Vizianagaram

News August 11, 2024

ఆ శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉంది: కేంద్ర మంత్రి

image

భవిష్యత్తులో ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చే శక్తి భోగాపురం విమానాశ్రయానికి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో విమానాశ్రయ నిర్మాణాన్ని టాప్ ప్రయారిటీ జాబితాలో ఉంచామన్నారు. ఇప్పటివరకు 36.6 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు.

News August 11, 2024

VZM: గున్న ఏనుగుకు జన్మనిచ్చిన వరలక్ష్మి

image

ఉమ్మడి విజయనగం జిల్లాలో ఏనుగుల గుంపులోకి మరో గున్న ఏనుగు వచ్చి చేరింది. ఆదివారం ఉ.11:30 గంటల సమయంలో వరలక్ష్మి అనే ఆడ ఏనుగు గున్న ఏనుగుకు జన్మనిచ్చినట్లు అటవీ సిబ్బంది తెలిపారు. వంగర మండలం రాజులగుమడ- వీవీఆర్‌పేట మధ్యలో వరలక్ష్మి ప్రసవించింది. గున్న పుట్టడంతో గుంపులో ఏనుగుల సంఖ్య ఏడుకు చేరింది. వీటితో పాటు మరో నాలుగు ఏనుగుల గుంపు కురుపాం సరిహద్దులో సంచరిస్తుంది. దీంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

News August 11, 2024

బొత్స నామినేషన్‌కు డేట్ ఫిక్స్..!

image

విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు సంబంధించి మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 6 నుంచి నామినేషన్ పత్రాలను అధికారులు స్వీకరిస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఒక్క నామినేషన్ కూడా పడలేదు. స్వీకరణకు రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బొత్స తన నామినేషన్ పత్రాలను సోమవారం సమర్పిస్తారని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. కాగా కూటమి నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు.

News August 11, 2024

మంత్రి సంధ్యారాణికి అంగన్వాడీల వినతి

image

ఫేస్ యాప్ ద్వారా లబ్ధిదారులను నమోదు చేసి, వారి ఫోన్‌లకు ఓటీపీ వచ్చిన తర్వాతే సరుకులు ఇచ్చేలా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు కోరారు. ఈ మేరకు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు పైలెట్ ప్రాజెక్టుగా విజయనగరం, గంట్యాడలను ఎంపిక చేశారన్నారు. దీంతో పని భారం పెరుగుతుందన్నారు.

News August 11, 2024

మానాపురం టూ కేరళ.. 52 పశువులకు విముక్తి!

image

జిల్లా నుంచి పశువుల అక్రమ రవాణా ఏకంగా రాష్ట్రాలే దాటిపోతోంది. మానాపురం నుంచి కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న కంటైనర్ లారీని ఎలమంచిలిలో పోలీసులు శనివారం పట్టుకున్నారు. కార్లను తరలించే కంటైనర్ లో అక్రమంగా తరలిస్తున్న 52 పశువులకు విముక్తి కల్పించారు.వీటిని తరలిస్తున్న షిజూపా, పరంబిల్, వలయార్, చొప్ప నాగరాజును అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు.పశువులను పాయకరావుపేట మార్కెట్ యార్డుకు తరలించారు.

News August 11, 2024

కేంద్ర మంత్రి భోగాపురం షెడ్యూల్ ఇదే

image

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదివారం ఉదయం 10-30 గంటలకు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ ప్రాంతాన్ని సందర్శిస్తారు. టెర్మినల్, ఏటీసీ నిర్మాణాలు, రన్ వే నిర్మాణం పనులను పరిశీలిస్తారు. అనంతరం GMR, L&T ప్రతినిధులతో, జిల్లా అధికారులతో పనులపై సమీక్షిస్తారు. అనంతరం మీడియాతో మాట్లాడతారు. రాష్ట్ర మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి పాల్గొంటారు.

News August 11, 2024

VZM: మళ్లీ తెరపైకి VMRDA ప్రణాళికలు

image

VMRDA ప్రణాళిక మళ్లీ తెరపైకి వచ్చింది. రెండేళ్ల క్రితం జిల్లాలో VMRDA పరిధిలో రహదారి విస్తరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కూటమి ప్రభుత్వంలో విశాఖ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిసింది. భూ వినియోగ నిష్పత్తి ఆధారంగా కొత్త తరహా ప్రాజెక్టులతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు. ఆర్థిక, వర్తక, వాణిజ్య, ఐటీ, పర్యాటక రంగాల్లో అభివృద్ధికి భోగాపురాన్ని ప్రతిపాదించారు.

News August 11, 2024

ముగిసిన 41వ రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీలు

image

పిల్లలు విద్యతో పాటు క్రీడల్లోనూ ఆసక్తిని పెంపొందించుకోవడం అభినందనీయమని విజయనగరం మేయర్ విజయలక్ష్మి అన్నారు. శనివారం రాజీవ్ క్రీడా ప్రాంగణంలో 41వ రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో ఛాంపియన్ షిప్ ముగింపు సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ పోటీలలో గెలుపొందిన విజేతలకు పథకాలను జ్ఞాపికలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. క్రీడలు శారీరిక ఉల్లాసంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని అన్నారు.

News August 10, 2024

విజయనగరం: భార్యాభర్తలపై దాడి.. కేసు నమోదు

image

విజయనగరం జిల్లాలో అర్ధరాత్రి ఆకతాయిల వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల నెల్లిమర్ల, గరివిడిలో ఘటనలు మరవక ముందే తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 8న అర్ధరాత్రి భార్యాభర్తలు పెందుర్తి వెళ్లేందుకు ట్రైన్ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. టీ తాగేందుకు బయటకు రాగా.. గుర్తు తెలియని వ్యక్తులు మహిళతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ భర్తపై దాడి చేశారు. 1వ పట్టణ పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేశారు.

News August 10, 2024

రాత్రి 11 దాటితే ఆంక్షలు: విజయనగరం ఎస్పీ

image

విజయనగరం జిల్లాలోని ముఖ్య పట్టణాల్లో రాత్రి 11 గంటల తర్వాత ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించినా, వ్యాపారాలు సాగించినా కేసులు నమోదు చేయాలని ఎస్పీ వకుల్ జిందల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో భాగంగా కొన్ని ఆంక్షలను కఠినతరం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాత ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకూడదని, గుంపులుగా కనిపించవద్దని సూచించారు. SHARE IT..