బంది ఉన్నారు.

News February 11, 2025

షీలానగర్-పోర్టు రోడ్డులో యాక్సిడెంట్ 

image

షీలానగర్-పోర్టు రోడ్డులో సైకిల్‌పై వెళ్తున్న వ్యక్తిని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాకకు చెందిన ఎం.నరసింహారావు సైకిల్‌పై టీ వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం టీ పట్టుకొని వెళ్తుండగా కారు వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలపై ఆరా తీశారు.

News February 11, 2025

విశాఖ: పదో తరగతి పరీక్షకు 29,997 మంది

image

విశాఖలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒక‌టో తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న‌ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ప‌టిష్ట ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా ఇన్ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు.మంగళవారం ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో మాట్లాడారు.విశాఖలో 134 కేంద్రాల్లో రెగ్యుల‌ర్ విద్యార్థులు 28,523, ఓపెన్ విద్యార్థులు 1,404 మొత్తం 29,997 మంది హాజ‌ర‌వుతున్నార‌ని డీఈవో ప్రేమ కుమార్ తెలిపారు.

News February 11, 2025

Share it: విశాఖలో పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు

image

పదో తరగతి అర్హతతో ఇండియన్ పోస్టల్‌శాఖలో ఉద్యోగాలకు <<15428846>>నోటిఫికేషన్ <<>>వచ్చింది. విశాఖ డివిజన్ పరిధిలో 9 ఖాళీలు ఉన్నాయి. ఆ పోస్టుల వివరాలు ఇవే..
➤ అనంతవరం(GDS ABPM)-ఓపెన్
➤ ఆరిలోవ(GDS ABPM)-EWS
➤ గాజువాక(DAKSEVAK)-ఓపెన్
➤ H.B కాలనీ(GDS ABPM)-ఓపెన్
➤ మజ్జివలస(GDS BPM)-ఓపెన్
➤ పినగాడి(GDS BPM)-ఎస్టీ
➤ పొట్నూరు(GDS BPM)-ఓపెన్
➤ రాంపురం(GDS BPM)-ఎస్సీ
➤ సుజాతా‌నగర్(DAKSEVAK)-ఓపెన్

News February 11, 2025

గాజువాకలో గంజాయి స్వాధీనం

image

కణితి రోడ్డులోని ఓ ఇంట్లో గంజాయి ఉన్నట్లు సమాచారం అందడంతో గాజువాక పోలీసులు మంగళవారం తనిఖీలు చేసినట్లు విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ఈ తనిఖీలలో 184 కేజీల గంజాయి, ఒక కారు, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని 8 మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఇమ్రాన్ ఖాన్, అర్జున్ కుమార్, కోరాడ బాలాజీ కృష్ణ, బిదేశి కుమార్ సాహు, దామా ఖరా, శుక్రమతం, రామచంద్ర సిషా, మనోజ్ ఖేముండు ఉన్నట్లు తెలిపారు.

News February 11, 2025

విశాఖ: ఉపాధ్యాయ MLC.. అందరూ అర్హులే

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి పోటీ చేసేందుకు నామినేష‌న్ వేసిన అభ్య‌ర్థులంద‌రి నామ ప‌త్రాలు ఆమోదం పొందాయి. ఎన్నిక‌ల అబ్జెర్వ‌ర్ నాయ‌క్ ఆధ్వ‌ర్యంలో విశాఖ క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ మంగ‌ళ‌వారం క‌లెక్ట‌రేట్‌లో ప‌రిశీల‌న ప్ర‌క్రియ‌ను నిర్వ‌హించారు. ప్ర‌మాణాల‌కు అనుగుణంగా అంద‌రి ప‌త్రాలు ఉండ‌టంతో 10 మంది అభ్య‌ర్థుల తాలూక‌ నామినేష‌న్ల‌ను ఆమోదించినట్లు రిట‌ర్నింగ్ అధికారి తెలిపారు.

News February 11, 2025

UPDATE: రీల్స్ పేరుతో పెళ్లి.. యువకుడిపై పోక్సో

image

ఓ బాలిక ఇన్‌స్టా‌గ్రామ్‌లో చేసిన రీల్‌కు లైక్ కొట్టి ట్రాప్ చేసిన యువకుడిని విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాటిచెట్లపాలెంకి చెందిన భార్గవ్ ఓ బాలిక రీల్‌కు లైక్ కొట్టి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు దగ్గరై పెళ్లి చేసుకోగా విషయం బాలిక తల్లిదండ్రులకు తెలిసింది. వారి ఫిర్యాదు మేరకు భార్గవ్‌పై పోక్సో కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి సోమవారం రిమాండ్ విధించారు.

News February 11, 2025

విశాఖ: రోడ్డుప్రమాదంలో యువతి మృతి

image

విశాఖలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి మృతిచెందింది. శ్రీకాకుళం(D) ఇచ్ఛాపురానికి చెందిన ఉషారాణి(22) స్నేహితుడు సిద్దూతో కలిసి ఓ ఫార్మా కంపెనీలో ఇంటెర్న్‌ చేస్తోంది. ఉషారాణికి కొరియర్ రాగా సిద్దూతో కలిసి బైక్‌పై ఆటోనగర్‌ వెళ్లింది. తిరిగి వస్తుండగా వెనుక నుంచి లారీ ఢీట్టడంతో ఉషారాణి కింద పడింది. ఆమె పైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు గాజువాక ట్రాఫిక్ CI కోటేశ్వరరావు తెలిపారు.

News February 11, 2025

విశాఖ: ఆన్‌లైన్ లోన్‌యాప్స్ ముఠా అరెస్ట్  

image

ఆన్ లైన్ లోన్ యాప్స్‌తో మోసాలకు పాల్పడుతున్న ముఠాను విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు సోమవారం అరెస్ట్ చేశారు. విశాఖలో ఓ సూసైడ్ కేసు విచారణలో భాగంగా లోన్ యాప్‌లో అప్పు తీసుకుని సమయానికి కట్టకపోవడంతో ఫొటోలు మార్ఫింగ్ చేసి వారు వేధించడం వల్ల చనిపోయినట్లు గుర్తించారు. ఈ విషయంపై విశాఖ పోలీసులు నిందితుడుని కర్నూలులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు.