Vizianagaram

News April 8, 2025

వ్యవసాయ అనుబంధ రంగాల గ్రోత్ రేట్ పెరగాలి: కలెక్టర్

image

వ్యవసాయ అనుబంధ రంగాల్లో 12.97 శాతం ఉన్న వృద్ధి రేటును ఈ ఏడాదిలో 16.32 శాతానికి పెంచాలని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో వ్యవసాయ అనుబంధ అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడానికి వ్యవసాయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో వ్యవసాయాధికారులు మండల వారీగా కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించి పంపాలన్నారు.

News April 7, 2025

ఫోర్బ్స్ జాబితాలో GMR

image

ఫోర్బ్స్ 2025 ప్రపంచ కుబేరుల జాబితాలో రాజాంకు చెందిన గ్రంథి మల్లిఖార్జునరావు 1,219 స్థానంలో నిలిచారు. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో సంపన్న వ్యక్తి ఆయనే. ఏప్రిల్ 2 నాటికి ఆయన నికర సంపద 3.0 బిలియన్ డాలర్లు కాగా.. తన స్వగ్రామమైన రాజాంలో నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను సైతం ఏర్పాటు చేశారు. రాజాంలో విద్యాసంస్థలు, ఆసుపత్రి నిర్మించారు. ఎయిర్ పోర్టును GMR సంస్థనే నిర్మిస్తుంది.

News April 7, 2025

వినతులు స్వీకరించనున్న మంత్రి కొండపల్లి

image

విజయనగరం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వినతులు స్వీకరించనున్నట్లు మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. జిల్లాకు చెందిన ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతులు ఇవ్వాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను విడతల వారీగా పరిష్కారం చేయనున్నట్లు తెలిపారు.

News April 6, 2025

రామతీర్థంలో నేడు జరిగే కార్యక్రమాలు ఇవే..!

image

ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరొందిన రామ‌తీర్థంలోని శ్రీరామస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి యాగశాలలో అగ్ని ప్రతిష్ఠాపనం, గాయత్రీ రామాయణం, అష్టకలస స్నపన మహోత్సవం, ఉదయం 10.30 గంటలకు ముత్యాలు, తలంబ్రాలతో స్వామి వారి కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. సోమవారం 9 గంటలకు శ్రీ సీతారాముల పట్టాభిషేకాన్ని వైభవంగా నిర్వహిస్తారు.

News April 5, 2025

VZM: యువతిపై ఇద్దరు వ్యక్తులు కత్తితో దాడి

image

విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శివరాంలో యువతిపై ఇద్దరు యువకులు మాస్కులు వేసుకొని వచ్చి కత్తితో శనివారం దాడి చేశారు. యువతి గ్రామంలో ఇంటి వద్ద పనులు చేస్తుండగా ఇద్దరు యువకులు కత్తితో పొడిచి పారిపోయారు. గాయపడిన 18 ఏళ్ల యువతిని చీపురుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. గరివిడి పోలీసులు విచారణ చేపట్టారు.

News April 5, 2025

VZM: జిల్లాలో మూడు అన్న కాంటీన్లకు రాష్ట్ర స్థాయి ర్యాంక్‌లు

image

రాష్ట్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల నిర్వ‌హించిన క్యూఆర్ కోడ్ ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లో జిల్లాకు చెందిన మూడు అన్న క్యాంటీన్లు మెరుగైన ర్యాంకుల‌ను సాధించాయి. బొబ్బిలి ఆర్అండ్‌బీ ఆఫీసు స‌మీపంలోని అన్న క్యాంటీన్‌కు రాష్ట్ర‌ స్థాయిలో ఐదో స్థానం, విజ‌య‌న‌గ‌రం ప్ర‌కాశం పార్కులోని క్యాంటీన్‌కు ఏడో స్థానం, ఘోషా ఆసుప‌త్రిలోని అన్న క్యాంటిన్‌కు ప‌దో స్థానం ద‌క్కాయని కలెక్టర్ అంబేడ్కర్ శుక్రవారం తెలిపారు.

News April 5, 2025

బొండపల్లి: ఆన్‌లైన్ బెట్టింగ్.. ఏడుగురి అరెస్ట్

image

మండల కేంద్రమైన బొండపల్లిలో ఆన్‌లైన్ బెట్టింగ్ రాయుళ్లపై పోలీసులు శుక్రవారం రాత్రి దాడులు జరిపారు. ఏడుగురిపై కేసు నమోదు చేసి ఇద్దరిని వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై యు.మహేశ్ తెలిపారు. వారి వద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 5, 2025

విజయనగరం డిపోలో ఆర్టీసీ బస్సు చోరీ

image

విజయనగరం RTC డిపోలో ఉన్న హయ్యర్ బస్సును(AP35Y1229) ఈనెల 2న దొంగలు ఎత్తికెళ్లినట్లు బస్సు యజమాని సాగి కృష్ణమూర్తిరాజు 1టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చీపురుపల్లి-విజయనగరం మధ్య తిరిగే బస్సును ఈనెల 2న రాత్రి డిపో పార్క్ చేయగా.. మూడో తేది ఉదయం వచ్చేసరికి కనిపించలేదన్నారు. బస్సుకు తాళం ఉండటంతో ఎవరూ లేని సమయంలో దొంగలు ఎత్తికెళ్లినట్లు శుక్రవారం ఫిర్యాదు చేశారు. బస్సు డ్రైవర్‌ను విచారించినట్లు సమాచారం.

News April 5, 2025

మ‌రింత మెరుగ్గా అన్న క్యాంటీన్ల నిర్వ‌హ‌ణ‌: క‌లెక్ట‌ర్

image

జిల్లాలోని మూడు అన్న క్యాంటీన్ల‌కు రాష్ట్ర‌స్థాయిలో మెరుగైన ర్యాంకులు ల‌భించ‌డం ప‌ట్ల అధికారుల‌ను క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేడ్క‌ర్ శుక్రవారం అభినందించారు. వీటి నిర్వ‌హ‌ణ‌ను మ‌రింతగా మెరుగుప‌రిచి, ప్ర‌జ‌ల‌కు రుచిక‌రంగా, నాణ్య‌మైన భోజ‌నాన్ని, అల్పాహారాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. జిల్లాలోని అన్ని అన్న‌ క్యాంటీన్లు ఈ ఘనత సాధించాలని ఆకాంక్షించారు.

News April 5, 2025

పండ్ల వర్తకులకు విజయనగరం జేసీ హెచ్చరిక

image

ర‌సాయ‌నిక ప‌దార్థాలు వినియోగించి ప‌ళ్ల‌ను కృత్రిమంగా పండించి విక్ర‌యించే వారిపై కేసులు న‌మోదు చేస్తామ‌ని విజయనగరం జేసీ ఎస్‌.సేతుమాధ‌వ‌న్ హెచ్చరించారు. క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని JC ఛాంబ‌ర్‌లో టాస్క్ ఫోర్స్ సిబ్బందితో శుక్రవారం సమావేశం జరిగింది. ఈ సందర్బంగా జేసీ మాట్లాడుతూ.. కృత్రిమంగా పండించే పండ్లు త‌క్కువ రుచితో వుంటాయ‌న్నారు. ప్రజలకు విస్తృత అవగాహన చేపట్టాలని సూచించారు.