India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏదైనా అంశంపై కోర్టులు ఇచ్చిన తీర్పులను తక్షణమే అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేడ్కర్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో వీడియో కాన్ఫిరెన్స్ ద్వార మండల అధికారులతో సమీక్షించారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివాదాలపై కోర్టుల నుంచి వచ్చే నోటీసులకు నిర్ణీత గడువులోగా సమాధానాలు దాఖలు చేసే బాధ్యత ఆయా ప్రభుత్వ శాఖల అధికారులదేనని స్పష్టం చేశారు.
ఎస్.కోట మండలం మూలబొడ్డవార పంచాయతీ మరుపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరెంట్ పోల్ ముట్టుకోవడంతో విద్యుత్ షాక్తో చంటిబాబు అనే నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆరు బయట ఆదుకుంటూ, పక్కనే ఉన్న విద్యుత్ పోల్ను ముట్టుకున్నాడు. వర్షానికి తడిసి ఉన్న కరెంట్ పోల్ కరెంట్ షాక్ కొట్టింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బాబు మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణకు కేబినెట్ హోదా దక్కింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకునిగా గుర్తిస్తూ ప్రభుత్వం ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఇకపై కేబినెట్ హోదాలో ఎమ్మెల్సీ బొత్సకు అవసరమైన ప్రోటోకాల్, మర్యాదలు ఇవ్వాలని ప్రభుత్వ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ఎస్.సురేశ్ కుమార్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వాల్తేరు డివిజన్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేశారు. ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మరింత సమాచారం కోసం విజయనగరంలో 8712641260, 08922 221202 నంబర్లతో హెల్ప్డెస్క్లను అందుబాటులోకి తెచ్చారు.
విజయనగం జిల్లాలో ఈనెల 7న మద్యం షాపులు బంద్ కానున్నాయి. నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించింది.
విజయనగరం 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గణేశ్ గుడివద్ద గుర్తుతెలియని మృతదేహం గుర్తించినట్లు ఒకటో పట్టణ సీఐ శ్రీనివాస్ ఆదివారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40- 45 మధ్య ఉంటుందన్నారు. చుట్టూ పక్కల వారిని విచారణ చేయగా ఫలితం లేదని, మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్లో భద్రపరిచామన్నారు. ఆచూకీ తెలిసినవారు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు.
బొబ్బిలిలో నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లిమర్ల, బొబ్బిలి, కురుపాం ఎమ్మెల్యేలు లోకం మాధవి, బేబినాయన, తోయక జగదీశ్వరీ పాల్గొన్నారు. ‘చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ పెద్దకుమారుడు. ఇద్దరూ కలిసి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఒకేరోజు అన్ని పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించిన ఘనత డిప్యూటీ సీఎంకే దక్కుతుంది. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి’ అని MLAలు సూచించారు.
ఈనెల 7 నుంచి ప్రారంభం కానున్న వినాయక ఉత్సవాలకు సంబంధించి సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని ఎస్పీ వకుల్ జిందాల్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. వినాయక ఉత్సవాలను శాంతియుతంగా, ఎటువంటి ఘర్షణలకు తావు లేకుండా నిర్వహించేందుకు కమిటీ సభ్యులు సహకరించాలన్నారు. అనుమతులకు సంబంధించి సింగిల్ విండో విధానాన్ని అమల్లోకి తెచ్చామని https://ganeshutsav.net లింక్లో అనుమతులు పొందాలన్నారు.
గడిచిన రెండు రోజులగా వర్షాలు విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో వేగావతి నది ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పారాది వద్ద కొత్తగా నిర్మించిన కాజ్ వే వంతెనపై నీరు చేరి, గుంతలు ఏర్పడ్డాయి. ఆర్అండ్ బీ ఉన్నతాధికారుల సూచనలతో డిఎస్పీ శ్రీనివాసరావు వంతెనను పరిశీలించారు. కాజ్ వేపై వాహనాలను అనుమతించలేదని తెలిపారు. పాత వంతెన మీదుగా 10 టన్నులకు తక్కువగా బరువున్న వాహనాలను మాత్రం అనుమతిస్తామన్నారు.
భారీ వర్ష సూచనల మేరకు సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)ను రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్ష సూచన ఉందని, ఇతర ప్రాంతాల నుంచి రావడంలో ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని, అందుకే గ్రీవెన్స్ రద్దు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.