WestGodavari

News August 27, 2024

గతాన్ని మర్చిపోయి మాట్లాడితే నేను వస్తా: బొలిశెట్టి

image

తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ హీరో అల్లు అర్జున్‌పై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ‘X’ వేదికగా మరోసారి స్పందించారు. “నాకు ఇష్టమైతే నేను వస్తా’ ఓ మెగా అభిమానిగా చిరంజీవి, నాగబాబు, పవన్‌ను ఎవరైనా గౌరవం లేకుండా మాట్లాడితే నేను వస్తా! గతాన్ని మర్చిపోయి మాట్లాడితే కచ్చితంగా వస్తా! నేను చెప్పదలుచుకున్నదేంటంటే నా వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతం. ఒక అభిమానిగానే స్పందించా’నని అన్నారు.

News August 27, 2024

భీమవరంలో రోడ్డు పక్కన మహిళ డెడ్‌బాడీ

image

భీమవరంలోని 37వ వార్డులో ఉండి రోడ్డు పక్కన జంట కాలువ వద్ద స్థానికులు ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇవ్వగా… సీఐ కాళీచరణ్, వీఆర్వో అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని సీఐ తెలిపారు. డెడ్‌బాడీ పూర్తిగా కుళ్లిపోయి గుర్తించలేని స్థితిలో ఉందని అన్నారు. కేసు దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు.

News August 27, 2024

ప.గో: నేటి నుంచి ఫార్మెటివ్ పరీక్షలు

image

పశ్చిమగోదావరి జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి సెప్టెంబరు 4వ తేదీ వరకు ఫార్మెటివ్ పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి. నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా 1 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఓఎంఆర్ షీట్లపై.. 9, 10 తరగతుల విద్యార్థులు పాత విధానంలో పరీక్ష రాయాల్సి ఉంటుందని చెప్పారు.

News August 27, 2024

ప.గో: మస్కట్ నుంచి మరికొద్ది గంటల్లో ఇంటికి.. అంతలోనే..!

image

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం కోరుమామిడిలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన మహిళ ఉద్యోగ రీత్యా మస్కట్‌లో నివాసం ఉంటుంది. సోమవారం మస్కట్ నుంచి విజయవాడకు చేరుకుంది. మరికొద్ది గంటలలో స్వగ్రామానికి చేరే సమయంలో గుండెనొప్పితో బస్సులోనే మరణించింది. ఆమె మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News August 27, 2024

ఏలూరు: ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

image

ఏలూరు నగరంలోని స్థానిక సుంకర వారి తోటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఈ నేపథ్యంలో చంటి అనే వ్యక్తిపై ఏసు అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చంటికి గాయాలు కాగా వెంటనే అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య వాగ్వాదం తలెత్తడంతో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 27, 2024

మదర్ థెరిసా విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి దుర్గేష్

image

ప్రతి ఒక్కరూ మదర్ థెరిసా సేవా గుణాన్ని ఆదర్శంగా తీసుకుని తోటి వారికి సహాయం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి పందులు దుర్గేష్ అన్నారు. నిడదవోలు పట్టణంలోని మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మదర్ థెరిసా విగ్రహాన్ని ఆమె జయంతి సందర్భంగా మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

News August 26, 2024

వైసీపీకి ఏలూరు మేయర్ రాజీనామా

image

ఏలూరు జిల్లాలో వైసీపీకి బిగ్‌ షాక్‌ తగిలింది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ షేక్‌ నూర్జహాన్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆమె పార్టీ అధినేత జగన్‌కు రాజీనామా లేఖ పంపించారు. పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అలాగే నూర్జహాన్‌తో పాటు ఆమె భర్త, కో-ఆప్షన్‌ సభ్యుడు పెదబాబు సైతం వైసీపీకి రాజీనామా చేశారు.

News August 26, 2024

పసికందు ప్రాణం కాపాడిన MLA బొలిశెట్టి

image

తాడేపల్లిగూడెం MLA బొలిశెట్టి శ్రీనివాస్ నెల వయసున్న బిడ్డ ప్రాణాన్ని కాపాడారు. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేష్-జ్యోత్స్న దంపతులకు పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో బిడ్డ జన్మించింది. ఆ పసికందుకు వెంటనే శస్త్రచికిత్స చేయాలని, లేకుంటే ప్రాణాపాయమని వైద్యులు చెప్పారు. దీంతో ఆ దంపతులు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేను ఆశ్రయించడంతో స్పందించిన ఆయన ఆపరేషన్ చేయించారు.

News August 26, 2024

ATMలో చోరీకి యత్నం.. అన్నదమ్ముల అరెస్ట్

image

ఏలూరు జిల్లా ముదినేపల్లి వైజంక్షన్‌లో ఉన్న యాక్సిక్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరీ జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. కైకలూరు స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. బెండి రామకృష్ణ, బెండి లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అన్నదమ్ములైన రామకృష్ణ, లక్ష్మీనారాయణ ఈనెల 14న ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు పేర్కొన్నారు.

News August 26, 2024

ATMలో చోరీకి యత్నం.. అన్నదమ్ముల అరెస్ట్

image

ఏలూరు జిల్లా ముదినేపల్లి వైజంక్షన్‌లో ఉన్న యాక్సిక్‌ బ్యాంక్‌ ఏటీఎంలో చోరి జరిగింది. ఈ కేసులో నిందితులను అరెస్ట్‌ చేసినట్లు సీఐ కృష్ణకుమార్‌ తెలిపారు. కైకలూరు స్టేషన్‌లో ఈ కేసు వివరాలను సోమవారం వెల్లడించారు. బెండి రామకృష్ణ, బెండి లక్ష్మీనారాయణను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. అన్నదమ్ములైన రామకృష్ణ, లక్ష్మీనారాయణ ఈనెల 14న ఏటీఎంను ధ్వంసం చేసి దొంగతనానికి యత్నించినట్లు పేర్కొన్నారు.