WestGodavari

News September 4, 2024

ప.గో: అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉంది: కలెక్టర్

image

మరో 2 రోజుల్లో అల్పపీడనం రూపంలో ప్రమాదం పొంచి ఉందని జిల్లా కలెక్టర్ నాగరాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాలను గుర్తించి పటిష్ఠ పరచడానికి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఏఈలు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలన్నారు.

News September 4, 2024

ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్

image

పశ్చిమ మధ్య బంగాళఖాతంలో రానున్న 24గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఆస్కారం ఉందని వివరించింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. సముద్రతీరం వెంబడి 35-45 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.

News September 4, 2024

పోలవరం: గోదావరికి పెరుగుతున్న వరద

image

గోదావరి నీటిమట్టం మంగళవారం అనూహ్యంగా పెరిగింది. రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 40 అడుగులకు చేరింది. బుధవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయి. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి 4,56,011 క్యూసెక్కుల జలాలను దిగువకు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. స్పిల్‌వే ఎగువన 29.830 మీటర్లు, దిగువన 20.340 మీటర్ల నీటి మట్టం నమోదైనట్లు ఈఈలు మల్లికార్జునరావు, వెంకటరమణ తెలిపారు.

News September 4, 2024

ప.గో.: క్రీడాజట్ల ఎంపిక పోటీలు వాయిదా

image

ఉమ్మడి ప.గో.జిల్లా స్థాయి క్రీడా జట్ల ఎంపిక పోటీల్లో భాగంగా 4న జరగాల్సిన ఎంపిక పోటీలను వర్షం, వరదల కారణంగా వాయిదా వేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పెదవేగిలోని గురుకుల విద్యాలయంలో బాల, బాలికలకు సాఫ్ట్‌బాల్‌, బేస్‌బాల్‌, అథ్లెటిక్స్‌, సెపక్‌ తక్రా, కుస్తీ పోటీలను వాయిదా వేశామన్నారు. మిగిలిన పోటీలను ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ నెల 6వ తేదీ నుంచి 21వ తేదీ సోమవారం వరకు యధాతథంగా జరుగుతాయన్నారు.

News September 4, 2024

ఏలూరు: అవసరమైతే సెలవు ఇవ్వండి: DEO

image

ఏలూరు జిల్లాలోని ముంపు మండలాల్లో (పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు) నేడు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక మిగతా మండలాల్లో అవసరం మేర సెలవు ఇవ్వాలని MEOలకు, పాఠశాల హెచ్ఎంలకు డీఈవో అబ్రహం బుధవారం సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా పాఠశాలలు నడపడానికి, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంటే మాత్రమే పాఠశాలలకు సెలవు ఇవ్వాలన్నారు. అవసరమైతేనే ఈ నిర్ణయం తీసుకోవాలన్నారు.

News September 4, 2024

నరసాపురం: 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి యత్నం

image

బాలికపై అఘాయిత్యానికి యత్నించిన నిందితుడిపై మంగళవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు నరసాపురం పట్టణ SI జయలక్ష్మి తెలిపారు. వివరాలు.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి(50) తన ఇంటి ముందు ఆడుకుంటున్న బాలిక(9)ను ఇంట్లోకి తీసుకెళ్లి తలుపులు వేసే ప్రయత్నం చేశారు. ఆ బాలిక తప్పించుకొని ఇంటికి వెళ్లి తల్లితో చెప్పింది. దీంతో బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 4, 2024

ఏలూరు జిల్లాలో 26,398 మెట్రిక్ టన్నుల ఇసుక సరఫరా

image

ఏలూరు జిల్లాలో ఇంతవరకు 26,398 మెట్రిక్ టన్నుల ఇసుకను వినియోగదారులకు అందించినట్లు మైనింగ్ డీడీ రవికుమార్ మంగళవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక బుకింగ్ సెంటర్ల ద్వారా 1,825 మెట్రిక్ టన్నులు వినియోగదారులకు సరఫరా చేశామని అన్నారు. మొత్తం 133 ఆర్డర్లకు ఇసుక సరఫరా అయ్యిందన్నారు. వినియోగదారుల నుంచి 2 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కరించామని స్పష్టం చేశారు.

News September 3, 2024

కాసేపట్లో 1వ ప్రమాద హెచ్చరిక.. రేపు ఈ మండలాల్లో సెలవు

image

భద్రాచలం వద్ద గోదావరి పెరిగిందని, కుక్కునూరు, వేలేరుపాడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. కాసేపట్లో 1వ ప్రమాద హెచ్చరిక వచ్చే ఛాన్స్ ఉందంటూ టోల్ ఫ్రీ నంబర్ 18002331077 ప్రకటించారు. పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. మిగిలిన మండలాల్లో వాతావరణాన్ని బట్టి సెలవు ఇచ్చుకోవచ్చన్నారు.

News September 3, 2024

వరద బాధితులకు పెద్ద ఎత్తున సహాయం: కలెక్టర్

image

గత రెండు రోజులుగా విజయవాడలో కొనసాగుతున్న వరద సహాయ చర్యల్లో భాగంగా ప.గో జిల్లా నుంచి 1,98,960 ఆహార పొట్లాలు, 70వేల వాటర్ ప్యాకెట్లు, 5 వేల వాటర్ బాటిల్స్, 1,15,100 బిస్కెట్ ప్యాకెట్స్, 14వేల బన్స్, 22వేల రస్కులు పంపించినట్లు కలెక్టర్ నాగరాణి తెలిపారు. పకృతి వైపరీత్యాల సమయంలో ఆపన్న హస్తం అందించడానికి ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.

News September 3, 2024

ఏలూరు: భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

image

భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. 3న తిరుపతి- విశాఖపట్నం, 4న నాగర్‌సోల్- నరసాపురం రైళ్లను రద్దు చేశామన్నారు. విశాఖపట్నం- ఢిల్లీ, విశాఖపట్నం- హైదరాబాద్ రైళ్లను దారి మళ్లించినట్లు వివరించారు. ప్రయాణికులు గమనించి సహకరించాలని కోరారు.