India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేద వర్గాలను సమాజంలో ఆర్థికంగా సామాజికంగా ఉన్నతంగా నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పీ4 కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ అన్నారు. మార్గదర్శిగా నమోదుకు ఏ విధమైన ఒత్తిడి లేదన్నారు. ఆసక్తి కలిగిన వారు మార్గదర్శకులుగా http://zeropovertyp4.ap.gov.in వెబ్సైట్లో నమోదు కావచ్చునని గురువారం ఒక ప్రకటనలో సూచించారు.
భీమవరంలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ‘పీ4’ కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్థిక అసమానతలు, పేదరికం లేని సమాజాన్ని రూపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.
మొగల్తూరు ఎమ్మార్వో రాజ్ కిశోర్ ను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. మంగళవారం ఎమ్మార్వోకు ఐఏఎస్ను అంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. MRO బంధువు స్థానిక పీహెచ్సీ వద్ద ఉన్నాడని అతనికి అత్యవసరంగా డబ్బులు అవసరమని ఫోన్పే చేయాలని సూచించారు. ఎమ్మార్వో వస్తున్నా అని చెప్పగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు సమాచారం.
ఆక్వా జోన్ సర్వేలో నిబంధనలు కచ్చితంగా పాటించి నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ అన్నారు. భీమవరం జేసి ఛాంబర్లో మంగళవారం మత్స్య, గృహ నిర్మాణ శాఖలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మండల లెవెల్ కమిటీ అధికారులు అందరూ ఆక్వా జోన్లో ప్రతిపాదించిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమాన్ని రెండు వారాల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
జ్వరంతో చికిత్స పొందుతూ పుట్టినరోజు నాడే చిన్నారి మృతి చెందిన విషాద ఘటనన కుక్కునూరులో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని చీర వెళ్లి గ్రామానికి చెందిన చిన్నారి సహస్ర (5)కు నాలుగు రోజుల క్రితం జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం భద్రాచలం ఆసుపత్రిలో చేర్చారు. శనివారం ప్లేట్లెట్ల సంఖ్య 15 వేలకు పడిపోవడంతో మెరుగైన వైద్యానికి ఖమ్మం ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.
రైతుల సమస్యలు, ఎరువుల కొరతపై జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డికి వైసీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు వినతిపత్రం అందజేశారు. సోమవారం భీమవరంలో ఆయన కలెక్టర్ను కలిశారు. నర్సాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు, ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త చెరుకువాడ రంగనాథరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్మిక చట్టాల అమలులో అధికారులు చొరవ చూపాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మహిళా కార్మికుల హక్కులను, శ్రేయస్సును కాపాడాలని, బాల కార్మికులను నియమించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యాక్టరీల్లో మహిళా కార్మికుల నిబంధనలను పాటించాలన్నారు.
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమంపై సోమవారం భీమవరం కలెక్టరేట్లో అవగాహన సదస్సు జరిగింది. ఇన్ఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడాప్షన్ రెగ్యులేషన్స్ 2022 ప్రకారం దత్తత తీసుకునే విధానాలను వివరించారు. దత్తత పొందాలనుకునేవారు www.cara.nic.in పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పోలీసు పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం కార్యక్రమంలో 11 అర్జీలను స్వీకరించారు. జిల్లా ఎస్పీ నయీం అస్మీ మాట్లాడుతూ.. ప్రజా పిర్యాదులపై నిర్లక్ష్యం వహించకుండా నిర్ణీత గడువులోగా చట్టపరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారి సమస్యలను విన్నారు.
జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ సంస్థ ఆధ్వర్యంలో దత్తత కార్యక్రమంపై సోమవారం భీమవరం కలెక్టరేట్లో అవగాహన సదస్సు జరిగింది. ఇన్ఛార్జ్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అడాప్షన్ రెగ్యులేషన్స్ 2022 ప్రకారం దత్తత తీసుకునే విధానాలను వివరించారు. దత్తత పొందాలనుకునేవారు www.cara.nic.in పోర్టల్లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.