Vizianagaram

News March 22, 2025

VZM: జిల్లాలో పర్యటించిన హైకోర్టు న్యాయమూర్తి

image

రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, జిల్లా పోర్టు ఫోలియో జడ్జి జస్టిస్ చీమలపాటి రవి శనివారం జిల్లా పర్యటనకు నగరానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో జరిగిన న్యాయాధికారుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవిని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్, జిల్లా SP వకుల్ జిందాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. సాయికల్యాణ్ చక్రవర్తి కూడా ఉన్నారు.

News March 22, 2025

VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

image

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.

News March 22, 2025

జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

image

ర‌క్త‌హీన‌త‌ను నివారించేందుకు ప్ర‌వేశ‌పెట్టిన ప‌లు ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేస్తున్న కార‌ణంగానే జిల్లాలో ర‌క్త‌హీన‌త త‌గ్గింద‌ని జిల్లాలో ప‌ర్య‌టించిన కేంద్ర ప్ర‌భుత్వ వైద్య‌ నిపుణుల‌ బృందం అభిప్రాయ‌ప‌డింది. కలెక్టర్ అంబేడ్క‌ర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించిన త‌ర్వాత గుర్తించిన అంశాల‌ను క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు.

News March 22, 2025

నిధులు ఇవ్వమని సీఎంను కోరుతా: VZM కలెక్టర్

image

జిల్లాకు ప్ర‌ధాన‌మైన తోట‌ప‌ల్లి కుడి ప్ర‌ధాన కాల్వ‌, తార‌క‌రామ తీర్థ‌సాగ‌రం ప్రాజెక్టుల‌ను పూర్తిచేసేందుకు అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేయాల‌ని త్వ‌ర‌లో జ‌రిగే క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎంను కోర‌నున్న‌ట్టు క‌లెక్ట‌ర్ అంబేడ్క‌ర్ తెలిపారు. శుక్రవారం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు.ఆయా ప్రాజెక్టుల ప‌నులు, భూసేక‌ర‌ణ‌, పున‌రావాసం పూర్తిచేసేందుకు ఏమేర‌కు నిధులు అవ‌స‌ర‌మ‌వుతాయో నివేదిక ఇవ్వాలని కోరారు.

News March 21, 2025

నెలాఖరులోగా మంజూరును పూర్తి చేయాలి: కలెక్టర్

image

బ్యాంకుల‌కు కేటాయించిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాల‌ను మంజూరు చేయాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ కోరారు. జిల్లా స్థాయి బ్యాంక‌ర్ల స‌మీక్షా క‌మిటీ స‌మావేశం క‌లెక్ట‌రేట్‌లో శుక్ర‌వారం జ‌రిగింది. క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌తిబ్యాంకుకు ఇచ్చిన ల‌క్ష్యాల మేర‌కు ఈ నెలాఖ‌రులోగా ప‌థ‌కాలు మంజూరు చేసి, గ్రౌండింగ్ అయ్యేలా చూడాల‌ని ఆదేశించారు. విశ్వకర్మపై దృష్టి సారించాలన్నారు.

News March 21, 2025

VZM: సబార్డినేట్ పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు

image

జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీలో ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం దరఖాస్తుల తేదీని ఈనెల 22వరకు పొడిగించినట్లు జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ADR మీడియేషన్ కేంద్రంలో 2 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన (SC, OC) నియామకం కోసం మహిళా అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను జిల్లా కోర్ట్ భవనంలో ఉన్న న్యాయ సేవల కేంద్రంలో సమర్పించాలన్నారు.

News March 21, 2025

VZM: ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది గైర్హాజరు

image

విజయనగరం జిల్లాలో 119 పరీక్షా కేంద్రాలలో జరుగుతున్న 10 వతరగతి పరీక్షలలో శుక్రవారం ఇంగ్లిష్ పరీక్షకు 98 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఈఓ యు.మాణిక్యం నాయుడు తెలిపారు. 22,846 విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా.. 22,748 మంది పరీక్ష రాశారన్నారు. ప్రశాంతంగా పరీక్షలు జరుగుతున్నాయని.. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించామన్నారు. 

News March 21, 2025

మానాపురం ROB పనులపై కలెక్టర్ సీరియస్

image

మానాపురం ROB నిర్మాణం ఆలస్యం అయినందున కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ అంబేడ్క‌ర్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ తన ఛాంబర్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేనిచో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. పనుల ఆలస్యం వలన ట్రాఫిక్ సమస్యతో పాటు పబ్లిక్‌కు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు.

News March 21, 2025

VZM: నకిలీ బంగారం ముఠా అరెస్ట్

image

కైకలూరులో గోల్డ్ షాపుల్లో నకిలీ బంగారాన్ని తాకట్టు పెడుతున్న ముఠాను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా మెంటాడకి చెందిన CH మణికంఠ మరో వ్యక్తితో కలిసి ఈ దందాకు పాల్పడ్డాడు. ఓ షాప్‌లో బంగారు నగలు అని తాకట్టు పెట్టి రూ.90,000 తీసుకున్నారు. మరో షాప్‌లో కూడా ఇలానే చేయగా షాప్ యజమానికి అనుమానం వచ్చి ప్రశ్నించాడు. దీంతో నిందితులు చాకు చూపించి రూ.1,50,000తో పరారైనట్లు కేసు నమోదు అయ్యింది.

News March 21, 2025

VZM: ఇళ్ల లబ్దిదారులకు ఉచితంగా ఇసుక: కలెక్టర్

image

ఇళ్ల లబ్దిదారులకు ప్ర‌భుత్వం అందిస్తున్న అద‌న‌పు సాయాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కలెక్ట‌ర్ అంబేడ్కర్ గురువారం ఓ ప్రకటనలో సూచించారు. అద‌నంగా ఆర్ధిక సాయం చేయ‌డ‌మే కాకుండా, ఇసుక‌ను కూడా ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఇస్తోందన్నారు. ల‌బ్దిదారులు వీటిని వినియోగించుకొని స‌కాలంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాల‌న్నారు. ప్ర‌స్తుతం ఇళ్ల నిర్మాణానికి అనుకూల‌మైన స‌మ‌య‌మ‌ని చెప్పారు.