WestGodavari

News March 10, 2025

P24 సర్వే శ్రద్ద పెట్టి చేయాలి: జిల్లా కలెక్టర్

image

ఆకివీడులో జరుగుతున్న P4 సర్వేను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో P4 సర్వే నిర్వహిస్తున్నామన్నారు. సర్వే చేసేటప్పుడు శ్రద్ధ పెట్టి చేయాలని, ఎలాంటి తప్పులు ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా, వార్డు సచివాలయ అధికారి దాసిరెడ్డి పాల్గొన్నారు

News March 10, 2025

భీమవరంలో నలుగురు క్రికెట్ బుకీలు అరెస్ట్

image

భారత్ -న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆదివారం జరిగింది. భీమవరం పట్టణంలోని నరసయ్య అగ్రహారానికి చెందిన కొందరు యువకులు దీనిపై క్రికెట్ బుకింగ్ నిర్వహిస్తున్నారని సమాచారం మేరకు వన్ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నలుగురు క్రికెట్ బుకీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News March 10, 2025

ప.గో: సంజయ్ దత్‌ను కలిసిన రఘురామ

image

ఏఎంఆర్ సంస్థ ఛైర్మన్ మహేశ్ రెడ్డి కుమారుడు దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి కుమార్తె రిసెప్షన్ హైదరాబాద్‌లో ఆదివారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పాల్గొని నూతన వధువరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ రిసెప్షన్లో తన పాత మిత్రుడు సంజయ్ దత్‌ను కలిశారు.

News March 10, 2025

పి4 సర్వే సర్వేను వేగవంతం చేయాలి.. జిల్లా కలెక్టర్

image

పీఫోర్ సర్వే సమర్థవంతంగా నిర్వహించడంతో సామాన్యుల జీవన ప్రమాణాలు పెరుగుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. ఆదివారం ఆకివీడులో జరుగుతున్న బిఫోర్ సర్వే‌ను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత యువతను ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ఎటువంటి లోపాలు లేకుండా సర్వేను పూర్తి చేయాలని ఆమె సిబ్బందికి దిశా నిర్దేశించారు.

News March 9, 2025

ప.గో: రేపు యథావిధిగా పీజీఆర్ఎస్

image

మార్చి 10 నుంచి ప్రతి సోమవారం యథావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పట్టబద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా గత నెల రోజులుగా తాత్కాలికంగా నిలుపుదల చేసిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని రేపటి నుంచి యథావిధిగా ప్రారంభిస్తామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.

News March 9, 2025

TPG: రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తాడేపల్లిగూడెం మండలం కడియద్ద శివారులో కారు ఢీకొని పద్దాలు (48) అనే వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ పోలీసులు శనివారం రాత్రి తెలిపారు. మృతుడు అరటి పండ్ల వ్యాపారం నిమిత్తం వెళ్లి స్వగ్రామం కృష్ణాపురం సైకిల్‌పై వస్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు శివ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 8, 2025

తణుకు: జాతీయ లోక్‌అదాలత్‌లో 723 కేసులు రాజీ

image

తణుకు కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌ కార్యక్రమంలో 723 కేసులు రాజీ చేసినట్లు నాలుగో అదనపు జిల్లా జడ్జి డి.సత్యవతి తెలిపారు. వీటిలో 712 సివిల్‌ కేసులు ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.కృష్ణ సత్యలత, రెండో స్పెషల్‌ బెంచ్‌ మెజిస్ట్రేట్‌ తాడి ఆంజనేయులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు సూరంపూడి కామేష్‌ తదితరులు పాల్గొన్నారు.

News March 8, 2025

ప.గో: తొలి ప్రయత్నంలోనే DSP అయ్యారు..!

image

డాక్టర్ చదివిన ఓ మహిళ అనూహ్యంగా పోలీసయ్యారు. అదీనూ తొలిప్రయత్నంలోనే కావడం విశేషం. ఆమే నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేద. పోలీసు కావాలనే లక్ష్యంతో డాక్టర్‌గా పనిచేస్తూనే గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం సాధించారు. నరసాపురం డీఎస్పీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలరని ఆమె చెప్పారు. #HappyWomensDay

News March 8, 2025

ఢిల్లీలో ప.గో జిల్లా సర్పంచ్

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి రావాలని ఉండి మండలం మహాదేవపట్నం సర్పంచ్ వెంకట సుబ్బలక్ష్మికి ఆహ్వానం రావడంతో ఢిల్లీ వెళ్లారు. తమ గ్రామంలో చేసిన అభివృద్ధి, చేయబోయే కార్యక్రమాల గురించి వర్క్ షాప్‌లో వివరించారు. ఢిల్లీలో జరిగే కార్యక్రమానికి ప.గో జిల్లా మహిళకు అవకాశం రావడంపై అందరూ అభినందిస్తున్నారు.
#HappyWomensDay

News March 8, 2025

భీమవరం: డీఎస్సీ ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు

image

ప.గో జిల్లా పరిధిలోని బీసీ, ఈబీసీ సామాజిక వర్గాలకు డీఎస్సీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ నిమిత్తం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు బీసీ సంక్షేమ సాధికారత అధికారి గణపతిరావు తెలిపారు. కలెక్టరేట్లో ఈ నెల 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. బీఈడీ, టీటీసీతోపాటు టెట్ పరీక్షలో అర్హత సాధించి ఉండాలని, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.