India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్నేహితుడు బర్త్ డేకి గంజాయి తీసుకొస్తున్న విద్యార్థిని పోలీసులు అగనంపూడి వద్ద అరెస్టు చేశారు. చోడవరంకు చెందిన ఓ విద్యార్థి గాజువాకలో నివాసం ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు. చోడవరం నుంచి సిటీ బస్సులో కొద్దిపాటి గంజాయిని రవాణా చేస్తుండగా పోలీసులు అగనంపూడి వద్ద బస్సులో తనిఖీ చేశారు. విద్యార్థి బ్యాగును పరిశీలించగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
చింతపల్లి అదనపు ఎస్పీ కెపిఎస్.కిషోర్కు పదోన్నతి కల్పిస్తూ ఏలూరు ఎస్పీగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. చింతపల్లిలో మొదట ఏఎస్పీగా, తర్వాత అదనపు ఎస్పీగా రెండున్నర ఏళ్లపాటు చేశారు. కిషోర్ హయాంలో చింతపల్లి పరిసర నిరుద్యోగ యువతకు అనేక ఉపాధి అవకాశాల కోసం ప్రేరణ పేరుతో జాబ్ మేళాలు నిర్వహించారు. మావోయిస్టు కార్యకలాపాలు అణిచివేతలో కీలకంగా పాల్గొన్నారు.
విశాఖకు కొత్తగా ఇద్దరు డీప్యూటీ కమిషనర్ ఆఫీ పోలీసు(డీసీపీ)లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నూతన డీసీపీగా అజిత వెజెండ్ల నియమితులయ్యారు. ప్రస్తుతం ఆమె పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పనిచేస్తూ బదిలీపై విశాఖ రానున్నారు. అలాగే DCP-2గా తూహిన్ సిన్హా సిన్హాకు బాధ్యతలు అప్పగించారు. సిన్హా ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీగా ఉన్నారు. కాగా అజిత గతంలో విశాఖ SEB అధికారిణిగా పనిచేశారు.
విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కేజీహెచ్ను సందర్శించారు. ఈ సందర్భంగా పలు వార్డులను తనిఖీ చేసి పరిస్థితులను పరిశీలించారు. ఎమ్.ఆర్.ఐ స్కానింగ్ సెంటర్ను పరిశీలించి అక్కడ అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం కేజీహెచ్లో సమస్యలపై విభాగాధిపతులతో సమావేశం నిర్వహించారు. సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
విశాఖలో జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్స్లోకి ప్రవేశించిన వైజాగ్ వారియర్స్ విజయానికి చేరువలో ఉందని టీమ్ ఓనర్ పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్లో వైజాగ్ టీమ్ అసాధారణమైన నైపుణ్యం, అంకితభావం ప్రదర్శించినట్లు పేర్కొన్నారు. వైజాగ్ విశ్వసనీయత, హోదాను కాపాడుకోవడానికి వ్యక్తిగతంగా ఎంపిక ప్రక్రియలో తను పాల్గొన్నట్లు తెలిపారు.
అనకాపల్లిలో ఓ డ్యాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపెట్ట తలను కొరికివేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో పెటా సంస్థ (పీపుల్ ఫర్ ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్) ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నృత్య ప్రదర్శనలో జనసందోహం ముందు ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడి తలను తన పళ్లతో కొరికి చంపాడని, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ సంస్థ ఫిర్యాదు చేసింది.
కేజీహెచ్ను డిజిటలైజేషన్ చేయడంలో SBI రూ. 47 లక్షల సాయాన్ని అందించింది. సంస్థ సీఎస్సార్ నిధుల్లో వీటిని సమకూర్చింది. ఈ నిధులతో కేస్ సీట్లు, ల్యాబ్ పరీక్షలు నివేదికలను కంప్యూటరీకరణ చేస్తున్నారు. రానున్న ఆరు నెలల వ్యవధిలో రోగులకు సెల్ ఫోన్లకే ల్యాబ్ పరీక్షలు నివేదికలను పంపే విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి. శివానంద తెలిపారు.
విశాఖ వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఏపీఎల్ సీజన్-3లో భాగంగా శుక్రవారం క్వాలిఫైయర్-2 లో వైజాగ్ వారియర్స్ రాయలసీమ కింగ్స్ పై విజయం సాధించి టైటిల్ పోరుకు సిద్ధమైంది. వైజాగ్ వారియర్స్ ఆరు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయలసీమ కింగ్స్ 7 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శనివారం ఉత్తరాంధ్ర లయన్స్ తో ఫైనల్ కు వైజాగ్ వారియర్స్ తలపడనుంది.
అనకాపల్లి జిల్లాలో ఉన్న పరిశ్రమలలో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలను అమలు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ.. వివిధ రకాల చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జిల్లా యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.
విశాఖలో ఏపీ ప్రీమియర్ లీగ్ క్వాలిఫయర్-2 మ్యాచ్ వైజాగ్ వారియర్స్, రాయలసీమ మధ్య జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన వైజాగ్ వారియర్స్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 190 భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్కు దిగిన రాయలసీమ కింగ్స్ 13 ఓవర్లకు 98 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయింది. రాయలసీమ గెలవాలి అంటే 60 బంతుల్లో 115 రన్స్ చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఉత్తరాంధ్ర లయన్స్తో ఫైనల్ ఆడనుంది.
Sorry, no posts matched your criteria.