WestGodavari

News September 12, 2024

బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తిపై పోక్సో కేసు

image

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఎస్సై జబీర్ కథనం మేరకు.. జంగారెడ్డిగూడేనికి చెందిన బాలిక(11) ఆడుకుంటుండగా.. అదే ప్రాంతానికి చెందిన చోడగిరి రాజు అనే వ్యక్తి ఇంటిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో ఆమె తల్లి వెళ్లి చూడగా.. స్నానాల గదిలో ఉంచి పరారయ్యాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు రాజుపై పోక్సో కేసు నమోదు చేశారు.

News September 12, 2024

పెనుగొండ: పెద్ద మనసు చాటుకున్న చిన్నారి

image

పెనుగొండలో ఓ చిన్నారి పెద్ద మనసు చాటుకుంది. విజయవాడ వరద బాధితులకు తన వంతు సాయంగా షాపుల వెంట తిరుగుతూ రూ.3,700 సేకరించింది. తన చిట్టి మాటలతో బాధితులకు ఆహారం, దుస్తులు ఇవ్వాలని కోరింది. చిన్నారిని చూసి ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయార్థం ముందుకు రావాలని ప్రిన్సిపల్ వెంకట అప్పారావు తెలిపారు. చిన్నారి మాటలు ప్రతి ఒక్కరి మనసు కదిలించాయి.

News September 12, 2024

తణుకులో జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు

image

జిల్లా అథ్లెటిక్స్ జట్ల ఎంపికలు తణుకు డిగ్రీ కళాశాలలో బుధవారం నిర్వహించారు. ఎంపికైన క్రీడాకారులు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని ఛైర్మన్ మానేపల్లి శ్రీనివాస్ తెలిపారు. అథ్లెటిక్స్ పోటీలను అసోసియేషన్ సెక్రటరీ సంకు సూర్య నారాయణ, అధ్యక్షుడు చింతకాయల సత్య నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పారిస్ ఒలింపిక్స్ వరకు వెళ్లిన దండి జ్యోతిక శ్రీని ఘనంగా సత్కరించారు.

News September 11, 2024

మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: డిప్యూటీ సీఎం

image

దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు వద్ద జరిగిన ప్రమాదంలో ఏడుగురు మరణించిన ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కష్టజీవులు మరణించడం ఎంతో బాధాకరమని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు సొషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముకులు వారి మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News September 11, 2024

కొవ్వూరు: మృతులకు న్యాయం చేస్తాం: MLA

image

దేవరపల్లి మండలం చిన్నాయగూడెం జీడిపిక్కల వ్యాన్ బోల్తా పడిన ఘటనలో మృతి చెందిన మృతదేహాలను కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో మృతుల బంధువులు ఆసుపత్రి వద్ద తమకు న్యాయం చేయాలని ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, ముప్పిడి వెంకటేశ్వర రావు అక్కడికి చేరుకొని వారితో మాట్లాడారు. ప్రభుత్వ తరఫున రూ.5 లక్షలు, ఫ్యాక్టరీ తరఫున రూ.3 లక్షలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు.

News September 11, 2024

ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో వ్యక్తి గల్లంతు.. మృతదేహం లభ్యం

image

నిడదవోలులోని బసిరెడ్డిపేట రేవు వద్ద వినాయక నిమజ్జన సమయంలో చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో <<14072518>>గల్లంతైన<<>> విషయం తెలిసిందే. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన జాలర్లకు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదుచేశారు.

News September 11, 2024

దేవరపల్లి యాక్సిడెంట్.. CM తీవ్ర దిగ్భ్రాంతి

image

దేవరపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మరోవైపు మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News September 11, 2024

ప.గో. జిల్లాలో సీఎం పర్యటన రద్దు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకివీడులో హెలికాప్టర్ ల్యాండ్ అవడానికి అనువుగా లేనందున పర్యటనలో మార్పుచేసినట్లు అధికారులు తెలిపారు. ఏలూరు జిల్లాలో పర్యటన యథావిధిగా కొనసాగనుండగా, పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం పర్యటన రద్దు అయినట్లు కలెక్టర్ తెలిపారు.

News September 11, 2024

ఉమ్మడి ప.గో. జిల్లాలో నేడు సీఎం పర్యటన ఇలా..

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నేడు (బుధవారం) సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఉదయం ఏలూరు జిల్లా కైకలూరు వద్ద ముంపు ప్రాంతాలను ఏరియల్ సర్వే చేస్తారు. 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా దుంపగడప గ్రామ పరిధిలో ఉన్న ఉప్పుటేరు వంతెనకు చేరుకుని వరద పరిస్థితిని పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అనంతరం హెలికాప్టర్‌లో కాకినాడ జిల్లా సామర్లకోట బయలుదేరి వెళ్తారు.

News September 11, 2024

ఏలూరు: గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి

image

నిడదవోలు పట్టణంలోని బసిరెడ్డిపేట రేవు వద్ద మంగళవారం రాత్రి వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమంలో అపశ్రుతి జరిగింది. చాగల్లు మండలం బ్రాహ్మణగూడేనికి చెందిన పి.రాజేష్ పశ్చిమ డెల్టా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. గ్రామం నుంచి గణేశ్ విగ్రహాన్ని పట్టణంలో రేవుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తుండగా గల్లంతయ్యాడు. యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ కుమార్ తెలిపారు.