India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి ప.గో. జిల్లాకు సంబంధించి విద్యుత్ శాఖలో పని చేస్తున్న సీనియర్ అసిస్టెంట్లు నలుగురికి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు SE సాల్మన్ రాజు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్.వేణుగోపాల్ను తాడేపల్లిగూడెం నుంచి తణుకు, ఎం.శ్రీనివాసరాజును భీమవరం, చంద్రకళను నిడదవోలు నుంచి ఏలూరు టౌన్, యూవీవీ భాస్కరరావును తాడేపల్లిగూడెం నుంచి నిడదవోలు జేఏవోగా నియమించారు.
ఓ వ్యక్తి తమ ఫొటోలను మార్ఫింగ్ చేశాడని తాడేపల్లిగూడేనికి చెందిన అక్కాచెల్లెళ్లు విజయవాడ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇన్స్టాలో తమ వీడియోలు డౌన్లోడ్ చేసి నగ్నచిత్రాలుగా మార్చి కృష్ణా జిల్లాకు చెందిన గంగాధర్ వేధిస్తున్నాడని తెలిపారు. నిందితుడి జిల్లా కృష్ణా కావడంతో ఆన్లైన్లో సైబర్ విభాగంలో ఫిర్యాదుచేయాలని పోలీసులు సూచించారు. వారు ఆన్లైన్లో ఫిర్యాదుచేయగా ఫిర్యాదు అవనిగడ్డ PSకు వెళ్లింది.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు సాధించిన ఓట్ల శాతాన్ని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ADR) సంస్థ వెల్లడించింది. పాలకొల్లు MLAగా విజయం సాధించిన నిమ్మల అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్లశాతం పొందిన వారిలో 2వ స్థానంలో నిలిచారు. నియోజకవర్గంలోని మొత్తం ఓట్లలో 69.30 శాతం ఓట్లు సాధించి ఘనవిజయం సాధించారు. మొదటి స్థానంలో 70.24 శాతం ఓట్లతో విశాఖ దక్షిణ MLA వంశీకృష్ణ ఉన్నారు.
ఏలూరు జిల్లాలో ఓ మైనర్పై అత్యాచారం జరిగింది. పోలీసుల వివరాలు..టి.నరసాపురం మండలానికి చెందిన ఓ బాలిక జంగారెడ్డిగూడెంలో ఇంటర్ చదువుతూ హాస్టల్లో ఉంటుంది. ఓసారి ఆమె ఇంటికి వచ్చినపుడు గ్రామానికి చెందిన తాడి నాగకుమార్ అత్యాచారం చేశాడు. మళ్లీ ఈ నెల 6న బెదిరించి గ్రామశివారుకు పిలిపించి బలవంతంగా మరోముగ్గురితో కలిసి విశాఖపట్నం తీసుకెళ్లి హోటల్లో అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో వారిపై కేసునమోదైంది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం బోర్వంచకు చెందిన సతీష్ కుమార్ (29) ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం రెడ్డిగూడెం మండలానికి చెందిన ఓ యువతి పరిచయమైంది. కాగా ఈ నెల 13న ఉరేసుకొన్నాడు. అంత్యక్రియల తర్వాత సతీష్- యువతి చాటింగ్ వెలుగులోకి వచ్చింది. కుమారుడి మృతికి యువతి, శ్రీకాంత్, మల్లికార్జున రెడ్డి వేధింపులే కారణమని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. దీంతో మృతదేహం వెలికితీసి పంచనామా నిర్వహించారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రూప్చంద్, శీలావతి చేపల రేట్లు పెరగడంతో చేపల మార్కెట్లు కళకళలాడుతున్నాయి. సాధారణంగా కేజీ రూప్చంద్ చేపల పెంపకానికి రైతుకు అన్నీ కలిపి రూ.90 నుంచి రూ.95 వరకు ఖర్చవుతుంది. మార్కెట్లో ధర పెరగడంతో కేజీ చేప ధర రూ.114 పలుకుతోంది. దీంతో రూ.15 నుంచి రూ.20 గిట్టుబాటు అవుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులకు అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక గోదావరి సమావేశ మందిరంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన ఉపాధ్యాయులు జాతీయ అవార్డులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచినట్లు విద్యాశాఖ అధికారి అబ్రహం తెలిపారు. http://natioonlawardstoteachers.education.gov.in వెబ్సైట్ నందు అప్లికేషన్స్ పొందుపరిచామన్నారు. ఆగస్టు 18 వరకు అవకాశం ఉందని తెలిపారు. SHARE IT..
పదో తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. భీమవరం డివిజన్లో 66, ఏలూరు డివిజన్లో 48 పోస్టులను పోస్టల్ డిపార్ట్మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం-రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం-రూ.10 వేలు+అలవెన్సులు ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్సైట్ను సంప్రదించవచ్చు.
☞ SHARE IT..
ఏలూరు జిల్లాలో ఘోరం జరిగింది. లింగపాలెం మండలం పాశ్చానగరంలో CRPF కానిస్టేబుల్ సీహెచ్.బాలాజీ 2 నెలల పసిబాబును హతమార్చాడు. పాత కేసు విషయంలో సోమవారం ఏలూరు కోర్టుకు వచ్చిన బాలాజీ.. అక్కడ భార్య, ఆమె తండ్రిని చితకబాదాడు. అనంతరం పాశ్చానగరంలోని ఇంటికెళ్లి మరదలు, అత్తను తీవ్రంగా కొట్టి, మరదలి 2 నెలల బాబు పీక నులుమి చంపాడు. దీంతో స్థానికులు అతడికి దేహశుద్ధి చేశారు. ధర్మాజీగూడెం పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.