Vizianagaram

News August 28, 2025

VZM: ఈనెల 29న జాబ్ మేళా

image

విజయనగరం (D) జామి (M) భీమసింగిలోని శ్రీ బాలాజీ జూనియర్ కాలేజీలో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ప్రశాంత్ కుమార్ బుధవారం తెలిపారు. టెన్త్, ఇంటర్, ITI, డిప్లమా, డిగ్రీ, బీటెక్, ఏదైనా పీజీలో ఉత్తీర్ణత సాధించిన 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తిగల యువతీ, యువకులు <>https://naipunyam.ap.gov.in <<>>లింక్ పై క్లిక్ చేసి వివరాలు నమోదు చేసుకోండి.

News August 27, 2025

జిల్లా నుంచి పారా జాతీయ స్థాయి పోటీలకు పయనం

image

పారా రాష్ట్ర స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి 13 మంది ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ వేదికగా ఈనెల 29 నుంచి 31 వరకు జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025 జరగనుంది. ఈ పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు బుధవారం బయలుదేరారు. వీరందరికి పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షులుదయానంద్ అభినందనలు తెలిపారు.

News August 27, 2025

VZM: ‘పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి’

image

విజయనగరంలోని ఓ హోటల్లో టీడీపీ జిల్లా కమిటీ ఏర్పాటుపై త్రిసభ్య కమిటీ సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాసంశెట్టి సుభాష్, శాసన మండలి మాజీ ఛైర్మన్ ఫరూఖ్, ఎమ్మెల్యే గణబాబు సభ్యులుగా వ్యవహారించి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ నిర్ణయానికి అంతా కట్టుబడి ఉండాలని కోరారు.

News August 27, 2025

VZM: ‘బిల్లుల చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించండి’

image

నిర్మాణాలు పూర్తయిన MPFC (మల్టీ పర్పస్ ఫెసిలిటేషన్ సెంటర్) గోదాముల బిల్లులు చెల్లింపులకు ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ అంబేడ్కర్ ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్‌లో సహకార, మార్కెటింగ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. నిర్మాణాలు పూర్తయిన 11 గోదాములకు చివరి పేమెంట్ కోసం ప్రతిపాదనలు పంపించాలని అన్నారు. పనులు మొదలుకాని గోదాములకు అనుమతులు రద్దు చేయాలని పేర్కొన్నారు.

News August 27, 2025

PM సూర్యఘర్‌లో జిల్లాకు 8వ స్థానం: JC

image

సోలార్ యూనిట్ల స్థాపనలో విద్యుత్ అధికారులు వారి లక్ష్యాలను సాధించాలని JC సేతు మాధవన్ తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి కమిటీ సమావేశం జేసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఏఏ బ్యాంక్‌ల వద్ద దరఖాస్తులు పెండింగ్ ఉన్నదీ జాబితా తీసుకొని పరిష్కరించాలని ఎస్.ఈకి సూచించారు. PM సూర్యఘర్ పథకంలో రాష్ట్ర స్థాయిలో జిల్లా 8వ స్థానంలో ఉందని, గత 3 నెలల్లో ప్రగతి ఆశాజనకంగా ఉందని జేసీ అభినందించారు.

News August 26, 2025

కొత్తవలసలో అత్యధిక వర్షపాతం

image

మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 8 గంటల వరకు విజయనగరం డివిజన్లో అత్యధికంగా కొత్తవలసలో65.8mm(క్యూములేటివ్) వర్షపాతం కురిసినట్లు ఏఎస్‌ఓ రామకృష్ణ రాజు తెలిపారు. నెల్లిమర్లలో 61.2mm, జామిలో 55.2mm, విజయనగరంలో 50.8mm, భోగాపురంలో 48.8mm, పూసపాటిరేగలో 48.2mm, డెంకాడలో 45.6mm, ఎస్.కోటలో 37.8mm, ఎల్.కోటలో 29.2mm, వేపాడలో 26.2mm, బొండపల్లిలో 19.4 mm వర్షపాతం నమోదు అయిందని తెలిపారు.

News August 26, 2025

VZM: గణేష్, దేవీ మండపాలకు ఉచిత విద్యుత్

image

రేపటి నుంచి ప్రారంభమయ్యే వినాయక నవరాత్రి ఉత్సవాలు, ఆ తర్వాత ప్రారంభం కానున్న దేవీ నవరాత్రుల్లో భాగంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మండప నిర్వాహకులు స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదిస్తే మంజూరు చేస్తారన్నారు.

News August 26, 2025

విజయనగరం: కరుస్తున్నాయి.. కాటేస్తున్నాయి..!

image

జిల్లాలో పాము కాట్లు, కుక్కల దాడులు భయాందోళన రేపుతున్నాయి. 2024లో 383 మంది పాముకాటుకు గురికాగా ఇద్దరు మరణించారు. 2025 (ఆగస్టు వరకు) 143 కేసులు నమోదయ్యాయి. 2024లో 12,767 కుక్క కాటు కేసులు నమోదవ్వగా నలుగురు చనిపోయారు. 2025 (ఆగస్టు వరకు) 7,545 కేసులు నమోదవ్వగా ఆరుగురు ప్రాణాలొదిలారు. కుక్క, పాముకాట్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ రేబీస్, యాంటీ వెనమ్ ఇంజక్షన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యులు తెలిపారు.

News August 26, 2025

భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

భారీ వ‌ర్షాల ప‌ట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా క‌లెక్ట‌ర్‌ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ ఆదేశించారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒడిషా, శ్రీ‌కాకుళం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తుండ‌టంతో, ముఖ్యంగా నాగావ‌ళి ప‌రీవాహ‌క మండ‌లాల అధికారులు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలన్నారు. ఎస్‌.కోట‌, నెల్లిమ‌ర్ల మండ‌లాల్లో రేపు అత్య‌ధిక వ‌ర్ష‌పాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంద‌న్నారు.

News August 26, 2025

పోలీసు కుటుంబాలకు అండగా ఉంటాం: SP

image

జిల్లా పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తూ పలు కారణాలతో మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలతో SP వకుల్ జిందల్ నేడు సమావేశం నిర్వహించారు. వారికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సర్వీసు బెనిఫిట్స్, వారి సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారుణ్య నియామకాలు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.