India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు మేము సైతం అంటూ జిల్లా సమాఖ్య ముందుకు వచ్చింది. కలెక్టర్ అంబేడ్కర్ పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్థం జిల్లా స్వయం శక్తి మహిళల తరఫున రూ.10 లక్షల సీఎం సహాయనిధికి అందజేయాలని నిర్ణయించారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ద్వారా బుధవారం విజయవాడలో సమాఖ్య ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు అందజేశారు.
భారీ వర్షాల కారణంగా రద్దు చేసిన దూర ప్రాంతాల సర్వీసులన్నింటినీ ఆర్టీసీ విశాఖ రీజియన్ అధికారులు పునరుద్ధరించారు. వర్షాలు తగ్గుముఖం పట్టడం, రోడ్ల మీద వరద ప్రవాహం తగ్గడంతో విజయవాడ, గుంటూరు జిల్లాలకు వెళ్లాల్సిన 14 బస్సులు, విజయవాడ, ఆపై ప్రాంతాల నుంచి విశాఖ రావలసిన ఆరు బస్సులను పునరుద్ధరించారు. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన బస్సును మాచర్ల మీదుగా నడుపుతున్నారు.
పార్వతీపురం జిల్లాలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. సీతానగరం మండలానికి చెందిన ఓ మహిళ భర్త వదిలేశాడని మనస్తాపంతో ఇంట్లో ఉన్న చీమల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జియ్యమ్మవలస మండలానికి చెందిన మరో మహిళ ఇతర కారణాలవల్ల గాజు పెంకులు మింగింది. ఇద్దరు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వరదలు కారణంగా ఆయా స్టేషన్లలో నిలిచిపోయిన ప్రయాణికుల సౌకర్యార్థం విశాఖ నుంచి సికింద్రాబాద్కు వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్ప్రెస్ నడుపుతున్నట్లు వాల్తేరు రైల్వే డివిజన్ సీనియర్ డీసీఎం సందీప్ తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ వన్ వే ఏపీ స్పెషల్ ఎక్స్ప్రెస్ బుధవారం రాత్రి 7.50 గంటలకు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందన్నారు.
విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు తమ స్టేషను పరిధిలోని గ్రామాలను, వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమై జరుగుతున్న వివిధ రకాల సైబర్ మోసాలు, మహిళల రక్షణ, రహదారి భద్రత, నూతన చట్టాలు గురించి తెలిపారు. అదేవిధంగా గణేశ్ ఉత్సవాల నిర్వహణలో పాటించాల్సిన నియమ, నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు.
ఈ నెల 5 నుంచి 7వ తేదీవరకు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని, అలాగే బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మడ్డువలస రిజర్వాయర్లో ఇన్ఫ్లో ఇప్పటికే ఎక్కువగా ఉందని ఇప్పటినుంచే అప్రమత్తంగా ఉండాలన్నారు.
తీవ్ర కడుపునొప్పితో ఆగస్టు 28న ఓ మహిళ విశాఖ కేజీహెచ్లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు కడుపులో 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సర్జరీ చేసి వాటిని తొలగించారు. ఆమె 3 ఏళ్ల క్రితం గర్భం దాల్చగా.. అబార్షన్కు మందులు వాడారని అప్పటి నుంచి నొప్పితో బాధపడుతున్నారని వైద్యులు చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు ఇప్పటివరకు 25లోపే నమోదైనట్లు వైద్యులు తెలిపారు.
విజయనగరం గురజాడ గ్రంధాలయంలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలంటూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం గ్రంథాలయ ప్రతినిధి బీ.లక్ష్మీకి వినతి పత్రం ఇచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ.. జిల్లా ప్రధాన గ్రంథాలయానికి సుమారు 400 మంది విద్యార్థులు చదువుకోవడానికి వస్తున్నారని, వసతులు, మరుగుదొడ్లు లేవన్నారు. భవనాలు పెచ్చులు ఊడిపోతున్నాయని చెప్పారు. పరిసరాలు క్లీన్గా లేవన్నారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల నుంచి రేషన్ డిపోల ద్వారా సరుకులు పంపిణీ చేయనున్నారు. డీఎంయూ వాహనాలకు స్వస్తి పలికారు. ఈ నెలలో బియ్యంతో పాటు పంచదార పంపిణీ చేస్తారు. ఈ మేరకు 230 టన్నులు తెప్పించినట్లు పౌర సరఫరాల సంస్థ డీఎం మీనాకుమారి సోమవారం తెలిపారు. కార్డుకు అర కిలో, అంత్యోదయ కార్డుకు కిలో చొప్పున ఇస్తామని, అక్టోబర్ నెల నుంచి కందిపప్పు కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
తమ పింఛన్లు అన్యాయంగా తొలగించారని గొల్లపల్లి పదో వార్డుకు చెందిన పలువురు పింఛనుదారులు వాపోయారు. ఈ మేరకు బొబ్బిలి మున్సిపల్ కార్యాలయం వద్ద 10 మంది లబ్దిదారులు సోమవారం నిరసన తెలిపారు. తాము ఎప్పటి నుంచో సామాజిక పింఛన్లు అందుకుంటున్నామన్నారు. ప్రస్తుతం తమ పింఛన్లు నిలిపివేశారని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
Sorry, no posts matched your criteria.