Vizianagaram

News March 28, 2025

31న జరగాల్సిన టెన్త్ సోషల్ ఎగ్జామ్ వాయిదా

image

ఈ నెల 31న జరగాల్సిన సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ ఒకటికి వాయిదా వేసినట్లు డీఈవో మాణిక్యం నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 31న రంజాన్ కారణంగా పరీక్ష వాయిదా వేసినట్లు చెప్పారు. 31న జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ ఒకటిన ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని, విద్యార్థులు గమనించాలని కోరారు.

News March 28, 2025

VZM: శుభలేఖ సుధాకర్, SP శైలజకు జీవిత సాఫల్య పురస్కారం

image

ప్రముఖ సినీ నటుడు శుభలేఖ సుధాకర్, సినీ నేప‌థ్య గాయని ఎస్పీ శైలజకు కళాపీఠం జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నామని కళా పీఠం వ్యవస్థాపక అధ్యక్షులు బిఏ నారాయణ తెలిపారు. ఏప్రిల్ 1 న ఆనంద గజపతి కళాక్షేత్రంలో కళా పీఠం నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ గాయని పద్మభూషణ్, గానకోకిల పి.సుశీల పాల్గొంటారన్నారు.

News March 28, 2025

VZM: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

ఎస్.కోట మండలం కొత్తూరు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బసనబోయిన కార్తీక్ (21) మృతి చెందాడు. ఇతను తన స్నేహితులతో కలసి ఎస్.కోట నుంచి స్కూటీపై ఎల్.కోట పండక్కి వెళ్తున్న నేపథ్యంలో కొత్తూరు సమీపంలో ఎదురుగా వస్తున్న బైకు ఢీకొట్టింది. స్కూటీపై ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్.కోట పీహెచ్సీకి తరలించగా కార్తీక్ మృతి చెందినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

News March 28, 2025

విజయనగరం: ఉప ఎన్నికల్లో YCP క్లీన్ స్వీప్

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా వివిధ కారణాలతో ఖాళీ అయిన స్థానాల్లో గురువారం నిర్వహించిన ఉప ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. భోగాపురం వైస్ ఎంపీపీగా పచ్చిపాల నాగలక్ష్మి (వైసీపీ) ఎన్నిక కాగా, వివిధ మండలాల్లో మరో పది స్థానాల్లో జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సంతకవిటి మండలంలోని మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యుడిగా వైసీపీకి చెందిన షేక్ హయ్యద్ బీబీ ఎన్నికయ్యారు.

News March 28, 2025

విజయనగరంలో బాలికపై బాలుడు అత్యాచారయత్నం

image

విజయనగరం రూరల్ పరిధిలో బాలికపై ఓ బాలుడు అత్యాచారయత్నానికి పాల్పడినట్లు రూరల్ ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపారు. ఈనెల 26న ఈ ఘటన జరగ్గా కేసు నమోదు చేశామన్నారు. ఇంటిలో ఒంటరిగా నిద్రిస్తున్న సమయంలో బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వేయడంతో బాలుడు పరారయ్యాడన్నారు. దీనిపై బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు.

News March 28, 2025

విజయనగరం: డివిజన్ల పనితీరుపై సమీక్ష

image

విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏపీ పోస్టల్ సర్కిల్ డైరెక్టర్ ఆఫ్ పోస్టల్ సర్వీస్(DPS) కె.సంతోష్ నేత గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. విశాఖపట్నం రీజియన్ పరిధిలోని విజయనగరం,పార్వతీపురం,అనకాపల్లి,శ్రీకాకుళం డివిజన్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా పొదుపు, ఇన్సూరెన్స్ రంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందిని సత్కరించారు. సూపరింటెండెంట్లు, ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

News March 28, 2025

విజయనగరం: శ్రీ విశ్వావ‌సునామ‌ ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు

image

శ్రీ విశ్వావ‌సునామ ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌భ‌ద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.శ్రీ‌నివాస‌మూర్తి కోరారు. ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై త‌మ ఛాంబ‌ర్‌లో వివిధ శాఖ‌ల అధికారుల‌తో గురువారం సమావేశమయ్యారు. రాష్ట్ర‌ప్ర‌భుత్వ ఆదేశాల‌కు అనుగుణంగా క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ సూచ‌న‌ల మేర‌కు ఈనెల 30వ తేదీన ఉగాది వేడుక‌ల‌ను క‌లెక్ట‌రేట్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు.

News March 27, 2025

విజయనగరం జిల్లాపై సీఎం స్పెషల్ ఫోకస్

image

విజయనగరం జిల్లాలో సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ప్రధాన ప్రాజెక్టులైన తోటపల్లికి రూ.105కోట్లు, తారకరామసాగర్‌కు రూ.807కోట్లు ఇవ్వనున్నట్లు CM చంద్రబాబు ప్రకటించారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో జిల్లాలోని సాగునీటి వనరులపై CM ఆరా తీశారు. ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సెంట్రల్ ట్రైబుల్ యునివర్సిటీకి రూ.29కోట్లు ఇస్తామన్నారు.

News March 27, 2025

VZM: ‘ధాన్యం కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నాం’

image

ఖరీఫ్ 2024-25 సీజన్‌కు గాను జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి దశకు చేరుకున్నందున ఈనెల 31న కేంద్రాలను మూసి వేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 487 కేంద్రాల నుంచి 3.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతుల ఖాతాల్లో మద్దతు ధర రూ.768 కోట్లు, GLT చెల్లింపులకు రూ.12కోట్లు జమ చేశామన్నారు. రైతులు వద్ద ధాన్యం ఉంటే నిర్ణీత గడువులోగా విక్రయించాలన్నారు.

News March 27, 2025

VZM: పర్యాటక రంగంలో జిల్లా ఆదాయాన్ని పెంచుతాం: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలో పైడిత‌ల్లి ఆల‌యంతో పాటు రామ‌తీర్ధాన్ని ప‌ర్యాట‌క ఆధ్యాత్మిక క్షేత్రాలుగా అభివృద్ధి చేసి జిల్లాలో ఆదాయం పెంచుతామ‌ని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. అమరావతిలో బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఈ అంశాన్ని ప్రస్థావించారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ అందుబాటులోకి వస్తున్న దృష్ట్యా ఉపాధి అవకాశాలు, ఆతిధ్య రంగం అభివృద్ధిలో భాగంగా వాణిజ్యం, హోటళ్ల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు.