India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉండి మండలం యండగండి డెడ్ బాడీ పార్శిల్ కేసును పోలీసులు ఛేదించిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు, ముద్దాయిలను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నరసాపురం డీఎస్పీ డాక్టర్ జి.శ్రీవేదను శుక్రవారం జిల్లా ఎస్పీ నయీం ఆస్మి అభినందించారు. ఆయన చేతుల మీదుగా అభినందన జ్ఞాపికను డీఎస్పీ శ్రీవేద అందుకున్నారు.
ఉండి (M) యండిగండిలో తులసి ఇంటికి వచ్చిన పార్శిల్లో డెడ్బాడీ అయిన కేసులో పదేళ్ల చిన్నారి పాత్ర కూడా ఉందన్న విషయం సంచలనం రేపుతోంది. తులసి ఆస్తి కొట్టేయాలన్న కుట్రలో శ్రీధర్ వర్మ, అతని ఇద్దరి భార్యల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హత్యలో మూడో భార్య కుమార్తె హస్తం కూడా ఉందంటూ పోలీసులు ఆ చిన్నారిని నిందితురాలి జాబితాలో చేర్చారు. దీనిపై నేడు SP ఆద్నాం నయీం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించనున్నారు.
ద్వారకాతిరుమలలో నకిలీ కరెన్సీ వ్యవహరంలో వ్యాపారిని మోసం చేసిన ఘటన గురువారం జరిగింది. జంగారెడ్డిగూడెంకు చెందిన ఇద్దరు యువకులు సుభాష్ అనే వ్యాపారిని నగదు 2.50 లక్షలు ఇస్తే నకిలీ కరెన్సీ రూ.15 లక్షలు ఇస్తామంటూ నమ్మించారు. అసలు నోట్లను సుభాష్ ఇచ్చి యువకుల నుంచి బ్యాగ్ను తీసుకున్నారు. టాయ్ కరెన్సీ ఉండటంతో కంగుతున్న సుభాష్ తన బ్యాగ్ను లాక్కున్నాడు. ఒకరిని పోలీసులకు అప్పగించగా మరో యువకుడు పరారయ్యాడు.
ఏలూరు జిల్లాలో 983 సీసీ రోడ్డు నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం రూ.92.02 కోట్లు మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ గురువారం మాట్లాడుతూ.. జిల్లాలోని గ్రామాల్లో రహదారుల సమస్య లేకుండా పల్లె పండుగ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం రోడ్డు నిర్మాణాలు చేపట్టిందని, సంక్రాంతికి మంజూరు చేసిన సీసీ రోడ్డులు పూర్తి చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
తాళ్లపూడి మండలం బల్లిపాడులో నాలుగేళ్ల బాలుడు కాలువలో పడి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల కథనం మేరకు గురువారం బల్లిపాడు ఎస్సీ నివాసిత ప్రాంతంలో కాలువ గట్టున బాలుడు ఆడుకుంటూ కాలువలో పడ్డాడు. ఎవరు గమనించకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. తల్లి జాన్సీరాణి రోదన చూపరులకు కన్నీరు తెప్పించింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం దిశ మార్చుకుందని విశాఖ వాతావరణ శాఖ బుధవారం తెలిపింది. దక్షిణ తమిళనాడు, ఉత్తర తమిళనాడుకు సమీపంలో కొనసాగుతోంది. గురువారానికి వాయవ్యంగా పయనించి పశ్చిమ మధ్య, తీరానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో బలహీనపడుతుందని తెలిపింది. ఈ ప్రభావంతో నేడు, రేపు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు.
సంక్రాంతికి స్వగ్రామాలకు వచ్చే వారికి టిక్కెట్ల ధరలు గుబులు పుట్టిస్తున్నాయి. రైలు, బస్సు ఛార్జీలు ధరలు చూసి షాక్ అవుతున్నారు. హైదరాబాదు నుంచి భీమవరం, తణుకు మీదుగా 17 రైళ్లు నడుస్తున్నాయి. వాటిలో ఒక్క టిక్కెట్ కూడా దొరకని పరిస్థితి. ఏలూరు, భీమవరం, తణుకు ప్రైవేట్ ఏసీ స్లీపర్ ఛార్జీ రూ.1,100 ఉండగా దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుతం 50 బస్సులు ఉండగా, వాటిని 70కి పెంచినా డిమాండ్ తగ్గలేదంటున్నారు.
విహార యాత్ర విషాదాన్ని నింపింది. ద్వారకాతిరుమల (M) ఎం.నాగులపల్లి వద్ద ప్రమాదంలో ఓవ్యక్తి మృతి చెందగా, నలుగురు గాయపడ్డారు. ఘంటశాలకు చెందిన భాను ప్రకాశ్, గౌతమ్, వెంకట సాయి, చల్లపల్లికి చెందిన భార్గవ్, తేజలు విజయవాడ నుంచి కారు అద్దెకు తీసుకుని మారేడుమిల్లి విహార యాత్రకు బయలు దేరారు. నాగులపల్లి వద్ద బుధవారం వేకువ జామున ముందు వెళుతున్న లారీని కారు ఢీకొట్టింది. కారులో ఉన్న గౌతమ్ మృతి చెందాడు.
ఉండి మండలంలో తులసిని బెదిరించడానికి శ్రీధర్ వర్మ పర్లయ్యను చంపి పార్శిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో శ్రీధర్ భార్యలు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఆయన రెండో భార్య అయిన తులసి చెల్లెలు రేవతి కూడా పార్శిల్ పంపడానికి సహకారం అందించినట్లు తెలుస్తోంది. దీని కోసం ఆమె తన నగలు అమ్మేసి డబ్బులు సమకూర్చింది. మూడో భార్య సుష్మ డెడ్బాడీని ఆటో డ్రైవర్కు ఇవ్వగా ఆయన డోర్ డెలివరీ చేశాడు.
ఏలూరు ఆర్ఆర్పేట శ్రీవేంకటేశ్వర స్వామి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆకాంక్షించారు. బుధవారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను అర్చకులతో కలిసి ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే జనవరి 18వ తేదీ వరకు శ్రీవారి త్రిసప్తాహ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.