India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విజయనగరం జిల్లాలోని లక్కవరపుకోట మండలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి వర్షం కురిసింది. లక్కవరపుకోటలో అత్యధికంగా 57.2 మిల్లీమీటర్లు, నెల్లిమర్లలో 54.8 మిల్లీమీటర్లు, శృంగవరపుకోటలో 40.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి 15.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు.
కూరగాయల ధరలు అమాంతంగా పెరగడంతో రంగంలోకి దిగిన జిల్లా యంత్రాంగం ఉల్లి, టమాటా, బంగాళాదుంపల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి టోకు వర్తకులు, మార్కెటింగ్, పౌరసరఫరా అధికారులతో చర్చించారు. ఆర్ అండ్ బీ, దాసన్న పేట, ఎంఆర్ రైతు బజార్లలో టమాటా కిలో రూ.60, ఉల్లి రూ.35, బంగాళాదుంపలు కిలో రూ.30కు అమ్మాలని నిర్ణయించారు.
జిల్లాలో వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. సాగు కోసం అన్ని సమకూర్చి సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలమైన వర్షం పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన నాలుగు రోజుల నుంచి 35- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వర్షం కురిసిన తడి ఆవిరవుతుందని రైతులు వాపోతున్నారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందింది. మెంటాడ మం. కొంపంగికి చెందిన త్రినాథ్ కుటుంబంతో తాడేపల్లిగూడెంలో నివాసముంటున్నాడు. అక్కడే చెప్పుల షాప్లో పనిచేస్తూ భార్య అశ్విని(26), ఇద్దరు పిల్లలను పోషించేవాడు. గజపతినగరంలో సొంతంగా షాప్ పెడదామని కుటుంబంతో వ్యాన్లో బయలుదేరాడు. శుక్రవారం చెల్లూరు వద్ద వ్యాన్ బోల్తా పడగా అశ్విని తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతిచెందింది.
విజయనగరం కేంద్రంలో కూరగాయల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలను అదుపు చేయాలని రైతులతో మాట్లాడిన జాయింట్ కలెక్టర్ కే.కార్తీక్ ప్రజలకు కూరగాయల ధరలు తగ్గించాలని కోరారు. హోల్సేల్ వ్యాపారులు, జిల్లా పౌరసరఫరాల అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్ మార్కెట్ వారితో చర్చించి రైతులతో మాట్లాడి ధరలు అదుపు చేయాలని సూచించారు. ఉల్లిపాయలు, టమోటా, బంగాళాదుంపల ధరల పట్టికను విడుదల చేశారు.
జిల్లా వ్యాప్తంగా ఎస్పీ దీపికా పాటిల్ ఆదేశాల మేరకు గడిచిన 24 గంటల్లో పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. చేపట్టిన దాడుల వివరాలను శుక్రవారం వెల్లడించారు. MV నిబంధనలు అతిక్రమించిన 293 మందిపై రూ.54,705 ఈ చలానాలు విధించామన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై 11 కేసులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగిన మరో 34 మందిపై జిల్లా వ్యాప్తంగా కేసులు నమోదయ్యాయన్నారు.
విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో ఈ నెల 24 నుంచి ప్రతి సోమవారం ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని ఎస్పీ ఎం.దీపిక గురువారం తెలిపారు. ఇకపై ప్రతీ సోమవారం యధావిధిగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని తెలిపారు.
బొండపల్లి మండలంలో ముచ్చర్ల గ్రామానికి చెందిన మజ్జి కృష్ణ (33) ఈనెల 17న తన భార్యను రూ.400 అడిగి బయటికి వెళ్లాడు. అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదు. గురువారం రవీంద్రం గ్రామంలో విగతజీవిగా పడిఉన్న కృష్ణను స్థానికులు గుర్తించారు. ఘటనపై మృతిని భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసుకున్నట్లు ఎస్సై కే.లక్ష్మణరావు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
గుర్ల మండలం నడుపూరు గ్రామానికి చెందిన కర్రోతు కళావతి పాము కాటుతో గురువారం మధ్యాహ్నం మృతి చెందింది. కళావతి పశువుల కోసం గడ్డి కోసేందుకు పొలానికి వెళ్లింది. అక్కడ గడ్డి కోస్తుండగా పాము కాటు వేసింది. దీంతో స్థానికులు ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మార్గంమధ్యలోనే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
డెంకాడ పోలీసు స్టేషనులో 2020లో నమోదైన హత్య కేసులో నిందితుడు బొల్లు వెంకటరావుకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయాధికారి తీర్పు చెప్పారని జిల్లా ఎస్పీ దీపిక జూన్ తెలిపారు. సింగవరం గ్రామానికి చెందిన సురేశ్ అనే వ్యక్తిని బావ బొల్లు వెంకటరావు కుటుంబ తగాదాల నేపథ్యంలో గ్యాస్ సిలిండర్తో కొట్టడంతో సురేశ్ మృతి చెందాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైంది.
Sorry, no posts matched your criteria.