India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఇన్ ఫ్లో 3,710 క్యూసెక్కులగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు గేట్లు ఎత్తివేసి 2,777 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. కాల్వల ద్వారా 190 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ సామర్థ్యం 2.5 టీఎంసీలకు కాగా.. ప్రస్తుతం 1.858 టీఎంసీలు ఉందన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 115 జీవోను వెంటనే రద్దు చేయాలని మహారాజా ఆసుపత్రి నర్సులు డిమాండ్ చేశారు. ఏపీ నర్స్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా చేశారు. వారు మాట్లాడుతూ.. జీవోను రద్దు చేసి నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్సు పోస్టులు భర్తీ చేయాలన్నారు. నర్సింగ్ కోర్సులు చదివి ప్రభుత్వాసుపత్రిలో సేవలు చేస్తున్నామని, సచివాలయాల్లో పనిచేస్తున్న ANM లను స్టాఫ్ నర్సులుగా పెట్టడం సరికాదన్నారు.
బెంగుళూరు పర్యటనలో ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ అంబేడ్కర్, ఎస్పీ వకుల్ జిందల్ తో ఫోన్లో సోమవారం మాట్లాడారు. విజయనగరంలో తాజా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలిని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.భోగాపురం పోలీసులను అలెర్ట్ గా ఉంచాలని కోరారు.
బొబ్బిలి మండలం పారాది కాజ్ వే పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. పారాది వద్ద వేగావతి నదిపై బ్రిటిష్ కాలం నాటి బ్రిడ్జి పాతదైపోయింది. దానిపై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీనికి ప్రత్యామ్నాయంగా తాత్కాలిక కాజ్ వేను నిర్మించారు. వర్షాలకు కాజ్ వే ధ్వంసం కావడంతో భారీ వాహనాలను మళ్లించారు. విజయనగరం నుంచి బొబ్బిలి, పార్వతీపురం వెళ్లేందుకు ఈ మార్గమే దిక్కు.
భారీ వర్షాల నేపథ్యంలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూం నంబర్ 08922-236947, విజయనగరం డివిజన్ కంట్రోల్ రూం: 08922-276888, బొబ్బిలి డివిజన్ కంట్రోల్ రూం: 9390440932, చీపురుపల్లి డివిజన్ కంట్రోల్ రూం: 7382286268 నంబర్లను ఏర్పాటు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఏ అవసరం ఉన్నా కంట్రోల్ రూం నంబర్లను సంప్రదించాలని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంతో పాటు అనుబంధ కళాశాలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య ఈ.ఎన్. ధనుంజయరావు తెలిపారు. రేపు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. మరల ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడకుండా సెలవు ప్రకటించినట్లు ఆయన తెలియజేశారు.
నాగావళి వరద పెరిగే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీంతో తోటపల్లి ప్రాజెక్టు వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టు నీటిమట్టం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 103.95 మీటర్ల నీటిమట్టం ఉంది. ఒడిశా నుంచి 2,180 క్యూసెక్కుల వరద నీరు వస్తుడడంతో రెండు గేట్లు ఎత్తి 1,851 క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్న అధికారులు తెలిపారు.
భారీ వర్షాల పట్ల ఉమ్మడి జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు సూచించారు. ఆదివారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జిల్లాలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. వంతెనలు, కాజ్ వే ల పై ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.
వర్షాల కారణంగా పార్వతీపురం మన్యం జిల్లాలో పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాతావరణ కేంద్ర హెచ్చరికల మేరకు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని అన్నారు. ఈ అంశాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాశాఖ అధికారులు గమనించి తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ అంబేడ్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే సోమవారం కలెక్టరేట్లో జరగవలిసిన ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.